UKraine Crisis: ఐరాస చీఫ్ ఉండగానే క్షిపణుల వర్షం: జెలెన్స్కీ
ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ కీవ్లో పర్యటిస్తుండగానే రష్యా ఆ నగరంపై క్షిపణి దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. గుటెరస్ పర్యటన ముగింపు సమయంలో ఇది చోటు చేసుకొంది.
ఇంటర్నెట్డెస్క్: ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ కీవ్లో పర్యటిస్తుండగానే రష్యా ఆ నగరంపై క్షిపణి దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. గుటెరస్ పర్యటన ముగింపు సమయంలో ఇది చోటు చేసుకొంది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ ‘‘నిన్న చర్చలు ముగిసిన తర్వాత ఐదు క్షిపణులు కీవ్పై విరుచుకుపడ్డాయి. ప్రపంచ స్థాయి సంస్థల విషయంలో రష్యా ప్రవర్తనను ఇది తెలియజేస్తోంది. రష్యా నాయకత్వం ఐరాసను ఎగతాళి చేస్తోంది. దీనికి సరిగ్గా శక్తిమంతమైన సమాధానం లభిస్తుంది. కీవ్తోపాటు ఫాస్టివ్, ఒడెసా ఇతర నగరాలపై కూడా దాడులు జరిగాయి. మేము ఇంకా పోరాడాల్సింది ఉంది. ఆక్రమణదారులను తరిమి కొట్టాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. అమెరికా నుంచి సమయానికి ఆయుధ సరఫరా మా రక్షణకే కాదు.. మీ అందరి రక్షణకు ఉపయోగపడుతుందని జెలెన్స్కీ వెల్లడించారు.
కీవ్పై రష్యా దాడిలో ఎంత మంది తీవ్రంగా గాయపడ్డారన్న సమాచారం వెల్లడికాలేదు. ఆర్టమ్ డిఫెన్స్ ప్లాంట్ సమీపంలోని ఒక నివాస భవన సముదాయాన్ని క్షిపణి తాకింది. ఈ దాడులపై ఐరాస చీఫ్ గుటెరస్ విచారం వ్యక్తం చేశారు. కీవ్ ఉక్రెయినియన్లకే కాదు.. రష్యన్లకు కూడా పవిత్ర నగరం.. అటువంటి ప్రాంతంపై క్షిపణి దాడి జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
మరోవైపు ఉక్రెయిన్కు సాయం అందించే విషయమై అమెరికా కూడా చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. ఉక్రెయిన్కు ఆయుధాలను రుణ, లీజు రూపంలో ఇచ్చేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోద ముద్ర వేసింది. ఉక్రెయిన్కు మరో 3,300 కోట్ల డాలర్ల సాయం అందించడానికి అనుమతించాలని అమెరికన్ కాంగ్రెస్ను దేశాధ్యక్షుడు జో బైడెన్ కోరారు. ఉక్రెయిన్కు మరింత కాలం సాయమందించే ఉద్దేశం అమెరికాకు ఉందన్న సంకేతాన్ని ఆయన వెలువరించారు. సైనిక అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఆర్థిక, మానవతా సాయానికి ఈ మొత్తం ఉపకరిస్తుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
కొరియా ద్వీపకల్పంలో ఐరాస విధించిన ఆంక్షలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఏమాత్రం ఉపయుక్తంగా లేవని రష్యా పేర్కొంది. -
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ