Ukraine: క్రిమియాపై ఉక్రెయిన్ దాడి.. రష్యా క్రూజ్ క్షిపణుల ధ్వంసం
రష్యా ఆధీనంలోని క్రిమియాపై ఉక్రెయిన్ దాడిచేసింది. ఈ దాడిలో రష్యాకు చెందిన కల్బిర్ క్షిపణులు ధ్వంసమయ్యాయి.
ఇంటర్నెట్డెస్క్: క్రిమియాపై ఉక్రెయిన్ దళాలు దాడి చేసి రష్యాకు చెందిన అత్యాధునిక కల్బిర్ క్రూజ్ క్షిపణులను ధ్వంసం చేశాయి. ఈ క్షిపణులను జాన్కోయ్ అనే నగరం నుంచి రైలులో రవాణా చేస్తుండగా దాడి చేసినట్లు ఆ దేశ రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని నేరుగా వెల్లడించకపోయినా.. క్రిమియాను నిస్సైనిక ప్రాంతంగా మార్చి ఆ తర్వాత ఆక్రమణదారులను తరిమేయడం కొనసాగుతోందని పేర్కొన్నారు. మరోవైపు క్రిమియాపై దాడిని అక్కడ రష్యా నాయకుడు సెర్గీ అస్కినోవ్ కూడా క్రిమియా ద్వీపకల్పంపై దాడి జరిగనట్లు ధ్రువీకరించారు. ఈ దాడిలో ఓ వ్యక్తి గాయపడగా.. రెండు భవనాలు ధ్వంసమయ్యాయని అస్కినోవ్ పేర్కొన్నారు.
క్రిమియా ద్వీపకల్పంలో భారీ పేలుడు జరిగిన వీడియో ఒకటి ఆంగ్ల మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. రైల్వే స్టేషన్పై ఆ క్షిపణి దాడి జరిగిందని స్థానికులు వెల్లడిస్తున్నారు. క్రిమియాలో కీలకమైన ఎయిర్ ఫీల్డ్ల్లో జాన్కోయ్, గార్వెడెస్కోయ్లు కీలకమైనవి. వీటిల్లో జాన్కోయ్ కీలక రైల్వే కేంద్రం కూడా. దక్షిణ ఉక్రెయిన్ నుంచి ఇక్కడికి కీలకమైన యుద్ధ సామగ్రి సరఫరా అవుతుంది. దీంతోపాటు నల్లసముద్రంలో కీలకమైన నౌకాదళ స్థావరం క్రిమియాలోని సెవస్తోపోల్లో ఉంది. తాజాగా ఉక్రెయిన్ దాడిలో ధ్వంసమైన క్షిపణులు సెవస్తోపోల్లోని రష్యా నౌకదళాలకు అందాల్సి ఉంది.
2 బిలియన్ డాలర్ల విలువైన మందుగుండు..
ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల నుంచి భారీగా మందుగుండు సామగ్రి సరఫరా చేయడానికి రంగం సిద్ధంమైంది. వచ్చే ఏడాది కాలంలో కనీసం 10లక్షల శతఘ్ని గుండ్లను సరఫరా చేయడానికి అంగీకరించాయి. రష్యా దూకుడును అడ్డుకోవాలంటే కనీసం నెలకు 3.5లక్షల శతఘ్ని గుండ్లు అవసరం పడుతుందని ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి ఐరోపా సమాఖ్యకు సమాచారం వెళ్లింది. ఈ నేపథ్యంలో ఐరోపా దేశాల నుంచి 2 బిలియన్ డాలర్లు విలువైన మందుగుండు ఉక్రెయిన్కు అందనుంది. ఈ నిర్ణయం పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుందని ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి దిమిత్రి కులేబ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్