Indo Pacific Trade Bloc: ఇండో-పసిఫిక్ ట్రేడ్ బ్లాక్కు శ్రీకారం
ఇండో-పసిఫిక్ దేశాల మధ్య వాణిజ్యబంధం పెంపొందించేలా సరికొత్త అధ్యాయం మొదలైంది. జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇండో-పసిఫిక్ ట్రేడ్ బ్లాక్కు శ్రీకారం చుట్టారు.
జపాన్లో ప్రారంభించిన జోబైడెన్
ఇంటర్నెట్డెస్క్: ఇండో-పసిఫిక్ దేశాల మధ్య వాణిజ్యబంధం పెంపొందించేలా సరికొత్త అధ్యాయం మొదలైంది. జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇండో-పసిఫిక్ ట్రేడ్ బ్లాక్కు శ్రీకారం చుట్టారు. మొత్తం 13 దేశాలతో ప్రారంభించిన ఈ బ్లాక్లో భారత్, జపాన్ కూడా సభ్యులుగా ఉన్నాయి. ఈ ప్రాంత శ్రేయస్సు కోసం ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ (ఐపీఈఎఫ్) ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ‘‘21వ శతాబ్ధంలో ఈ ప్రాంతంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు మిత్రులు, భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకే ఈ ఫ్రేమ్ వర్క్’’ బైడెన్ వెల్లడించారు.
సాధారణ వాణిజ్య కూటముల మాదిరిగానే దీనిలో టారీఫ్లు, మార్కెట్ యాక్సెస్లపై చర్చించేందుకు ఏమీలేవు. ఐపీఈఎఫ్ కింద భాగస్వామ్య దేశాలను నాలుగు అంశాల్లో నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం అనుసంధానించేందుకు యత్నిస్తుంది. వీటిల్లో డిజిటల్ ఎకనామీ, స్లపయ్ చైన్స్, క్లీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యాంటీ కరెప్షన్ వంటివి దీనిలో ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, అందరికీ అందుబాటులో ఉండేందుకు కట్టుబడి ఉన్నాం. సుసంపన్న వృద్ధి, శాంతి కోసం భాగస్వాముల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడటం ముఖ్యం’’ అని జాయింట్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
ఈ వాణిజ్య కూటమిలో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండియా, ఇండోనేషినియా జపాన్, మలేషియా, న్యూజిలాండ్, ది ఫిలిప్పీన్స్, సింగపూర్, సౌత్కొరియా, థాయ్లాండ్, వియత్నాంలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
ఈ కూటమి ఏర్పాటుపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సులేవాన్ మాట్లాడుతూ ‘‘ఈ కూటమిలో భాగస్వాముల జీడీపీలు మొత్తం ప్రపంచ జీడీపీలో 40శాతానికి సమానం. ఈ కూటమిలో మరిన్ని దేశాలు చేరతాయని భావిస్తున్నాము’’ అని పేర్కొన్నారు. ట్రంప్ హయాంలో బలహీనపడిన ఆర్థిక, సైనిక కూటములను వేగవంతంగా బలోపేతం చేసేందుకు బైడెన్సర్కారు ప్రయత్నిస్తోంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని ప్రత్యామ్నాయంగా అమెరికా మిత్రదేశాల కోసం ఐపీఈఎఫ్ను ప్రారంభించినట్లు భావిస్తున్నారు.
తైవాన్కు లభించని స్థానం ..
ఐపీఈఎఫ్ ట్రేడ్బ్లాక్ ఏర్పాటును చైనా తీవ్రంగా విమర్శించడాన్ని జాక్ సులేవాన్ తోసిపుచ్చారు. ఈ కూటమి ఏర్పాటు, నిర్వచనంలో ఎటువంటి గోప్యత లేదన్నారు. ఈ కూటమిలో తైవాన్కు స్థానం లభించలేదు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తైవాన్తో హై టెక్నాలజీ, సెమీకండెక్టర్లు, టెక్నాలజీ వంటి అంశాలపై సంబంధాలను మరింత బలోపేతం చేసుకొంటాము అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!