Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
గ్రాడ్యుయేషన్ డే రోజున విద్యార్థులకు బిలియనీర్ ఒకరు అనుకోని బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి అందుకున్న విద్యార్థుల ముఖాల్లో ఆనందానికి అవధుల్లేవు. ఇలాంటి బహుమతుల వల్ల విద్యార్థుల్లో సేవా గుణం అలవడుతుందని బిలియనీర్ అభిప్రాయప్డడారు.
బోస్టన్: వారంతా తొలిసారి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటున్న విద్యార్థులు (Students). స్టేజ్పైకి వెళ్లి పట్టా అందుకుని తమ స్థానాల్లో కూర్చున్న వారందరికీ నిర్వాహకులు రెండు కవర్లు ఇస్తున్నారు. వాటిని తెరిచి చూసిన విద్యార్థుల కళ్లలో ఒక్కసారిగా ఆనందం. ఒక్కో కవర్లలో ప్రతి దానిలో 500 డాలర్ల నగదు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. వారికిచ్చిన కవర్లలో ఒక దానిపై బహుమతి (Gift) అని, మరో కవర్పై ఇవ్వడం కోసం (Give) అని రాసుంది. ఇంతకీ తమకు నగదు కవర్లు ఎందుకిచ్చారు? ఒక కవర్పై ‘గిఫ్ట్’ అని, మరో దానిపై ‘గివ్’ అని ఎందుకు రాశారు? అసలు ఆ కవర్లు తమకు ఎవరిచ్చారు? అని విద్యార్థులు ఒకరితో ఒకరు చర్చించుకుంటుండగా.. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిలియనీర్ రాబర్ట్ హాలే (Robert Hale) ప్రసంగించడం ప్రారంభించారు.
‘‘మీరంతా ఎంతో కష్ట కాలాన్ని దాటుకుని వచ్చారు. అదంత సులభంగా ఏం జరగలేదు. అందుకు మీరు ఎంతో ఆనందించాలి. మీ అందరిపట్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ ఆనందాన్ని మీతో కలిసి పంచుకోవాలనుకుంటున్నాం. అందుకే మీకు రెండు బహమతులు ఇచ్చాం. మొదటిది మీకు బహుమతి కాగా, రెండోది మీరు ఇతరులకు ఇవ్వడం కోసం. మీరు రేపటి సమాజానికి ప్రతీకలు. మీకు దొరికిన దాంట్లో కొంత ఇతరులకు ఇస్తే మీ జీవితం మరింత సంతోషంగా సాగుతుంది. ఇందుకోసం మీకై మీరే కొన్ని అవకాశాలను అందుకోవాలి. ఓటమి గురించి చింతించవద్దు. ధైర్యంగా సవాళ్లను ఎదుర్కోండి. దాని వల్ల మీకు సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది’’ అని రాబర్ట్ తన ప్రసంగాన్ని ముగించారు.
విద్యార్థులకు తమకు లభించిన బహుమతి పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి బహుమతి వల్ల విద్యార్థులకు సేవా గుణం అలవడుతుందని రాబర్ట్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం బోస్టన్ (Boston)లోని మసాచూసెట్స్ విశ్వవిద్యాలయం (University of Massachusetts)లో జరిగింది. మొత్తం 2,500 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డే (Graduation Day)లో పాల్గొనగా.. అందరికీ వెయ్యి డాలర్ల చొప్పున బహుమతిని అందించారు. రాబర్ట్ హాలే అమెరికాలో గ్రానైట్ టెలీకమ్యూనికేషన్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. అయితే, గతంలో కూడా ఆయన రెండుసార్లు విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. రాబర్ట్ హాలే వ్యక్తిగత సంపద విలువ ఐదు బిలియన్ డాలర్లు. తన సంపదలో ఎక్కువ మొత్తాన్ని ఆయన దాతృత్వ కార్యక్రమాల కోసం వెచ్చిస్తుంటారు. ఇప్పటి వరకు 280 మిలియన్ డాలర్లను క్యాన్సర్ పరిశోధనలు, విద్యాసంస్థలతోపాటు ఇతర దాతృత్వ కార్యక్రమాల కోసం ఇచ్చినట్లు ఫోర్బ్స్ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!