Ukraine: జపరోషియా అణువిద్యుత్తు కేంద్రం దెబ్బతింది..!
ఉక్రెయిన్కు చెందిన జపరోషియా అణు విద్యుత్తు సైనిక దాడుల్లో కేంద్రం తీవ్రంగా దెబ్బతిందని ఉక్రెయిన్ పేర్కొంది. దక్షిణ ఉక్రెయిన్లో ఉన్న ఈ ప్లాంట్ ఐరోపా ఖండంలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రాల్లో ఒకటి. శుక్రవారం జరిగిన దాడుల్లో ఈ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతింది.
ఇంటర్నెట్డెస్క్: తమ దేశానికి చెందిన జపరోషియా అణు విద్యుత్తు కేంద్రం.. రష్యా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిందని ఉక్రెయిన్ పేర్కొంది. దక్షిణ ఉక్రెయిన్లో ఉన్న ఈ ప్లాంట్ ఐరోపా ఖండంలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రాల్లో ఒకటి. శుక్రవారం జరిగిన దాడుల్లో ఈ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతింది. దీనిలోని నైట్రోజన్, ఆక్సిజన్ ప్లాంట్లు, ఓ సహాయక భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కీవ్, మాస్కో పరస్పరం నిందారోపణలు చేసుకొంటున్నాయి.
ఈ దాడుల్లో ఒక పవర్ కేబుల్ దెబ్బతినడంతో ఓ రియాక్టర్ను మూసివేయాల్సి వచ్చింది. అయినప్పటికీ.. హైడ్రోజన్, రేడియోధార్మిక పదార్థాలు లీకయ్యే ముప్పు పొంచి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కాల్పులు జరుగుతుండటంతో ఈ ప్లాంట్ను సురక్షితంగా నిర్వహించడం కత్తిమీద సాములా మారింది. ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టగానే జపరోషియా ప్లాంట్ను రష్యా దళాలు ఆక్రమించాయి. ఆ తర్వాత రష్యా దళాలు అక్కడ భారీ ఆయుధాలను భద్రపర్చాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను రష్యా కొట్టి పారేస్తోంది. ఉక్రెయిన్ దళాలే ప్లాంట్లపై దాడులు చేస్తున్నాయని చెబుతోంది.
మరోవైపు జపరోషియా ప్లాంట్ వద్ద రష్యా సైనిక కార్యకలాపాలు చేపట్టడాన్ని ఐరోపా సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని సమాఖ్య దౌత్యవేత్త జోసఫ్ బారెల్ ట్విటర్లో పేర్కొన్నారు. అణు భద్రతను రష్యా బాధ్యతారాహిత్యంతో ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐఏఈఏ తమ సిబ్బందిని పంపి పరిస్థితిని అంచనావేసేందుకు గత కొన్ని వారాల నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM