Earthquake: 6వేల ప్రకంపనలు.. 46వేల మరణాలు.. లక్షకుపైగా భవనాలు ధ్వంసం..!
తుర్కియే (Turkey), సిరియాలో సంభవించిన భూకంపంతో (Earthquake) మరణించిన వారి సంఖ్య 46వేలు దాటింది. ఇప్పటికే రెండు వారాలు కావడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి బతికే అవకాశం తక్కువగా ఉందని తుర్కియే ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ను ముగిస్తున్నామని తెలిపింది.
అంకారా: తీవ్ర భూకంపంతో తుర్కియే (Turkey), సిరియా (Syria)లు అల్లాడిపోయిన విషయం తెలిసిందే. ఈ విపత్తు సంభవించి దాదాపు రెండు వారాలు అయ్యింది . ఇప్పటికే రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 46 వేలు దాటింది. ఒక్క తుర్కియేలోనే 40 వేలకు పైగా మృతి చెందారు. సిరియాలో 5800కుపైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19రోజున సహాయక చర్యలను ముగిస్తామని తుర్కియే డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ (AFAD) ప్రకటించింది. భూకంపం (Earthquake) సంభవించి ఇప్పటికే 296 గంటలు దాటడంతో.. శిథిలాల్లో చిక్కుకుపోయినవారు ప్రాణాలతో మిగిలే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపింది.
6వేల ప్రకంపనలు..
ఫిబ్రవరి 6వ తేదీన భూకంపం సంభవించిన తర్వాత కూడా 11 ప్రావిన్సుల్లో వేల తదనంతర ప్రకంపనలు (Aftershocks) వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 6040 ప్రకంపనలు సంభవించినట్లు ఏఎఫ్ఏడీ వెల్లడించింది. ఇందులో 5 నుంచి 6 తీవ్రత మధ్య ఉన్నవి సుమారు 40వరకూ ఉన్నాయని.. కేవలం ఒక్కసారి మాత్రమే 6.6 తీవ్రతతో భూమి కంపించిందని పేర్కొంది. ఈ తరుణంలో కొండచరియలు, రాళ్లుపడిపోవడం వంటి తక్కువ మోతాదు విపత్తు ముప్పు పొంచి ఉందని ఏఎఫ్ఏడీ హెచ్చరించింది.
లక్షకుపైగా భవనాలు ధ్వంసం..
భూకంప తీవ్రతతో ప్రభావితమైన భవనాలను పరిశీలించగా.. అందులో 1,05,794 భవనాలు కూలిపోవడం లేదా తీవ్రంగా దెబ్బతినడం వల్ల కూల్చేసే పరిస్థితి తలెత్తిందని తుర్కియే పర్యావరణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే 20,662 భవనాలు పూర్తిగా కూలిపోయినట్లు తెలిపింది. వీటిలో మొత్తం 3,84,500 నివాసాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, ఇవి కేవలం తుర్కియేకు సంబంధించినవి మాత్రమేనని.. సిరియాలోనూ భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుందని వెల్లడించింది.
అంటువ్యాధుల భయం..
భూకంపం ధాటికి తుర్కియేలో వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం కావడంతో అక్కడి పర్యావరణ పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో వ్యాధుల భయం నెలకొందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే స్థానికంగా అంటువ్యాధులు పెరిగినప్పటికీ, తీవ్రమైన ముప్పు మాత్రం లేదని తుర్కియే ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించే పరిస్థితులపై పోరాడటం, అంటువ్యాధులను నివారించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని తెలిపింది.
ముగిసిన ‘ఆపరేషన్ దోస్త్’..
తుర్కియేలో సహాయక చర్యలకుగానూ భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ దోస్త్’ (Operation Dost) ముగిసింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ (NDRF) చివరి బృందం స్వదేశానికి చేరుకుంది. విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఈ విషయాన్ని వెల్లడించారు. మూడు బృందాల్లో మొత్తం 151 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, డాగ్స్క్వాడ్లు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. నుర్దాగీ, అంటక్యాలోని 35 ప్రాంతాల్లో మన సిబ్బంది సహాయక చర్యలు నిర్వహించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం