UN Reform: యూఎన్ఎస్సీ నిజమైన వైవిధ్యతను కనబర్చడం లేదు : భారత్
సంస్కరణలకు ఐరాస దూరంగా ఉండిపోయిందని.. ఐరాస భద్రతామండలి(UNSC) నిజమైన వైవిధ్యతను కనబర్చడం లేదని భారత్ ఆక్షేపించింది. భారత్ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలకు శాశ్వత స్థానం లేకపోతే దాని విశ్వసనీయత ప్రమాదంలో పడుతుందని ఉద్ఘాటించింది.
జెనీవా: ఐరాస భద్రతామండలి(UNSC) నిజమైన వైవిధ్యతను కనబర్చడం లేదని భారత్ ఆక్షేపించింది. ఐరాస కూడా సంస్కరణల(UN Reforms)కు దూరంగా ఉండిపోయిందని తాజాగా పేర్కొంది. ఉగ్రవాదం, మహమ్మారుల విజృంభణ, సాంకేతికతల దుర్వినియోగం తదితర సవాళ్లతోపాటు భౌగోళిక రాజకీయ రంగంలో ఆధిపత్య పోరు వంటివి తీవ్రతరమవుతోన్న వేళ.. శాంతి స్థాపనకు బలమైన వేదిక, బహుముఖ ప్రతిస్పందన అవసరమని పిలుపునిచ్చింది. నెలవారీ రొటేటింగ్ విధానంలో 15 సభ్యదేశాల యూఎన్ఎస్సీకి ప్రస్తుతం భారత్ అధ్యక్షత వహిస్తోంది.
ఈ క్రమంలోనే డిసెంబరు 14, 15వ తేదీల్లో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్ అధ్యక్షతన ఐరాసలో కీలక కార్యక్రమాలు నిర్వహించనుంది. బహుముఖవాదం, ఉగ్రవాదం కట్టడిపై ప్రధానంగా దృష్టి సారించనుంది. దీనికి సంబంధించిన విషయాలపై భద్రతా మండలిలో చర్చలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సమావేశాలకు ముందు భారత్ ఈ మేరకు ఓ కాన్సెప్ట్ నోట్ను విడుదల చేసింది. దీన్ని భద్రతా మండలి పత్రంగా పంపిణీ చేయాలని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్కు సూచించింది.
‘ఇప్పుడు ప్రపంచం 77 ఏళ్ల క్రితం మాదిరిగా లేదు. మొదట్లో 55 సభ్య దేశాలు ఉండగా.. ఇప్పుడు మూడు రెట్లు పెరిగాయి. ప్రపంచ శాంతి, భద్రతలకు బాధ్యత వహించే ఐరాస భద్రతా మండలి కూర్పు చివరిసారి 1965లో చేపట్టారు. ఇది ఐరాస విస్తృత సభ్యత్వపు నిజమైన వైవిధ్యాన్ని ప్రతిబింబించడం లేదు’ అని కాన్సెప్ట్ నోట్లో పేర్కొంది. ఐరాస సంస్కరణల ఫ్రేమ్వర్క్పై సభ్య దేశాల నుంచి అనేక ప్రతిపాదనలు ఉన్నప్పటికీ.. ఈ విషయంలో పురోగతి లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలకు శాశ్వత స్థానం లేకపోతే దాని విశ్వసనీయత ప్రమాదంలో పడుతుందని ఉద్ఘాటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?