Refugee World: ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది నిరాశ్రయులు
ఉక్రెయిన్లో యుద్ధం మొదలు వివిధ దేశాల్లో కొనసాగుతోన్న ఘర్షణ వాతావరణం, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల కారణంగా 10కోట్ల మంది నిరాశ్రయులుగా మారినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగం వెల్లడించింది.
ఒక్క ఉక్రెయిన్ నుంచే 65లక్షల మంది శరణార్థులన్న ఐరాస
బెర్లిన్: ఉక్రెయిన్లో యుద్ధం మొదలు వివిధ దేశాల్లో కొనసాగుతోన్న ఘర్షణ వాతావరణం, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల కారణంగా 10కోట్ల మంది నిరాశ్రయులుగా మారినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగం వెల్లడించింది. ఒక్క ఉక్రెయిన్ నుంచే 65 లక్షల మంది దేశం విడిచిపోగా.. లక్షల మంది స్థానికంగా ఇతర ప్రాంతాల్లో ఆశ్రయం పొందినట్లు పేర్కొంది. అయితే, తొలిసారిగా పదికోట్ల మైలురాయిని దాటిన ఈ సంఖ్య ఎన్నడూ ఊహించనిదని ఐరాస.. ఈ సంఖ్య ప్రపంచదేశాలకు ఓ మేల్కొలుపు కావాలని పిలుపునిచ్చింది.
ఉక్రెయిన్ నుంచే 65లక్షల మంది..
ప్రపంచవ్యాప్తంగా బలవంతంగా తమ ప్రాంతాలను వీడిపోతున్న వారిసంఖ్య 2021 చివరి నాటికి 9కోట్లకు చేరుకుందని యూఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ముఖ్యంగా ఇథియోపియా, బుర్కినా ఫాసో, మయన్మార్, నైజీరియా, అఫ్గానిస్థాన్, కాంగో దేశాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న ఘర్షణ వాతావరణం, పలు దేశాల్లో ఇటీవల చెలరేగుతోన్న హింస వంటి ఘటనలతో లక్షల మంది శరణార్థులుగా మారుతున్నారని తెలిపింది. ఇదే సమయంలో ఉక్రెయిన్లో మొదలైన యుద్ధం కారణంగా మరో 65లక్షల మంది దేశం విడిచిపోగా.. మరో 80లక్షల మంది స్థానికంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు ఐరాస శరణార్థి విభాగం వెల్లడించింది. ఇలా ఘర్షణల కారణంగా నిరాశ్రయులవుతోన్న వారి సంఖ్య ప్రపంచ జనాభాలో ఒక శాతంగా ఉందని ఐరాస శరణార్థి విభాగంలోని అంతర్గత పర్యవేక్షణ విభాగం (IDMC) వెల్లడించింది.
‘పది కోట్లు అనేది కఠినమైన సంఖ్య. ఇటువంటి రికార్డు ఎన్నడూ అంచనా వేయనిది. విధ్వంసకర ఘర్షణలను నిరోధించడానికి, హింసను అంతం చేయడానికి, అమాయక ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయేందుకు దారితీస్తోన్న కారణాలకు పరిష్కారం చూపడానికి తాజా సంఖ్య ఓ మేల్కొలుపుగా ఉపయోగపడుతుంది’ అని ఐరాస శారణార్థి విభాగం అధిపతి ఫిలిపో గ్రాండీ పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా ఆ దేశాన్ని విడిచిపోతున్న వారికి ఆశ్రయం కల్పించడంలో అంతర్జాతీయ సమాజం సానుకూలంగా స్పందించడం ఊరట కలిగించే విషయమన్న ఆయన.. కనికరం, జాలి ఇంకా బతికే ఉన్నాయని రుజువు చేస్తున్నాయన్నారు. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకునే సంక్షోభాల సమయంలోనూ ఇలాగే ఆపన్నహస్తం అందిచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇక శరణార్థి పేరిట మానవతా సహాయం కేవలం తాత్కాలిక ఉపశమనమేనన్న ఫిలిపో గ్రాండీ.. ఇటువంటి సంక్షోభ పరిస్థితులను శాశ్వతంగా నయం చేయలేవన్నారు. ఈ పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు శాంతి, స్థిరత్వం మాత్రమే సమాధానమన్నారు. తద్వారా అమాయక ప్రజలు బలవంతంగా ఇళ్లను వదిలి పారిపోయే పరిస్థితుల నుంచి బయటపడుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ