Britain royal family: బ్రిటన్ రాజు పట్టాభిషేకం.. ఉపయోగించే ఆభరణాలివే!
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 (King Charles III) పట్టాభిషేకంలో భాగంగా మే 6న నిర్వహించబోయే కార్యక్రమంలో ఏయే అభరణాలను, వస్తువులను వినియోగిస్తారో బ్రిటన్ రాజ కుటుంబం (Britain Royal Family) ట్విటర్ ద్వారా వెల్లడించింది.
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణం తర్వాత ఆ స్థానంలో కింగ్ ఛార్లెస్-3కి పట్టాభిషేకం చేయాలని రాయల్ ఫ్యామిలీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 6న ఆయనకు రాజకుటుంబ సంప్రదాయాల ప్రకారం పట్టాభిషేకం నిర్వహించనున్నారు. తాజాగా ఆ రోజున రాజుతోపాటు భార్య కెమిల్లాకు అలంకరించబోయే నగల వివరాలను రాయల్ ఫ్యామిలీ వెల్లడించింది.
‘‘ రాజకిరీటంలో పొదిగిన నగలు దేశంలోనే అత్యంత విలువైనవి. పట్టాభిషేక వేడుకలో ఉపయోగించే వస్తువులు.. రాజు అధికారాలను, బాధ్యతలను సూచిస్తాయి. వందల ఏళ్ల రాజప్రస్థానంలో పట్టాభిషేకానికి ప్రత్యేక పాత్ర ఉంది. బ్రిటన్ రాజకుటుంబ సంప్రదాయం ప్రకారం.. మే 6న వెస్ట్మినిస్టర్లోని అబేలో ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతుంది’’ అని రాయల్ఫ్యామిలీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
పట్టాభిషేక సమయంలో ఉపయోగించే ఆభరణాలు, వస్తువులివే..
1. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం
ఇది పూర్తిగా సాలిడ్ బంగారంతో చేసిన కిరీటం. విలువైన రాళ్లను ఇందులో అమర్చారు. పట్టాభిషేక సమయంలో దీనిని రాజు తలపై ఉంచుతారు. 1649లో అప్పటి మధ్యయుగంనాటి కిరీటం పాడైపోవడంతో దానికి బదులు 1661లో కింగ్ చార్లెస్-2 కోసం దీనిని తయారు చేశారు.
2. క్వీన్ మేరీ కిరీటం
పట్టాభిషేకం సమయంలో రాణికి ఈ కిరీటాన్ని ధరిస్తారు. పట్టాభిషేక కార్యక్రమానికి ముందు కిరీటంలో చిన్నపాటి మార్పులు చేయనున్నారు. క్వీన్ ఎలిజబెత్-2 వ్యక్తిగత ఆభరణాలైన కలినన్ 3, 4, 5 వజ్రాలను కిరీటానికి పొదుగుతారు.
3. ది ఇంపీరియల్ స్టేట్ కిరీటం
పట్టాభిషేకం ముగింపు సమయంలో ‘సెయింట్ ఎడ్వర్డ్స్ కిరీటం’ ధరించడానికి ముందు రాజు ఈ కిరీటాన్ని ధరిస్తారు. పార్లమెంట్ ప్రారంభోత్సవాల సమయంలోనూ ఈ కిరీటాన్ని ఉపయోగిస్తారు.
4.పట్టాభిషేక స్పూన్
పట్టాభిషేక కార్యక్రమంలో ఉపయోగించిన అన్ని వస్తువుల్లోకెల్లా ఇది అత్యంత ప్రాచీనమైనది. క్రతువులో భాగంగా రాజు తలకు పవిత్రమైన తైలాన్ని రాసేటప్పుడు ఈ స్పూన్ను ఉపయోగిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?