Boris Johnson: ‘పార్టీగేట్’ కుంభకోణం ఎఫెక్ట్.. బోరిస్ జాన్సన్కు భంగపాటు
బ్రిటన్లో ‘పార్టీగేట్’ కుంభకోణం ఎఫెక్ట్ కొనసాగుతోంది. ప్రధాని బోరిస్ జాన్సన్కు చేదు జ్ఞాపకాలను మిగుల్చుతోంది........
లండన్: బ్రిటన్లో ‘పార్టీగేట్’ కుంభకోణం ఎఫెక్ట్ కొనసాగుతోంది. ప్రధాని బోరిస్ జాన్సన్కు చేదు జ్ఞాపకాలను మిగుల్చుతోంది. బ్రిటన్ సింహాసనాన్ని క్వీన్ ఎలిజెబెత్-2 అధిష్ఠించి 70 ఏళ్లవుతున్న సందర్భంగా లండన్లో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరైన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. క్వీన్ ఎలిజెబెత్కు శుభాకాంక్షలు తెలిపేందుకు భార్య క్యారీతో కలిసి లండన్లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్కు బోరిస్ వెళ్లారు. అయితే అక్కడ ఉన్న ప్రజల్లో కొంతమంది పరుష పదజాలంతో హేళన చేశారు. వెకిలిగా మాట్లాడారు. అయితే మరికొందరు మాత్రం చప్పట్లతో ఆయనకు స్వాగతం పలికారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన మాజీ ప్రధానికి ప్రజల నుంచి ఘనస్వాగతం లభించడం విశేషం.
కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి.. ప్రభుత్వంలోని నేతలు, అధికారులతో కలిసి ప్రధాని బోరిస్ జాన్సన్ మద్యం విందులో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ‘పార్టీగేట్’ కుంభకోణంగా పిలిచే ఈ విందులపై ఏర్పాటు చేసిన స్యూ గ్రే కమిషన్ తన తుది నివేదికను సమర్పించింది. ఇందులో ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మద్యం విందులకు సీనియర్ నాయకత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జాన్సన్.. నివేదికలోని అంశాలను పార్లమెంట్లో అంగీకరించారు. పార్లమెంట్ వేదికగా క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి, ముందుకు కదులుదామని, ప్రభుత్వ ప్రాధాన్యతలపై దృష్టి పెడదామని పేర్కొన్నారు.
క్వీన్ ఎలిజెబెత్-2 ప్లాటినం జూబ్లీ వేడుకలు లండన్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రిటీష్ సైనిక సంప్రదాయం ప్రకారం గుర్రాలు, ఆయుధాలు, ఫైటర్ జెట్లతో ప్రదర్శన నిర్వహించారు. నాలుగు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. తొలిరోజు గురువారం బకింగ్హామ్ ప్యాలెస్లోని బాల్కనీ నుంచి రాణి గౌరవ వందనం స్వీకరించారు. 70 ఏళ్ల ప్రస్థానానికి చిహ్నంగా చివరి రోజున 70 ఎయిర్క్రాఫ్ట్లు ఆకాశంలో విన్యాసాలు చేయనున్నాయి. వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. 1953 జూన్ 2న ఎలిజెబెత్ రాణి పట్టాభిషేకం జరిగింది. 96 ఏళ్ల క్వీన్ ఎలిజెబెత్-2 బ్రిటన్లో ఎక్కువ కాలం సింహాసనాన్ని అధిష్ఠించిన రాణిగా చరిత్రలో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.