Burkina Faso : దయనీయం.. ఆకులు, ఉప్పు తింటూ అక్కడి జనం బతుకుతున్నారు!
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని.. అక్కడ కొన్నిచోట్ల మహిళలు, చిన్నారులు కొంత కాలంగా ఆకులు, ఉప్పు తింటూ జీవనం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
వాగడూగు (బుర్కినా ఫాసో): ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్రికాలోని పలు దేశాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తంచేసింది. అక్కడ కొన్నిచోట్ల మహిళలు, చిన్నారులు కొంత కాలంగా ఆకులు, ఉప్పు తింటూ జీవనం సాగిస్తున్నారని ఆందోళన చెందింది. బుర్కినా ఫాసోలో ఇటీవల పర్యటించిన ఐరాసలోని మానవతా వ్యవహారాలు, అత్యవసర సహాయ విభాగం సమన్వయకర్త మార్టిన్ గ్రిఫిత్స్.. అక్కడి పరిస్థితులు తనను ఎంతగానో కలచివేశాయని చెప్పారు.
‘చాలా ప్రాంతాల్లోని ప్రజల్లో పెరుగుతోన్న అభద్రతాభావం కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో తెగతెంపులు చేసుకున్నాయి. తద్వారా చాలా ప్రాంతాలు ఆకలి కేకలతో అల్లాడుతున్నాయి. సహాయం చేసేందుకు వెళ్లే వారికి అక్కడికి చేరుకోవడం చాలా ఇబ్బందిగా మారింది’ అని మార్టిన్ గ్రిఫిత్స్ పేర్కొన్నారు. రెండు కోట్ల జనాభా కలిగిన బుర్కినా ఫాసోలో సుమారు 50లక్షల మందికి అత్యవసర సహాయం అవసరమని అంచనా వేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో డిజిబో నగరంలో ఇటీవల పోషకాహార లోపంతో ఎనిమిది మంది మరణించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆ నగరంలో 3,70,000 మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఆహార ధరలు పెరగడంతోపాటు నీరు కూడా లభ్యం కావడం లేదని అక్కడ సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.
‘మాకు తిండి దొరకడం లేదు. కేవలం ఆకులమీదే ఆధారపడ్డాం’ అని డిజిబో పట్టణానికి చెందిన డవుడా మైగా అనే వ్యక్తి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని హెలికాప్టర్ల ద్వారా సహాయం అందుతోందని.. కానీ, అవి సరిపోవడం లేదని వాపోయారు. రోడ్డు మార్గంలో పట్టణంలోకి వెళ్లేందుకు యత్నించే కాన్వాయ్లు దాడులకు గురికావడం సహాయ చర్యలకు ఇబ్బందిగా మారినట్లు సమాచారం.
అల్ఖైదాతోపాటు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్లతో బుర్కినా ఫాసో కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఈ ఘర్షణలు.. వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి. వరుస దాడులతో దాదాపు 20లక్షల మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. దీంతో అభద్రతా భావంతో ఉన్న పలు ప్రాంతాల ప్రజలు తమ పట్టణాలను నిర్బంధించుకోవడంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్