UN: ఐరాస ఉగ్ర ఆంక్షల విధానాలపై మండిపడ్డ భారత్..!
ఐరాసలోని భద్రతా మండలిలో ఉగ్ర ఆంక్షల కమిటీ తీరుపై భారత్ మండిపడింది. ఉగ్రవాదాన్ని అందరూ ఒక్క స్వరంలో వ్యతిరేకించాలని పేర్కొంది. ఐరాసలోని ఆంక్షల విధానంపై నమ్మకం ఎన్నడూ లేనంతగా పతనమైందని విమర్శించింది.
ఇంటర్నెట్డెస్క్: ఐరాసలోని భద్రతా మండలిలో ఉగ్ర ఆంక్షల కమిటీ తీరుపై భారత్ మండిపడింది. ఉగ్రవాదాన్ని అందరూ ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకించాలని పేర్కొంది. ఐరాసలోని ఆంక్షల విధానాలపై నమ్మకం ఎన్నడూ లేనంతగా పతనమైందని విమర్శించింది. చైనా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల విషయంలో సంస్థ పనితీరును భారత్ పరోక్షంగా తప్పుపట్టింది. ఐరాస సెక్రటేరియట్ ఉగ్రవాదం అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది.
‘ఉగ్రవాద చర్యలతో అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు’ అనే అంశంపై జరిగిన చర్చలో ఐరాసలో భారత దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ ప్రసంగించారు. ఉగ్రజాబితాలపై పట్టు సాధించడం కోసం చైనా చేసే ప్రయత్నాలను, ఉగ్రవాదాన్ని కీర్తించే పాకిస్థాన్, ఉగ్ర సంస్థలకు ఆశ్రయం కల్పించే అఫ్గానిస్థాన్ను పరోక్షంగా ప్రస్తావించారు. ప్రపంచలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాదుల వివరాలను ఆధారాలతో సహా ఇచ్చినా.. ఆ పేర్లను బ్లాక్ లిస్ట్లో చేర్చకుండా ఆపడం బాధాకరమని భారత్ పేర్కొంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు భద్రతా మండలి ఆంక్షల విధానాలపై నమ్మకాన్ని దిగజారుస్తాయని పేర్కొంది.
ఉగ్రవాదంపై ఐరాస సెక్రటరీ జనరల్ నివేదికను భారత్ తప్పుపట్టింది. మధ్య, దక్షిణాసియాలో కేవలం ఐఎస్ఐఎల్-కె ఉగ్రసంస్థను మాత్రమే ఆ నివేదికలో ప్రస్తావించడంపై రుచిరా మండిపడ్డారు. ఈ ప్రాంతంలో చాలా గ్రూపులు ఉన్నా.. పట్టించుకోలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ను లక్ష్యంగా చేసుకొనే గ్రూపులను ప్రస్తావించలేదన్నారు. కేవలం ఎంపిక చేసిన సమాచారాన్నే ఈ నివేదిక కోసం తీసుకున్నారని ఆరోపించారు. భారత ఉపఖండంలో లష్కరే-జైషే మధ్య ఉన్న బంధం ఎంత ప్రమాదకరంగా మారిందో వంటి అంశాలను భారత్ ప్రస్తావించింది.
గతంలో భారత్, అమెరికాలు కలిసి పాక్ ఉగ్రవాది అబ్దుల్ రహ్మాన్ మక్కీపేరు ఐరాస ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని ప్రతిపాదించాయి. కానీ, చైనా ఆ ప్రతిపాదనను చివరి నిమిషంలో అడ్డుకుంది. అంతకు ముందు కూడా భారత్ ప్రతిపాదించిన ఉగ్రవాదులు, సంస్థల పేర్లను చైనా అడ్డుకొంటూ వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు