Ukraine Crisis: రష్యా బంగారంపై నిషేధం ?
రష్యా బంగారంపై యూకే, అమెరికా, కెనడా, జపాన్లు నిషేధం విధించనున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చుచేసేందుకు రష్యా వద్ద నిధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయంతీసుకొన్నారు. ఈ నిర్ణయం పుతిన్
ఇంటర్నెట్డెస్క్: రష్యా బంగారంపై యూకే, అమెరికా, కెనడా, జపాన్లు నిషేధం విధించనున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చుచేసేందుకు రష్యా వద్ద నిధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయంతీసుకొన్నారు. ఈ నిర్ణయం పుతిన్ యుద్ధ వనరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని యూకే పేర్కొంది. 2021లో రష్యా 15.4 బిలియన్ డాలర్లు విలువైన స్వర్ణాన్ని ఎగుమతి చేసింది. యుద్ధం ప్రారంభం కావడంతో రష్యా సంపన్నులు దీని కొనుగోళ్లను గణనీయంగా పెంచారు. జర్మనీలో జీ-7 భేటీ జరగనున్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
రష్యా బంగారాన్ని నిషేధించిన జాబితాలో జీ-7 దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ కూడా చేరాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. ‘‘బంగారం ఎగుమతుల నుంచి రష్యాకు పదుల బిలియన్ల డాలర్లు ఆదాయం సమకూరుతోంది. రష్యా నుంచి బంగారం దిగుమతులను నిషేధించినట్లు జీ-7 దేశాలు సమష్టిగా ప్రకటించాలి’’ అని బైడెన్ ట్విటర్లో కోరారు. బైడెన్కు మద్దతుగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్వరం కలిపారు. ‘‘పుతిన్ యుద్ధ నిధులను అడుగంటేలా చేయాలి. యూకే, మిత్రపక్షాలు ఇప్పుడదే చేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
లండన్ అతిపెద్ద గోల్డ్ ట్రేడింగ్ మార్కెట్లలో ఒకటి. తాజాగా యూకే మిత్రదేశాల చర్యలతో రష్యాకు నిధుల సమీకరణ కష్టం కానుంది. ఇప్పటికే అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్యలు కలిపి దాదాపు 1,000 మంది రష్యా సంపన్నులు, అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. తాజా చర్యతో రష్యా లభించే 13.5 బిలియన్ డాలర్ల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. యూకే పార్లమెంట్లో బిల్లును ఆమోదింపజేస్తే.. ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే