Snake Island: స్నేక్ ఐలాండ్పై ఎగిరిన ఉక్రెయిన్ పతాకం
నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్పై ఎట్టకేలకు కొన్ని నెలల తర్వాత ఉక్రెయిన్ పతాకం ఎగిరింది. గత వారం సద్భావన చర్యగా చెబుతూ రష్యా దళాలు ఇక్కడి నుంచి వైదొలగిన విషయం
ఇంటర్నెట్డెస్క్: నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్పై ఎట్టకేలకు ఉక్రెయిన్ పతాకం ఎగిరింది. గత వారం సద్భావన చర్యగా చెబుతూ రష్యా దళాలు ఇక్కడి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ దక్షిణ మిలటరీ కమాండ్ ప్రతినిధి నటాలియా హ్యూమెనియూక్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ‘‘ అక్కడి సైనిక చర్య పూర్తయింది. ఆ భూభాగం(స్నేక్ ఐలాండ్) ఉక్రెయిన్ పరిధిలోకి వచ్చింది’’ అని పేర్కొన్నారు. రష్యా దళాలను తరిమికొట్టినట్లు చెప్పారు.
శత్రువుకు మింగుడుపడని ద్వీపంగా..
మొత్తం పావు చదరపు కిలోమీటరు వైశాల్యంతో ఉన్న ఈ ద్వీపం నల్ల సముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రదేశం. ఇది సముద్రమట్టం కంటే 41 మీటర్లు ఎత్తులో ఉంటుంది. ఉక్రెయిన్ ఆర్థిక కేంద్రమైన ఒడెస్సా పోర్టుకు 80 మైళ్ల దూరంలో ఉంది. ఈ ద్వీపంపై పట్టు సాధించిన దేశం నల్ల సముద్రంలో నౌకల కదలికలపై నిఘా పెట్టే సామర్థ్యాన్ని దక్కించుకుంటుంది. మూడు శతాబ్దాల కాలంలో.. ఇది రష్యా, టర్కీ, రొమేనియా, ఉక్రెయిన్ చేతుల్లోకి వెళ్లింది. తాజాగా ఉక్రెయిన్పై దాడి చేసిన తొలి రోజే రష్యా దళాలు ఈ ద్వీపాన్ని చుట్టుముట్టాయి. మాస్కోవా యద్ధ నౌక రంగంలోకి దిగి.. ఈ ద్వీపంపై క్రూజ్ క్షిపణుల వర్షం కురిపించింది. దీనిపై కట్టడాలు, లైట్హౌస్ను కూల్చివేసింది. రష్యా స్వాధీనం చేసుకొన్న అనంతరం .. అక్కడ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు, సెన్సర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 13న మాస్కోవా నౌక స్నేక్ ఐలాండ్ సమీపంలో ప్రయాణిస్తుండగా.. రెండు నెప్ట్యూన్ క్షిపణులు దానిని ధ్వంసం చేశాయి. ఆ మర్నాడే దెబ్బతిన్న నౌకను క్రిమియాలోని సెవస్టపోల్కు తరలిస్తుండగా మునిగిపోయింది. 1788 జులై 14న తొలిసారి రష్యాకు చెందిన బ్లాక్సీ దళం ఈ ద్వీపం కోసం టర్కీ చక్రవర్తి సేనలతో యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ తర్వాత 19వ శతాబ్దంలో పలు మార్లు మాస్కో-ఇస్తాంబుల్ చేతులు మారింది. కొన్నాళ్లు రొమేనియా చేతిలోకి వెళ్లింది. అప్పుడే ఇక్కడ అక్లిస్ మందిర శిథిలాలపై లైట్ హౌస్ నిర్మించినట్లు చెబుతారు. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఈ ద్వీపంపై దాడి చేసింది. రెండో ప్రపంచ యద్ధంలో ఈ ద్వీపం కోసం సోవియట్-రొమేనియా మధ్య పోరు జరిగింది. ఆ సమయంలో రొమేనియా దళాలు భారీగా సీమైన్లను ఏర్పాటు చేశాయి. 1942 సమయంలో సొవియట్ సబ్మెరైన్లు కూడా ఇక్కడ మునిగిపోయాయి. 1944లో రొమేనియా ఈ ద్వీపాన్ని వదులుకోగా.. సోవియట్ సేనలు ఆధీనంలోకి తీసుకొన్నాయి. ఇక్కడ రాడార్ స్టేషన్లతో సహా పలు కట్టడాలు నిర్మించాయి. 1991 తర్వాత సోవియట్ పతనంతో ఇది ఉక్రెయిన్కు లభించింది. ఇప్పుడు మళ్లీ రష్యా చేతుల్లోకి వెళ్లి.. తిరిగి ఉక్రెయిన్కు దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్