Ukraine Crisis: ఐరాసలో భారత్ ఓటింగ్కు దూరం.. స్వదేశంలో విమర్శలపై అమెరికా వ్యాఖ్యలు..!
ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐరాస సర్వప్రతినిధి సభ బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్ మూడోసారి ఓటింగ్కు దూరంగా ఉంది.
భారత్ ఇప్పుడు ఆ రెండు విషయాల గురించే ఆలోచిస్తోందన్న అగ్రదేశం
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐరాస సర్వప్రతినిధి సభ బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్ మూడోసారి ఓటింగ్కు దూరంగా ఉంది. దీనిపై అగ్రదేశం అమెరికా స్పందించింది. రష్యా దురాక్రమణను ఖండించే విషయంలో సమిష్టిగా స్పందించాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించింది. ఆ అవసరాన్ని నొక్కిచెప్పేందుకు విదేశాంగ శాఖ భారత్తో సంప్రందింపులు జరుపుతోందని అమెరికా దౌత్యవేత్త డొనాల్డ్ లూ వెల్లడించారు. ఈ సంక్షోభంపై భారత్ స్పష్టమైన స్థానం తీసుకోవాలని కోరేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
‘మా ఆలోచనలన్నీ ఎక్కువగా రష్యా దురాక్రమణ గురించే ఉన్నాయి. రష్యా దాడిని ఖండిస్తూ సమష్టిగా స్పందించాల్సిన ఆవశ్యకతను భారత్కు వివరించేందుకు మా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. మరోపక్క ఈ సమయంలో భారత ప్రభుత్వం రెండు విషయాల గురించి ప్రధానంగా దృష్టిసారించింది. ఒకటి.. ఈ సంక్షోభాన్ని ఇరుదేశాలు దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని కోరుతోంది. అలాగే ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వేల సంఖ్యలో ఉన్న విద్యార్థుల గురించి ఆందోళన చెందుతోంది. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలను సంప్రదిస్తోంది’ అని డొనాల్డ్ అన్నారు.
భారత్ విలువైన భాగస్వామి..
యూఎన్లో భారత్ ఓటింగ్కు దూరంగా ఉండటంతో అమెరికా నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. దాంతో యూఎస్ విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ముందు డొనాల్డ్ వివరణ ఇచ్చారు. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి వెల్లడించారు. అంతేగాకుండా రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ గురించి ప్రస్తావించారు. ఆ కొనుగోలుపై ఆంక్షల విషయమై బైడెన్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ‘నేను చెప్పదల్చుకుందేంటంటే.. భారత్ ఇప్పుడు మనకు ముఖ్యమైన భద్రతా భాగస్వామి. ఆ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం మనకు విలువైందని భావిస్తున్నాం’ ఆయన కమిటీ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అలాగే గత కొద్దికాలంగా రష్యా నుంచి భారత్ ఆయుధాల దిగుమతులను 53 శాతం తగ్గించిందని, అమెరికా, ఇతర భాగస్వామ్య దేశాల నుంచి రక్షణ కొనుగోళ్లను పెంచిందని గుర్తు చేశారు. అలాగే దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోందని వెల్లడించారు.
భారత్ దాడిని ఖండించనప్పటికీ..
ఇంకోపక్క ఆ దాడి విషయంలో భారత్ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించనప్పటికీ.. కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆ దేశం ఉక్రెయిన్కు అండగా నిలుస్తోందన్నారు. మానవీయ సాయం పంపుతామని ప్రకటించిందని చెప్పారు. ఉక్రెయిన్ ప్రభుత్వ అభ్యర్థనకు తగినట్లుగా ఇప్పుడు అదే ముఖ్యమని తెలిపారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించేందుకు అన్ని దేశాలు ఐరాస చట్టాలకు కట్టుబడి ఉండాలని భారత్ పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని రష్యా ఉల్లంఘిస్తుండటం పై ఇది భారత్ చేసిన స్పష్టమైన సూచన అని డొనాల్డ్ కమిటీ ముందు తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు