Ukraine Crisis: రష్యా సేనలను అడ్డుకునేందుకు గ్రామాన్ని వరదల్లో ముంచి..
రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ శాయశక్తులూ ఒడ్డుతోంది. ఆ దేశ ప్రజలు కూడా సైన్యానికి అడుగడుగునా అండగా నిలుస్తూ శత్రుమూకలను అడ్డుకుంటున్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు కొందరు పౌరులు
దేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ వాసుల సాహసోపేత చర్యలు
ఇంటర్నెట్డెస్క్: రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ శాయశక్తులూ ఒడ్డుతోంది. ఆ దేశ ప్రజలు కూడా సైన్యానికి అడుగడుగునా అండగా నిలుస్తూ శత్రుమూకలను అడ్డుకుంటున్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు కొందరు పౌరులు తుపాకులు చేతబట్టగా.. మరికొందరు సాహసోపేత చర్యలకు పూనుకుంటున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోకి రష్యన్ సేనలు రాకుండా ఆ సమీపంలోని ఓ గ్రామ వాసులు వరదలతో అడ్డుకట్ట వేశారు. తాము నష్టపోతామని తెలిసినా.. ఊరిని వరదలతో ముంచెత్తారు.
కీవ్కు ఉత్తరాన దిమిదివ్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం నుంచి రష్యన్ ట్యాంక్లు వెళ్లకుండా చేసేందుకు ఇటీవల ఇక్కడి ప్రజలు ఊరికి వరదలు తీసుకొచ్చారు. సమీపంలోని దినిప్రో నది నుంచి మోటార్ల ద్వారా నీటిని వీధులు, పొలాల్లోకి విడుదల చేశారు. దీంతో గ్రామమంతా వరద నీటిలో మునిగిపోయింది. పంట పొలాలు, ఇళ్లు మునిగిపోయాయి. వీధులన్నీ నదులను తలపించాయి. దీంతో రష్యా సాయుధ కాన్వాయ్లు ముందుకు కదిలేందుకు వీలులేకుండా పోయింది.
కీవ్ను కాపాడుకున్నాం..:
దీని వల్ల గ్రామంలో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఈ మాత్రం నష్టాన్ని తాము భరిస్తామని గ్రామస్థులు అంటున్నారు. ‘‘మేం చేస్తున్న పని ప్రతి ఒక్కరికీ అర్థమైంది. తప్పు చేశామని ఎవరూ బాధపడట్లేదు. మేం కీవ్ను కాపాడుకున్నాం’’ అని స్థానికులు గర్వంగా చెబుతున్నారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘కీవ్ను రక్షించుకునేందుకు దిమిదివ్ ప్రజలు తమ పంటపొలాలను, ఇళ్లను నీటముంచారు. సామాన్య పౌరులు హీరోలుగా మారుతున్నారు. దీనికి మేం ఏ మాత్రం కలత చెందట్లేదు. మా లక్ష్యం విజయమే. ధైర్యం మా డీఎన్ఏలోనే ఉంది’’ అని ఆయన రాసుకొచ్చారు.
మార్చి నెలలో దిమిదివ్ గ్రామ ప్రజలు ఈ వరదలు తీసుకురాగా.. కీవ్లోకి రష్యన్ సేనలు రాకుండా ఇది కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అంతేగాక, శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ సేనలకు సమయం కూడా లభించినట్లయిందని స్థానిక అధికారులు తెలిపారు. అయితే దిమిదివ్ గ్రామం ఒక్కటే కాదు.. రష్యా సైనికుల నుంచి ఉక్రెయిన్ను కాపాడుకునేందుకు ఇలాంటి స్వీయ నష్టాలకు ఎవరూ వెనుకాడట్లేదు. రష్యన్ కాన్వాయ్లు తమ భూభాగంలోకి రాకుండా దేశవ్యాప్తంగా 300 వంతెనలను ధ్వంసం చేశారు.
గత రెండు నెలలుగా ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. బాంబులు, క్షిపణుల వర్షంతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది సామాన్య పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అటు రష్యా వైపూ భారీ నష్టం వాటిలినట్లే తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్