Zelensky: యూకే పర్యటనకు జెలెన్స్కీ..!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బ్రిటన్కు చేరుకొన్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని రిషిసునాక్తో భేటీ కానున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఎలాంటి ముందస్తు ప్రకటనలు, హడావుడి లేకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హఠాత్తుగా యూకే పర్యటనకు వెళ్లారు. ఆయన ఈ పర్యటనలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని జెలెన్స్కీ ఓ ట్వీట్లో ధ్రువీకరించారు. కీలకమైన చర్చల కోసం మిత్రుడు రిషి సునాక్తో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మరింత సైనిక సాయం కోరే అవకాశాలున్నాయి.
మరోవైపు యూకే కూడా ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేసేందుకు సానుకూలంగా ఉంది. గత గురవారం ఈ మేరకు లండన్ నుంచి ప్రకటన వెలువడింది. రష్యా దురాక్రమణ నుంచి కాపాడుకోవడానికి ఉక్రెయిన్కు వీటిని అందించనున్నట్లు వెల్లడించింది. దీనిపై జెలెన్స్కీ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘ మా పదాతి, వాయుసేన సామర్థ్యాలను పెంచుకొనే విషయానికొస్తే యూకే పాత్ర చాలా కీలకం. ఈ సహకారం నేడు కూడా కొనసాగనుంది’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సునాక్-జెలెన్స్కీ మధ్య చర్చలు సుదీర్ఘంగా సాగే అవకాశం లేదని బ్రిటన్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఐరోపాలోని ప్యారిస్, రోమ్, బెర్లిన్ను సందర్శించిన జెలెన్స్కీ బ్రిటన్కు చేరుకొన్నారు.
మరోవైపు ఈ పర్యటనపై సునాక్ కూడా స్పందించారు. ‘‘మేము ఉక్రెయిన్ను వదిలేయం. యుద్ధంలో ఇది చాలా కీలకమైన సమయం. పుతిన్ యుద్ధ క్షేత్రం ఇప్పుడు ఉక్రెయిన్ భూభాగం లోపల ఉంది. దీని ప్రభావం ప్రపంచమంతా విస్తరించి ఉంది. ఉక్రెయిన్ విజయం సాధించి.. పుతిన్ దౌర్జన్యానికి ప్రతిఫలం దక్కకుండా చేయడమే మా లక్ష్యం’’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.