Ukrain: ఉక్రెయిన్ పైలట్లకు అమెరికాలో శిక్షణ..!
ఉక్రెయిన్ పైలట్లకు అమెరికాలోని అరిజోనాలో శిక్షణ ఇస్తున్నారు. ఏ ఆయుధాలపై ఈ శిక్షణ జరుగుతోంది అనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఎఫ్-16లు మాత్రం వారికి ఇవ్వడంలేదని అమెరికా చెబుతోంది.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్(Ukrain) వైమానిక దళానికి చెందిన పైలట్లకు అమెరికాలోని అరిజోనాలో ప్రత్యేక సిమ్యూలేటర్లపై శిక్షణ ఇస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ అధికారులు కూడా ధ్రువీకరించారు. దీంతో అమెరికా(USA) నుంచి యుద్ధ విమానాలు కూడా సాయం రూపంలో ఉక్రెయిన్(Ukrain)కు అందనున్నాయనే ప్రచారం జరుగుతోంది. కానీ, వాషింగ్టన్ మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉంటోంది. ఇప్పటికే అమెరికా మిత్రపక్షాల నుంచి జావెలిన్ క్షిపణులు, హిమార్స్ రాకెట్ లాంఛర్లు భారీ ఎత్తున ఉక్రెయిన్కు అందాయి. కానీ, ఫైటర్ జెట్ విమానాలు, భారీ డ్రోన్లు ఇస్తామని మాత్రం ఇప్పటి వరకు పశ్చిమ దేశాలు ఎక్కడా వెల్లడించలేదు. ‘‘తాజా శిక్షణతో ఉక్రెయిన్ పైలట్లు మరింత మెరుగ్గా పనిచేసేందుకు అవకాశం లభిస్తుంది’’ అని అమెరికా అధికారులు చెబుతున్నారు. అమెరికా వైమానిక దళం ఎలా పనిచేస్తోందో ఉక్రెయిన్ పైలట్లు అరిజోనాలో చూసి నేర్చుకొనే అవకాశం లభించింది.
ఓ వైపు అమెరికా-ఉక్రెయిన్ సైనికాధికారుల మధ్యలో చర్చలు జరుగుతుండగా ఈ శిక్షణ విషయం వెలుగులోకి రావడం విశేషం. గతంలో అమెరికా మిత్రదేశాల్లో కూడా ఉక్రెయిన్ సేనలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికాలో శిక్షణ ఎంతకాలం జరిగిందో మాత్రం వెల్లడించలేదు. ఎఫ్-16లపై ఉక్రెయిన్ పైలట్లకు ఎటువంటి శిక్షణను ప్రారంభించలేదని రక్షణశాఖ అండర్ సెక్రటరీ కొలిన్ ఇటీవల ప్రతినిధుల సభకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు అందబోయే విమానాలు ఏమిటనే విషయం ఇప్పటి వరకు వెల్లడికాలేదు. బ్రిటిష్ టోర్నిడోలు, స్వీడన్ గ్రిపిన్లు, ఫ్రాన్స్ మిరేజ్ విమానాలు అందే అవకాశలున్నాయనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు అరిజోనాలో వేటిపై శిక్షణ పొందుతున్నారనే విషయం గోప్యంగానే ఉంది. శనివారం కూడా ఉక్రెయిన్ పైలట్లు అమెరికాలోనే ఉన్నారని అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి.
ఫిబ్రవరిలో బైడెన్ కీవ్ పర్యటన సందర్భంగా కనీసం 120 యుద్ధ విమానాలు కావాలని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ కోరారు. ఈ విషయాన్ని బైడెన్ కూడా ధ్రువీకరించారు. అమెరికా మాత్రం 50 నుంచి 80 మధ్యలో ఎఫ్-16 యుద్ధ విమానాలు సరిపోతాయని అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు