Ukraine Crisis: జెలెన్స్కీ-పుతిన్ల భేటీ సాధ్యమే.. కానీ..!
ఉక్రెయిన్, రష్యా అధ్యక్షుల మధ్య సమావేశం సాధ్యమేనని రష్యా అధ్యక్ష భవనం పేర్కొంది. కానీ, ఇందుకు ముందస్తు సన్నద్ధత అవసరమని అభిప్రాయపడింది.
అమెరికా తీరు అగ్రదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీయొచ్చన్న రష్యా
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దండయాత్ర మూడు నెలలైనా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నప్పటికీ రష్యా బలగాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్, రష్యా అధ్యక్షుల మధ్య సమావేశం సాధ్యమేనని రష్యా అధ్యక్ష భవనం పేర్కొంది. కానీ, ఇందుకు ముందస్తు సన్నద్ధత అవసరమని అభిప్రాయపడింది. ఇక ఉక్రెయిన్కు అత్యాధునిక రాకెట్లను అందజేస్తామని అమెరికా ప్రకటించడాన్ని తప్పుపట్టిన రష్యా.. ఇటువంటి చర్యలు రెండు అగ్రదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీస్తాయని హెచ్చరించింది.
వారి భవిష్యత్తు వారి చేతుల్లోనే..
ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన కార్యాచరణ చాలా రోజుల కిందటే నిలిచిపోయిందని.. మళ్లీ దానిని ప్రారంభించలేదని రష్యా అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. ఖెర్సన్, ఝపోరిజియా, డాన్బాస్ ప్రాంతంలోని ప్రజలు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలన్న ఆయన.. వారు సరైన నిర్ణయం తీసుకుంటారనడంలో రష్యాకు ఎటువంటి అనుమానాలూ లేవని అన్నారు. ఈ మూడు ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకోవడం వల్ల ఇరు పక్షాల మధ్య శాంతి చర్చలు ముగిసిపోతాయని ఉక్రెయిన్ గతంలో చెప్పిందని మీడియాతో మాట్లాడిన సందర్భంలో గుర్తుచేశారు.
అగ్రదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణే..
ఉక్రెయిన్కు అధునాతన రాకెట్ వ్యవస్థలు, యుద్ధ సామగ్రిని అందజేస్తామని అమెరికా చేసిన ప్రకటనను రష్యా తీవ్రంగా తప్పుపట్టింది. ఈ రకమైన చర్యల వల్ల రెండు అగ్రదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉక్రెయిన్కు అమెరికా సైనిక సాయం చేయడాన్ని రష్యా తీవ్ర ప్రతికూల అంశంగానే పరిగణిస్తామని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉక్రెయిన్ విషయంలో ఓ పరిష్కారం కనుక్కోవడంలో అమెరికా ఏమీ చేయడం లేదని.. సైనిక చర్యకంటే ముందు చాలా ఏళ్లుగా ఇదే విధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్