Ukraine Crisis: హృదయవిదారకం.. మరుభూమిగా మారిన ఉక్రెయిన్ నగరాలు!
ఎటుచూసినా రక్తపు మడుగులు, కాలిపోయిన శవాలు, దెబ్బతిని నిర్జీవంగా ఉన్న భవనాలు.. ఇదీ ఉక్రెయిన్లోని నగరాల దుస్థితి........
ఇంటర్నెట్ డెస్క్: ఎటుచూసినా రక్తపు మడుగులు, కాలిపోయిన శవాలు, దెబ్బతిన్న భవనాలు.. ఇదీ ఉక్రెయిన్లోని నగరాల దుస్థితి. ఉక్రెయిన్పై రష్యా దాడులు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. షెల్స్, బాంబులతో ఉక్రెయిన్ నగరాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బాంబుల దాడితో బరోద్యాంకా, డొనెట్స్ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇరు దేశాల సైనికులతోపాటు వేలాది సామాన్య ప్రజలు సైతం దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఎంతోమంది గాయపడ్డారు. చికిత్స అందక అనేక మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
మరణించి రోడ్లపై పడిఉన్న సైనికులు, ధ్వంసమై కాలిపోతున్న భవనాలు, గాయాలతో తల్లడిల్లిపోతున్న జనం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలస వెళుతున్న అనేక ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బాధిత దేశం నుంచి ఇంకా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. దేశం కోసం కొందరు సామాన్య పౌరులు స్వచ్ఛందంగా ఉక్రెయిన్ ఆర్మీ కోసం పనిచేస్తున్నారు. మరికొందరు బంకర్లతో తలదాచుకున్నారు.
ఇక ఉక్రెయిన్లో మిగిలిపోయినవి.. కాలిపోయిన నివాస భవనాలు, చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలు, ప్రధాన వీధుల్లోని భవనాల నుంచి వెలువడుతున్న పొగలు మాత్రమే. ఎలాగోలా దేశం దాటి సరిహద్దులకు చేరుకున్న వారు ఆహారం, నీటి కొరతతో విలవిల్లాడుతున్నారు. తమకు చుక్క నీరు దొరకడం లేదని కొందరు భారతీయ విద్యార్థులు వాపోతుండటం శరణార్థుల పరిస్థితులకు అద్దంపడుతోంది. కొందరు దాతలు పంచిపెట్టే రొట్టె ముక్కలతోనే ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎనర్హోదర్ నగరంలో ఉన్న యూరప్లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రమైన జెపోరోజియాపై రష్యా దాడి చేసింది. ఈ దాడులతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అణువిద్యుత్ కేంద్రం రియాక్టర్ పేలితే.. చెర్నోబిల్ పేలుడు కంటే పదిరెట్లు భారీ నష్టం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. చెర్నివిహ్ నగరంలోని ఓ బిల్డింగ్పై బాంబు దాడికి పాల్పడగా.. అందులోకి 33 మంది మృతిచెందారు. 18మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇంకా ఇలాంటి ఘటనలు అనేకం..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట