Thomas Lee: అమెరికాలో తుపాకీతో కాల్చుకుని.. బిలియనీర్ ఆత్మహత్య..!
రూ.16,500కోట్ల సంపద కలిగిన ప్రముఖ బిలియనీర్ థామస్ లీ (Thomas Lee) ఆత్మహత్య చేసుకోవడం అగ్రరాజ్య వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది. తన ఆఫీసులోనే ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు.
వాషింగ్టన్: అమెరికా (US)కు చెందిన ప్రముఖ పెట్టుబడుల సంస్థ లీ ఈక్విటీ అధినేత, బిలియనీర్ థామస్ లీ (Thomas Lee) (78) ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆఫీసులోనే తుపాకీతో కాల్చుకుని ఆయన చనిపోయినట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
అమెరికా (America) కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం మన్హట్టన్లోని తన కార్యాలయానికి వచ్చిన థామస్ లీ (Thomas Lee).. చాలా సేపటి వరకు గది నుంచి బయటకు రాలేదు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా లీ బాత్రూమ్లో రక్తపు మడుగులో కన్పించారు. దీంతో వెంటనే ఆమె 911కు కాల్ చేసింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే ఆయన మరణించారు. ఆయన తలకు బులెట్ గాయమైంది. లీ తనను తాను కాల్చుకుని మరణించి ఉంటారని పోలీసులు వెల్లడించినట్లు అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. ఆయన మరణంపై కుటుంబసభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే అందులో మృతికి గల కారణాలను వారు పేర్కొనలేదు.
ఎవరీ థామస్ లీ..
78 ఏళ్ల లీ (Thomas Lee).. అమెరికా (US)లో ప్రముఖ ఇన్వెస్టర్, ఫైనాన్షియర్. ప్రైవేట్ ఈక్విటీ మార్కెట్, పెట్టుబడి వ్యాపారాలకు ఆయనను మార్గదర్శకుడిగా భావిస్తారు. 1974లో థామస్ హెచ్ లీ పార్ట్నర్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత 2006లో లీ ఈక్విటీని ప్రారంభించారు. దాదాపు 5 దశాబ్దాలుగా వందలాది సంస్థల్లో ఆయన 15 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. వ్యాపారవేత్తగానే గాక, దాతగా ఆయనకు ఎంతో మంచి పేరుంది. ది లింక్లన్ సెంటర్, మ్యూజియం అండ్ మోడ్రన్ ఆర్ట్, బ్రాండీస్ యూనివర్శిటీ, హార్వర్డ్ యూనివర్శిటీ, మ్యూజియం ఆఫ్ జెవిష్ హెరిటేజ్ వంటి సంస్థల్లో ఆయన ట్రస్టీ హోదాలో బోర్డు సభ్యుడిగా వ్యవహరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (Bill Clinton) దంపతులకు థామస్ లీ స్నేహితుడు. ఆయన నికర సంపద దాదాపు 2 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.16,500కోట్లకు పైమాటే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
-
స్పీకర్ తమ్మినేని కోటకు బీటలు!