Ukraine Crisis: రష్యా ట్యాంక్లకు ఉక్రెయిన్ ఉచ్చు..!
ఉక్రెయిన్ ప్రతిఘటన దళాలు అందుబాటులో ఉన్న ఆయుధాలను తెలివిగా ఓ క్రమ పద్ధతిలో వాడుకొంటూ రష్యా ట్యాంకులను ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ దేశీయంగా తయారు చేసిన ఓ ఆయుధం బ్రహ్మాస్త్రం వలే పనిచేస్తోంది.
10శాతం ట్యాంకుల ధ్వంసం.. స్టగ్నా కీలకపాత్ర
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఉక్రెయిన్ ప్రతిఘటన దళాలు అందుబాటులో ఉన్న ఆయుధాలను తెలివిగా ఓ క్రమ పద్ధతిలో వాడుకొంటూ రష్యా ట్యాంకులను ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ దేశీయంగా తయారు చేసిన ఓ ఆయుధం బ్రహ్మాస్త్రం వలే పనిచేస్తోంది. నాటో సైనిక నిపుణులు కూడా ఉక్రెయిన్ సైన్య వ్యూహాలను అభినందిస్తున్నారు. ఈ పోరాటంలో రష్యా భారీగా సైన్యాన్ని కోల్పోవడంతోపాటు.. ఆక్రమణకు వచ్చిన వాటిల్లో దాదాపు 10శాతం ట్యాంకులను కోల్పోయింది. తూర్పు, ఈశాన్య ఉక్రెయిన్లో రష్యా దళాలు భారీ ఎత్తున ఆయుధాలతో విరుచుకు పడుతుండగా.. కీవ్, ఉత్తర ఉక్రెయిన్లో రష్యా దళాలు అడుగు ముందుకు కదలడం కూడా కష్టంగా మారిపోయింది.
ట్యాంకులకు కాలం చెల్లిందా.. అనేలా..?
రష్యా సేనలు ఇప్పటి వరకు 270 ట్యాంకులను నష్టపోయినట్లు ఓరెక్స్ అనే ఓపెన్ సోర్స్ వెపన్స్ ట్రాకింగ్ వెబ్సైట్ పేర్కొంది. ఈ సంఖ్య దాడికి వచ్చిన రష్యా ట్యాంకుల్లో 10శాతానికి సమానం. ఉక్రెయిన్ దళాలు విరుచుకుపడుతున్న తీరు చూస్తుంటే.. ట్యాంకులకు యుద్ధరంగంలో కాలం చెల్లిందా..? అనేలా ఉంది. జావెలిన్.. ఎన్లా యాంటీ ట్యాంక్ ఆయుధాలతోపాటు మరో సైలెంట్ కిల్లర్ కూడా బాగా పనిచేస్తోంది. ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసే ‘స్టగ్నా-పి ’ యాంటీ ట్యాంక్ ఆయుధం కూడా రష్యా కాన్వాయ్లను భారీగా దెబ్బతీసింది. చిన్నచిన్న వలంటీర్ గ్రూప్లు కూడా రష్యా ట్యాంకులను దారుణంగా దెబ్బతీస్తున్నాయి.
కాన్వాయ్లపై గురి ఇలా..!
ఉక్రెయిన్ మొబైల్ బలగాలకు స్థానిక పరిస్థితులపై మంచి పట్టు ఉంది. రష్యా బలగాల బలహీనతలను ఇవి ముందే పసిగడుతున్నాయి. కీవ్ వద్ద ఉన్న యాంటీ ట్యాంక్ ఆయుధాలను చెట్లచాటు, అపార్ట్మెంట్ కిటికీల నుంచి, బేస్మెంట్ల నుంచి కూడా ప్రయోగించవచ్చు. తొలుత ఎక్కువ యాంటెన్నాలతో కనిపించే కమ్యూనికేషన్ వాహనాలను, ఇంధన, ఇంజినీరింగ్, సాయుధ వాహనాలను ధ్వంసం చేయవచ్చు. మరో ప్రదేశంలో స్నిపర్ గన్తో నక్కిన మరో వలంటీర్ ఈ వాహనాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవచ్చు.
ముగ్గురు వలంటీర్ల బృందం కూడా ఈ యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఒక స్నిపర్ గన్తో ఓ కాన్వాయ్ను కదలనీయకుండా చేయవచ్చు. రష్యా వినియోగించే టి-72 ట్యాంకులకు సాధారణంగా పై భాగం, వెనుక భాగం బలహీనంగా ఉంటుంది. ఉక్రెయిన్ వద్ద ఉన్న జావెలిన్.. ట్యాంకులను పైనుంచి దాడి చేయగలదు. ఎన్లా క్షిపణికి ఇటువంటి సామర్థ్యం లేదు. రష్యా సాయుధ వాహన కాన్వాయ్లోని ముందు, వెనుక వాహనాలను జావెలిన్తో ధ్వంసం చేస్తున్నారు. ఫలితంగా కాన్వాయ్ నిలిచిపోతుంది. మిగిలిన సాయుధ వాహనాలను పక్క నుంచి ఎన్లా వంటి వాటితో ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి పలు వీడియోలు ఇప్పటికే ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.
తెలివిగా లక్ష్యాల ఎంపిక..
ఉక్రెయిన్ బలగాలు తెలివిగా లక్ష్యాలను ఎంచుకొంటున్నాయి. ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన రష్యా సాయుధ వాహనాలు, సైనికులకు అవసరమైన ఆయుధ, ఆహార, ఇంధన సరఫరాల కాన్వాయ్లపై గురిపెడుతున్నాయి. ఈ కాన్వాయ్లకు సాయుధ రక్షణ పెద్దగా ఉండదు.. కానీ, ఇవి ఆగిపోతే.. దేశంలోకి చొరబడిన రష్యా సైనికులకు ఆయుధ, ఇంధన, ఆహార కొరత ఏర్పడి వారు కూడా ముందుకు వెళ్లలేరు. ఉక్రెయిన్ అనుసరించిన ఈ వ్యూహం కారణంగా ఒక దశలో రష్యా సైనికులు ఆహారం కోసం దుకాణాలను లూఠీ చేయాల్సి వచ్చింది. దీనిని తోడు రష్యా ‘సరఫరాల ట్రక్కులు’ కూడా నిలిచిపోతున్నాయి. ‘ఉక్రెయిన్ సేనలు బలహీనమైన లక్ష్యాలపై సమర్థంగా గురిపెడుతున్నాయి’ అని లండన్లోని రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ యుద్ధతంత్ర నిపుణుడు నిక్ రేనాల్డ్స్ పేర్కొన్నారు.
ఏమిటీ ‘స్టగ్నా-పి’ ఏటీజీఎం..?
జావెలిన్, ఎన్లా వలే ఇది కూడా యాంటీ ట్యాంక్ ఆయుధం. కాకపోతే ఇది ఉక్రెయిన్లోనే తయారవుతుంది. దీనిని కీవ్లోని ‘లచ్ డిజైన్ బ్యూరో’ అభివృద్ధి చేసింది. ఇది లేజర్ గైడెడ్ ఆయుధం. ఈ క్షిపణిని ఒక ట్రైపాడ్ పై ఉంచి.. దానిని ఎవరి కంటపడకుండా కామోఫ్లాజ్ చేసి.. దానికి 164 అడుగుల దూరంలో సైనికులు నక్కి రిమోట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. దీంతో ఉక్రెయిన్ సైన్యానికి ప్రాణనష్టం కూడా తప్పుతోంది. దీనిని ఆపరేట్ చేయడానికి ల్యాప్టాప్ వంటి పరికరం ఉంటుంది. ఇది ఉక్రెయిన్ సైన్యానికి అలవాటైన ఆయుధం కావడంతో అద్భుతంగా వినియోగిస్తున్నారు. ఇది దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదించగలదు. పశ్చిమ దేశాల ఏటీజీఎంల కంటే ఈ విషయంలో స్టగ్నా మెరుగ్గా ఉంది.
ఇటీవల ఉక్రెయిన్ మాజీ ఎంపీ టెటియానా చర్నోవోల్ కూడా ఈ ఆయుధాన్ని వాడుతున్న వీడియో వైరల్గా మారింది. ‘‘మేము స్టగ్నాను మార్గంవైపు గురిపెట్టి స్క్రీన్లో చూస్తుంటాము.. మా గురిలోకి రాగానే ఆ కాన్వాయ్లోని తొలి ట్యాంక్ను ధ్వంసం చేస్తాం. ఇందుకోసం ట్యాంక్లో ఇంధనం, పేలుడు పదర్థాలు నిల్వ చేసే భాగంపై గురిపెడతాం’’అని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు వీటిని వంద వరకు వాడారు. అయితే లచ్ డిజైన్ బ్యూరో వీటిని వేగంగా తయారు చేయలేకపోవడంతో ఉక్రెయిన్ సేనలు ఇబ్బందిపడుతున్నాయి.
తిరగబడిన ట్యాంక్ల ప్లాన్..
యుద్ధంలో స్పష్టమైన ఆధిక్యం రాకముందే ట్యాంకులతో ఉక్రెయిన్ను ఆక్రమించడానికి ప్రయత్నించి రష్యా పెద్ద తప్పు చేసిందని సైనిక వ్యూహకర్తలు చెబుతున్నారు. వారి సైనికులకు ట్యాంకులను బురదలో నడిపే సామర్థ్యం లేకపోవడంతో రోడ్లపైనే పంపిస్తున్నారు. దాదాపు 40 టన్నుల బరువు ఉండే ట్యాంక్ గ్యాలెన్(3.78 లీటర్ల) ఇంధనంతో కేవలం ఒక్క మైలు ప్రయాణించగలదు. ఫలితంగా ఇంధనం నింపే వాహనాలకు ఇవి దూరంగానే నిలిచిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో సరఫరాలు లేక సిబ్బందే వీటిని ధ్వంసం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ