Ukraine Cholera: ఉక్రెయిన్కు కొత్త సంకటం.. కలవరపెడుతున్న కలరా!
దాదాపు నాలుగు నెలలుగా రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్కు మరో కొత్త సంకటం వచ్చి పడింది....
కీవ్: దాదాపు నాలుగు నెలలుగా రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్కు మరో కొత్త సంకటం వచ్చి పడింది. పేరుకుపోయిన చెత్త, కుళ్లిన శవాలు, కలుషిత నీరు వాటి చుట్టూ ముసురుతున్న కీటకాలు ఇప్పుడు అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రష్యా బాంబులతో అట్టుడుకిపోయిన మరియుపోల్, ఖేర్సన్ వంటి నగరాల్లో ఎక్కడ చూసినా శవాలే దర్శనమిస్తున్నాయి. దీంతో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు ‘కలరా వ్యాధి’కి దారితీస్తున్నాయి. ఇప్పటికే పలు కేసులను గుర్తించినట్లు మరియుపోల్ గవర్నర్ ధ్రువీకరించారు. మూడు నెలల నిరంతర దాడుల తర్వాత రష్యా ఈ నగరాన్ని మే నెలలో తమ గుప్పిట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే.
కుళ్లుతున్న శవాల చుట్టూ ముసురుతున్న ఈగలు, బొద్దింకల వంటి కీటకాలు కలరా వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రానురానూ ఈ వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చి రోజుల వ్యవధిలో వేల మందిని పొట్టనబెట్టుకునే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రష్యా దాడుల్లో సొంతవారిని కోల్పోయి నిరాశ్రయులుగా మారిన అనేక మందికి కలరా రూపంలో మరో ప్రమాదం పొంచి ఉండడం పట్ల ఐక్యరాజ్య సమితి సైతం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
గత నెల రోజులుగా పలు కలరా కేసుల్ని గుర్తించినట్లు ఉక్రెయిన్ నియమించిన మరియుపోల్ గవర్నర్ తెలిపారు. మరిన్ని అంటువ్యాధులు కూడా ప్రబలుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రష్యా నియమించిన గవర్నర్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఒక్క కలరా కేసు కూడా వెలుగులోకి రాలేదని తెలిపారు. అయితే, రష్యా గుప్పిట్లో ఉన్న ఈ నగరం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ తెలిపింది.
దాదాపు మూడు నెలల పాటు జరిపిన దాడుల్లో ఏప్రిల్ నాటికే మరియుపోల్లో 10వేల మంది మరణించినట్లు అంచనా. ఆ తర్వాత కూడా కొన్ని వారాల పాటు యుద్ధం కొనసాగిన నేపథ్యంలో మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. మరియుపోల్లో తాగునీటిలో మురుగునీరు చేరుతోందని.. ఇది కలరా సహా ఇతర అంటువ్యాధులకు దారితీసే అవకాశం ఉందని ఇటీవల ఐరాస, రెడ్క్రాస్ హెచ్చరించాయి. మరోవైపు ఔషధాల కొరత కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు కూడా అందుబాటులో లేరని మరియుపోల్ నగర స్థానికులు తెలిపారు. రష్యన్ అధికారులు 80 ఏళ్లు పైబడిన రిటైర్డ్ డాక్టర్లను నియమిస్తున్నారని పేర్కొన్నారు.
కలరా చాలా తీవ్రమైనది. సకాలంలో చికిత్స అందకపోతే ఈ జబ్బు కొన్ని గంటల్లోనే మరణానికి దారితీస్తుంది. ఇది ‘విబ్రియో కలరే’ అనే బాక్టీరియా వల్ల వస్తుంది. దీనితో కలుషితమైన ఆహారం తినడం లేదా నీరు తాగడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అపరిశుభ్ర వాతావరణం, కలుషిత తాగునీటిలో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గతంలో ఈ వ్యాధి తీవ్ర మానవతా సంక్షోభాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా నగరాల్లో శానిటేషన్ సరిగా జరగడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే.. మరియుపోల్ సహా ఇతర ప్రాంతాలనూ ఈ అంటువ్యాధుల సమస్య చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..