Imran Khan: దండయాత్ర లేకుండానే పాక్ను బానిసగా మార్చిన అమెరికా: ఇమ్రాన్ఖాన్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అగ్రరాజ్యం అమెరికాపై మరోసారి విరుచుకుపడ్డారు. ఎలాంటి దండయాత్ర చేయకుండానే ఈ దేశాన్ని అమెరికా బానిసగా మార్చేసిందంటూ దుయ్యబట్టారు. ఈ ‘దిగుమతి ప్రభుత్వాన్ని
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అగ్రరాజ్యం అమెరికాపై మరోసారి విరుచుకుపడ్డారు. ఎలాంటి దండయాత్ర చేయకుండానే ఈ దేశాన్ని అమెరికా బానిసగా మార్చేసిందంటూ దుయ్యబట్టారు. ఈ ‘దిగుమతి ప్రభుత్వాన్ని’ ప్రజలు ఎన్నటికీ అంగీకరించబోరన్నారు.
అవిశ్వాస తీర్మానం ద్వారా గత నెల ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా కుట్ర పన్నిందంటూ ఇమ్రాన్ పలుమార్లు ఆరోపించారు. తాజాగా మరోసారి అగ్రరాజ్యం జోక్యాన్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పంజాబ్లోని ఫైసలాబాద్లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ‘‘ఎలాంటి దాడులు, దండయాత్రలు చేయకుండానే పాకిస్థాన్ను అమెరికా బానిసను చేసేసింది’’ అని ఆరోపించారు. తన సొంత ప్రయోజనాలు చూసుకోకుండా ఆ దేశం ఎవరికీ సాయం చేయదని దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా పాక్ ప్రస్తుత విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా విదేశాంగ మంత్రి నుంచి బిలావల్ డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ‘‘బిలావల్, ఆయన తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ అవినీతికి పాల్పడి కూడగట్టుకున్న సంపాదన అంతా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాచిపెట్టారు. అందుకే వాళ్లు అమెరికాను ఎదిరించలేరు. ఒకవేళ అలా చేస్తే వాళ్లు సర్వం కోల్పోవాల్సిందే’’ అని ఇమ్రాన్ ఎద్దేవా చేశారు.
గత శనివారం మరో ర్యాలీలో మాట్లాడుతూ.. తనను హత్య చేయడానికి పాక్ లేదా విదేశాల్లో కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనకు ఏం జరిగినా.. అందుకు కారకులెవరన్నది ప్రజలు గుర్తించగలరన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్ ఖండించారు. కుట్ర జరుగుతోందన్న ఆరోపణలను ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్.. వీటికి అడ్డుకట్ట వేసే ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) ఆమోదం తెలిపింది. -
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?