Ukraine Crisis: ‘సైనిక చర్యకు ఏడాది వేళ.. భారీఎత్తున దాడులకు రష్యా ప్లాన్..!’
తమ దేశంపై సైనిక చర్యను మొదలుపెట్టి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో రష్యా మరో భారీ దాడికి పాల్పడే అవకాశం ఉందని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి తెలిపారు. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
కీవ్: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా సైనిక చర్యను ప్రారంభించి ఏడాది కావస్తోంది. ఈ క్రమంలోనే రష్యా(Russia) భారీ దాడులకు సిద్ధమవుతోందని ఉక్రెయిన్ రక్షణశాఖ మంత్రి ఓలెక్సీ రెజ్నికోవ్(Oleksii Reznikov) తెలిపారు. ఫిబ్రవరి 24 నాటికి అవి ప్రారంభమవుతాయని హెచ్చరించారు. ఈ దిశగా మాస్కో ఇప్పటికే లక్షలాది మంది సైనికులను సమీకరించిందని, సైనిక చర్యకు ఏడాది పూర్తయిన సందర్భంగా దాడులకు దిగొచ్చని చెప్పారు. ఏటా ఫిబ్రవరి 23న నిర్వహించే రెడ్ ఆర్మీ వ్యవస్థాపక దినోత్సవం ‘డిఫెండర్ ఆఫ్ ఫాదర్ల్యాండ్ డే’ గుర్తుగానూ రష్యా ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో దాదాపు 5 లక్షల మందిని మాస్కో కూడగట్టిందని తెలిపారు.
‘రష్యా.. కొత్త ఆయుధాలు, మరింత మందుగుండు సామగ్రి సమకూర్చుకుంటోంది. ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. సొంత ఉత్పత్తి కూడా పెంచుతోంది’ అని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్బర్గ్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో.. రెజ్నికోవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతోపాటు వసంతకాలం ముగిసేలోపు డాన్బాస్ను స్వాధీనం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తన బలగాలను ఆదేశించినట్లు ఉక్రెయిన్ నిఘా విభాగం ఇటీవల తెలిపింది. ఈ పరిణామాల నడుమ.. ఉక్రెయిన్ కమాండర్లు ఫ్రంట్లైన్ను బలోపేతం చేయడంతోపాటు, ఎదురుదాడులకు సిద్ధం కావాలని రెజ్నికోవ్ సూచించారు.
మరోవైపు.. క్రమాటోర్స్క్ నగరంపై రష్యా తాజాగా జరిపిన దాడిలో ముగ్గురు మరణించారు. దొనెట్స్క్ ప్రాంతంపై జరిపిన క్షిపణి దాడిలో.. ఓ నివాస భవనం నేలమట్టమైంది. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక గవర్నర్ తెలిపారు. డాన్బాస్ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య భీకర పోరు సాగుతోందని ఉక్రెయిన్ ఉప రక్షణశాఖ మంత్రి హనా మాల్యార్ తెలిపారు. బఖ్ముత్ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా దళాలు యత్నిస్తున్నాయన్నారు. గతేడాది అక్టోబరులో తాము తిరిగి స్వాధీనం చేసుకున్న లీమన్ నగరాన్ని కూడా మరోసారి హస్తగతం చేసేందుకు మాస్కో సేనలు ప్రయత్నిస్తున్నాయని ఆమె తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు