Ukraine Crisis: ఉక్రెయిన్లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
ఉక్రెయిన్- రష్యా యుద్ధం తీవ్ర దశలో వేలాదిమంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు! అయితే, ఎప్పుడు ఎక్కడినుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ భయానక పరిస్థితుల్లో.. అనేక మంది తమవారికి సక్రమంగా తుది....
కీవ్: ఉక్రెయిన్- రష్యా యుద్ధం తీవ్ర దశలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఎప్పుడు ఎక్కడినుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ భయానక పరిస్థితుల్లో.. అనేక మంది తమవారికి సక్రమంగా తుది వీడ్కోలు పలకలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో లుహాన్స్క్ రీజియన్లోని రూబిజ్నే పట్టణ ప్రజలు.. యుద్ధం తారస్థాయిలో ఉన్నప్పుడు హడావుడిగా ఖననం చేయించిన మృతదేహాలను వెలికితీస్తున్నారు. వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 50 వేల జనాభా ఉన్న ఈ పట్టణం ప్రస్తుతం రష్యా మద్దతుకలిగిన లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్(ఎల్పీఆర్) ఆధీనంలో ఉంది.
యుద్ధ సమయంలో ధ్వంసమైన ఓ అపార్ట్మెంట్ బ్లాక్ వెలుపల ఇటీవల ఓ కందకాన్ని తిరిగి తవ్వారు. అందులోనుంచి ఆరు మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలోనే లిలియా అనే స్థానికురాలు.. తన తల్లి మృతదేహానికి చుట్టిన దుప్పటి ఆధారంగా ఆమెను గుర్తుపట్టారు. దాడుల సమయంలో 10 రోజులపాటు తన తల్లిదండ్రుల అపార్ట్మెంట్కు చేరుకోలేకపోయానని ఆమె వాపోయారు. ‘మా అమ్మ అప్పటికే మరణానికి చేరువైంది. ఆమె చేతులు నీలి రంగులోకి మారాయి. ముఖం వాడిపోయింది. మరుసటి రోజే ఆమె మరణించింది. అయితే.. ఎడతెగని దాడులతో అంత్యక్రియలు సరిగ్గా నిర్వహించలేని దుస్థితి. అమానవీయ పరిస్థితుల్లోనే ఆమె మృతదేహాన్ని బహిరంగ కందకంలో ఖననం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చుతాం’ అని వివరించారు.
తూర్పు ఉక్రెయిన్లో రష్యా మద్దతుగల లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్(ఎల్పీఆర్).. ప్రస్తుతం మృతదేహాల వెలికితీత ప్రక్రియను సమన్వయం చేస్తోంది. ఎల్పీఆర్ అధికారి అన్నా సోరోకినా మాట్లాడుతూ.. ఇటీవల ఒక బృందం రూబిజ్నేలో 10 రోజుల వ్యవధిలో 104 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. ఇలా నగరంలో దాదాపు 500 వరకు సామూహిక సమాధులు ఉన్నట్లు అంచనా వేశారు. ఇప్పటివరకు బయటపడిన మృతదేహాలకు చాలావరకు క్షిపణి, బాంబు దాడుల గాయాలున్నాయని, కొన్నింటికి బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయన్నారు. గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hamas: 200 హమాస్ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం
ఇజ్రాయెల్ (Israel) భీకరంగా వైమానిక దాడులను ప్రారంభించింది. నిన్న ఒక్క రాత్రే వందల కొద్దీ హమాస్ (Hamas) స్థావరాలపై దాడులు చేసింది. మరోవైపు గాజా పరిస్థితిపై చర్చించేందుకు అమెరికాకు చెందిన కీలక సభ్యుల బృందం ఇజ్రాయెల్కు వెళ్లనుంది. -
Volcano: ఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతం.. 11 మంది పర్వతారోహకుల మృతి
ఇండోనేషియాలో అగ్ని పర్వతం విస్ఫోటనం చెందిన ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృత్యువాత పడ్డారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైంది. -
Maldives: మాల్దీవులు నుంచి దళాలు వెనక్కి.. అంగీకరించిన భారత్: మయిజ్జు
మాల్దీవుల్లో సైన్యం ఉపసంహరణకు భారత్ అంగీకరించినట్లు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు వెల్లడించారు. -
Israel: గాజాలో భూతల దాడుల్ని విస్తరించాం: ఐడీఎఫ్
గాజాపై దాడులను విస్తరిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. తమ భూభాగంపై ఎవరు దాడి చేసినా దానికి తీవ్ర ప్రతిదాడి చేస్తామని, అదే తమ విధానమని ఐడీఎఫ్ ప్రతినిధులు వెల్లడించారు. -
జబాలియాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జబాలియా శరణార్థి శిబిరంపై ఆదివారం మరోసారి బాంబుల వర్షం కురిపించింది. -
మ్యూనిక్ ఎయిర్పోర్టులో మంచుతుపాను
నిత్యం రద్దీగా ఉండే జర్మనీలోని మ్యూనిక్ విమానాశ్రయం మంచులో కూరుకుపోయింది. భారీ మంచుతుపాను కారణంగా 760 విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
యుద్ధం తర్వాత గాజా భవిష్యత్తేంటి..?
హమాస్తో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత గాజా భవిష్యత్తు ఏమిటి..? అన్న విషయంపై ఇజ్రాయెల్ కసరత్తు చేస్తోంది. -
ఫిలిప్పీన్స్లో మళ్లీ భూకంపం
దక్షిణ ఫిలిప్పీన్స్ను ఆదివారం కూడా భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై 6.6గా తీవ్రతతో భూకంపం నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. -
కాప్-28 ఆరోగ్య డిక్లరేషన్పై సంతకం చేయని భారత్
ఆరోగ్యం, వాతావరణంపై కాప్-28 రూపొందించిన డిక్లరేషన్పై భారత్ సంతకం చేయలేదు. ఆరోగ్యరంగంలో శీతలీకరణకు వినియోగించే గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించాలని ఈ డిక్లరేషన్ చెబుతోంది. -
ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధనౌకపై దాడి
ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో అతలాకుతలమవుతున్న పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలకు దారితీసే సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. -
Tanzania: టాంజానియాలో విరిగిపడ్డ కొండచరియలు.. 47 మంది మృతి
టాంజానియాలో గతకొంతకాలంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడి 47 మంది మృతి చెందారు. మరో 85 మంది గాయపడ్డారు.


తాజా వార్తలు (Latest News)
-
Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్లోనూ డేటా బూస్టర్ ప్లాన్.. ధర ఎంతంటే?
-
Kiara Advani: డ్యాన్స్ చేయమంటే నవ్వులు పంచిన కియారా: ఈ డ్రెస్సులో చేయలేనంటూ!
-
Telangana: ముఖ్యమంత్రి.. మంత్రివర్గంపై కొలిక్కిరాని చర్చలు
-
GST: ఈ ఏడాది సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లు
-
Chandrababu: చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
-
Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం