Ukraine Crisis: ‘రెండు లక్షలమందితో కొత్త బలగాలు.. మరోసారి కీవ్ ముట్టడికి రష్యా ప్లాన్..!’
తమ రాజధాని కీవ్ను ముట్టడించేందుకు రష్యా మరోసారి యత్నిస్తుందని ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్- ఇన్- చీఫ్ జనరల్ వాలేరీ జాలుజ్నీ తెలిపారు. జనవరి నెలఖరులోనే ఇది జరగొచ్చని అంచనా వేశారు.
కీవ్: ఉక్రెయిన్(Ukraine)పై సైనిక చర్యలో భాగంగా మొదట్లో దేశ రాజధాని కీవ్(Kyiv)ను ముట్టడించేందుకు రష్యా విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ప్రారంభ నెలల్లో కీవ్ ముట్టడికి మరో భారీ ప్రయత్నం జరగొచ్చని ఉక్రెయిన్ అంచనా వేస్తోంది. దేశ సాయుధ దళాల కమాండర్- ఇన్- చీఫ్ జనరల్ వాలేరీ జాలుజ్నీ(Valeriy Zaluzhny) తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రస్తుతం చాలా వరకు యుద్ధం.. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. అయితే, రాజధానిని మరోసారి లక్ష్యం చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు బలగాలను సమీకరించడం, యుద్ధానికి సిద్ధమవడమే మా ముఖ్యమైన విధి’ అని తెలిపారు.
‘రష్యా ప్రస్తుతం దాదాపు రెండు లక్షల మందితో కొత్త బలగాలను సిద్ధం చేస్తోంది. కీవ్ ముట్టడికి మరోసారి యత్నిస్తుందనే విషయంపై ఎటువంటి సందేహం లేదు. మార్చి, ఫిబ్రవరి.. లేదా జనవరి నెలాఖరులోనే ఇది జరగొచ్చు. ఈ క్రమంలో.. మాస్కో సేనలను ఎదుర్కొనే విషయంలో లెక్కలు వేశాం. ఉక్రెయిన్కు 300 ట్యాంకులు, 600- 700 పదాతిదళ పోరాట వాహనాలు, 500 హోవిట్జర్లు అవసరం’ అని జాలుజ్నీ తెలిపారు. ఉక్రెయిన్ దక్షిణ భాగం నుంచి తూర్పుదిశగా విస్తరించి ఉన్న తమ సరిహద్దులను కాపాడుకోవడం ముఖ్యమైన సవాలు అని పేర్కొన్నారు.
‘యుద్ధభూమిలో వరుస అవమానకర ఓటముల క్రమంలో.. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థపై రష్యా దాడులకు పాల్పడుతోంది. ఎందుకంటే.. రాబోయే నెలల్లో భారీ దాడులకు వనరుల సేకరణ కోసం మాస్కో సేనలకు సమయం కావాలి’ అని చెప్పారు. క్షిపణులు, డ్రోన్ దాడుల ద్వారా పవర్ గ్రిడ్ విధ్వంసం సాధ్యమేనని చెబుతూ.. ఈ విషయంలో తాము ప్రస్తుతం పతనం అంచున ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. ఇదిలా ఉండగా.. రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్ విద్యుత్ నెట్వర్క్ ఇప్పటికే తీవ్రంగా ధ్వంసమైంది. విద్యుత్ అంతరాయాల కారణంగా లక్షలాది ఉక్రెనియన్లు అంధకారంలో చిక్కుకుపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!