Ukraine Crisis: కీవ్కు అమెరికా మంత్రులు..!
దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ను ఇద్దరు అమెరికా మంత్రలు సందర్శించనున్నారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆదివారం భేటీ కానున్నారు.
ఇంటర్నెట్డెస్క్: రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ను ఇద్దరు అమెరికా మంత్రలు సందర్శించనున్నారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆదివారం భేటీ కానున్నారు. ఈ విషయాన్ని కీవ్ మెట్రో వ్యవస్థలో నిర్వహించిన ఓ విలేకర్ల సమావేశంలో జెలెన్స్కీ స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో భారీ ఆయుధాలను అందించాలని అమెరికాను కోరనున్నట్లు తెలిపారు. రష్యా ఆక్రమించుకొన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఈ ఆయుధాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
ఈ పర్యటనకు కొద్ది గంటల ముందు జెలెన్స్కీ మాట్లాడుతూ మేరియుపొల్లో మా సేనలకు అపకారం చేసినా.. కొత్తగా ఆక్రమించిన ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించినా.. శాంతి చర్చల నుంచి వైదొలగుతామని తేల్చిచెప్పారు. ఒక దశలో రష్యా అణ్వాయుధాలను కూడా వాడుతుందని తాను భావించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత సమయంలో ఉక్రెయిన్కు ఆయుధాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. శాంతి చర్చల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
‘‘మా చేతికి తగినన్ని ఆయుధాలు వీలైనంత తొందరగా అందితే.. రష్యా ఆక్రమణలో ఉన్న మా భూభాగాలను వెంటనే స్వాధీనం చేసుకొంటాం’’ అని జెలెన్స్కీ పేర్కొన్నారు. మేరియుపోల్లో రష్యా సేనల ఉచ్చులో చిక్కుకొన్న సైన్యాన్ని విడిపించేందుకు అవకాశం ఉన్న ఏ ఒప్పందానికైనా కీవ్ సిద్ధమని తెలిపారు. శనివారం ఉక్రెయిన్ దళాలకు అత్యంత కఠినమైన రోజుగా ఆయన అభివర్ణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?