Ukraine Cyber Army: కదం తొక్కిన ఉక్రెయిన్ సైబర్ దండు!
స్వచ్ఛందంగా ముందుకువస్తున్న ఐటీ నిపుణులు సైతం ‘డిజిటల్ ఆర్మీ’గా ఏర్పడి తమ వంతు కృషి చేస్తున్నారు.....
ఇంటర్నెట్ డెస్క్: తమపై భీకర దాడులకు దిగుతున్న రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్ అన్ని మార్గాలను వాడుకుంటోంది. విద్యార్థులు, న్యాయవాదులు, నటులు సైతం ఆయుధాలను చేతబట్టి సైనికులకు సహకరిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకువస్తున్న ఐటీ నిపుణులు ‘డిజిటల్ ఆర్మీ’గా ఏర్పడి తమ వంతు కృషి చేస్తున్నారు.
ఫిబ్రవరి 26న ఉక్రెయిన్ ఉపప్రధాని, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్ స్వచ్ఛంద ‘సైబర్ ఆర్మీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ రంగంలో అనేక మంది ఉక్రెనియన్లు ఉన్నారని.. వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సైబర్ వేదికపై దేశం తరఫున పోరాడాలని పిలుపునిచ్చారు. దీంతో లక్షలాది మంది ముందుకు వచ్చి తమవంతు సాయం చేస్తున్నారు.
స్వీయ నియంత్రణలో ఉన్న ఓ దండు..
‘తామంతా స్వీయనియంత్రణలో పనిచేస్తున్న ఓ దండు’లా ముందుకు సాగుతున్నామని డిజిటల్ ఆర్మీలో కీలకంగా వ్యవహరిస్తున్న 37 ఏళ్ల ఐటీ ఎగ్జిక్యూటివ్ రోమన్ జఖరోవ్ తెలిపారు. రష్యన్ వెబ్సైట్ల సేవల్ని అడ్డుకోవడంతో పాటు టెలిగ్రాం ఛానళ్లలో ప్రత్యేక బోట్లను నిర్వహించడం వరకూ అనేక కార్యక్రమాలను ‘స్టాండ్ ఫర్ ఉక్రెయిన్’ పేరిట ఏర్పడ్డ జఖరోవ్ బృందం నిర్వహిస్తోంది. తప్పుడు వార్తలను అడ్డుకోవడం, రష్యన్ సేనలు ఏయే ప్రాంతాలకు చేరుకున్నారు వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. దీని కోసం స్థానికంగా ఉన్న అనేక మందిని ప్రత్యేక ఛానళ్లలో చేర్చుతున్నారు. వారి ద్వారా సమాచారాన్ని రాబట్టి దాన్ని విశ్లేషించి ఎప్పటికప్పుడు ఇతరులకు పంచుతున్నారు. తమదైన వ్యూహాలు, విశ్లేషణల ద్వారా రష్యన్ సేనల్ని ఎలా అడ్డుకోవాలో సూచనలు చేస్తున్నారు.
నేరుగా రష్యన్లకే ఫోన్లు..
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉక్రెనియన్లు సైతం ఈ డిజిటల్ ఆర్మీలో పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ఆన్లైన్ యాడ్ బయ్యర్లు చురుగ్గా తమ సహకారాన్ని అందిస్తున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా గ్రాఫిక్స్ చేసి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. యుద్ధం వల్ల సంభవిస్తున్న దారుణాల్ని సందేశాల రూపంలో చేరవేస్తున్నారు. చివరకు నేరుగా రష్యన్లకు ఫోన్లు చేస్తున్నారు. మెయిళ్లు, టెక్ట్స్ మెసేజ్లు పంపుతున్నారు. ఉక్రెయిన్ వీధుల్లో తిరుగుతున్న రష్యన్ సైనికుల ఫొటోలు, వీడియోలు తీసి వారి స్వదేశానికి పంపుతున్నారు. ఈ చిత్రాలను వారి తల్లిదండ్రులు చూసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ డిజిటల్ ఆర్మీ చేస్తున్న పోరాట ఫలితాల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడం కష్టమే. అయితే, ఇప్పటికే అనేకసార్లు రష్యన్ వెబ్సైట్లను ఆఫ్లైన్లోని తీసుకెళ్లగలగడం గమనార్హం.
ఎంత పటిష్ఠమైనా రష్యాకు పాట్లు తప్పలేదు..
రష్యన్ ఆర్థిక వ్యవస్థ, క్రెమ్లిన్ నియంత్రణలో ఉన్న మీడియా, రైల్వేలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ ఐటీ ఆర్మీ దాడి చేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. రష్యన్ బ్యాంకింగ్ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి తప్పించుకునేలా పటిష్ఠంగా రూపొందించినప్పటికీ.. ఉక్రెనియన్ల హ్యాకింగ్ నైపుణ్యాలకు అవి తలొగ్గక తప్పలేదనే చెప్పాలి. ఇప్పటికే అనేకసార్లు రష్యా బ్యాంకింగ్ వ్యవస్థల టెలికమ్యూనికేషన్లలో అంతరాయాన్ని సృష్టించగలిగారు. రైలు టికెట్ల జారీ వ్యవస్థను దెబ్బతీయగలిగారు. టెలిఫోన్ సేవలకు సైతం అంతరాయం కలిగించగలిగారు.
ప్రమాదం కూడా..
ఉక్రెయిన్ ఐటీ ఆర్మీకి టెలిగ్రామ్లో 2,90,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, వీరందరి నుంచి రష్యన్ సేనల్ని నిలువరించగలిగే నిఘా సమాచారాన్ని మాత్రమే కోరుకుంటున్నామని ఓ ఉక్రెనియన్ సైబర్ నిపుణుడు తెలిపారు. ఈ స్థాయిలో ఐటీ వలంటీర్లు పనిచేయడం కూడా అంత శ్రేయస్కరం కాదని ఆయన హెచ్చరించారు. ఓ గుర్తుతెలియని సంస్థ ఇప్పటికే రష్యన్ ఉపగ్రహాన్ని హ్యాక్ చేసినట్లు ప్రకటించిందని తెలిపారు. అందులో వాస్తవం లేనప్పటికీ.. అది చాలా ప్రమాదకరమైన చర్య అని హెచ్చరించారు. అది మరింత భీకర యుద్ధానికి దారితీసినట్లవుతుందన్నారు. అంతరిక్షాన్ని దుర్వినియోగం చేసినట్లవుతుందన్నారు. ఇలా సైబర్స్పేస్ను అవాంఛనీయ దాడులకు వాడుకోవడాన్ని స్వాగతించలేమన్నారు.
రష్యా కూడా తగ్గట్లేదు..
మరోవైపు రష్యా సైతం రోజురోజుకీ సైబర్ దాడుల డోసుని పెంచుతున్నట్లు సమాచారం. ఉక్రెయిన్ వెబ్సైట్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని అక్కడి అధికారులు ఆరోపిస్తున్నారు. ఐరోపాలో శుక్రవారం అనేక ప్రాంతాల్లో అంతర్జాల సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. విద్యుత్తు సరఫరా సైతం దెబ్బతిన్నట్లు ప్రభుత్వాలు ధ్రువీకరించాయి. ఈ-మెయిళ్ల ద్వారా వైరస్లను చొప్పించి ఆయా పరికరాలు పనిచేయకుండా చేస్తున్నట్లు సమాచారం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
లైంగిక నేరారోపణల కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్(72)కు ఓ కేసులో ఊరట లభించింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?