Ukraine Crisis: ఉక్రెయిన్పై దండయాత్ర.. చైనా సాయం కోరిన రష్యా..!
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. పలు నగరాల్లో బాంబులు, క్షిపణుల మోత మోగుతూనే ఉంది. రష్యాను అడ్డుకునేందుకు ఇప్పటికే ప్రపంచ దేశాలు వేల కొద్దీ
ఆరోపించిన అమెరికా అధికారి
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. పలు నగరాల్లో బాంబులు, క్షిపణుల మోత మోగుతూనే ఉంది. రష్యాను అడ్డుకునేందుకు ఇప్పటికే ప్రపంచ దేశాలు వేల కొద్దీ ఆంక్షలు విధించినప్పటికీ.. క్రెమ్లిన్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. పుతిన్ వ్యవహారంపై చర్చించేందుకు నేడు చైనాతో భేటీ కానుంది. అయితే సమావేశానికి కొద్ది గంటల ముందు అమెరికా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో రష్యా.. చైనా సాయం కోరుతోందని, ఆయుధాలు ఇవ్వాలని అడిగిందని ఆ అధికారి ఆరోపించారు.
‘‘ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యా.. మరింత ముందుకెళ్లేందుకు ఇటీవల చైనా సాయం కోరినట్లు తెలిసింది. సైనిక పరికరాలు, ఆయుధాలు ఇవ్వాలని అభ్యర్థించింది’’ అని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది. అయితే చైనా సాయం ఎందుకు కోరిందన్న వివరాలను మాత్రం సదరు అధికారి చెప్పలేదని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండించింది. తమ నుంచి రష్యా ఎలాంటి సాయం కోరలేదని వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి లీ పెంగ్యూ వెల్లడించారు. ‘‘ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితులు తీవ్ర ఆందోళన కరంగా ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా కాకుండా అడ్డుకోవడమే ఇప్పుడు చైనా ముందున్న ప్రథమ ప్రాధాన్యత’’ అని లీ అన్నారు.
చైనాకు అమెరికా వార్నింగ్..
ఇదిలా ఉండగా.. రష్యా దండయాత్ర నేపథ్యంలో అమెరికా, చైనా ప్రతినిధులు సోమవారం రోమ్లో భేటీ కానున్నారు. అమెరికా తరఫున జాతీయ భద్రతా సలహాదారుడు జాక్ సులివన్, చైనా నుంచి విదేశాంగ విధాన సలహాదారుడు యాంగ్ జీచీ దీనికి హాజరుకానున్నారు. యుద్ధంపై రష్యా చేస్తున్న ప్రచారం, ఆ దేశంపై ప్రపంచ దేశాలు విధిస్తున్న ఆంక్షలు వంటి అంశాలు దీనిలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. రష్యాకు సాయం చేస్తే చైనాకు ఆర్థికపరంగా భారీ పెనాల్టీలు తప్పవని కూడా ఈ సమావేశంలో బీజింగ్ను అమెరికా హెచ్చరించనున్నట్లు సమాచారం.
‘‘రష్యాకు సాయం చేస్తే ఆ తర్వాత కచ్చితంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే చైనాను నేరుగా, వ్యక్తిగతంగా హెచ్చరించాం. ఈ విషయంలో చైనా ముందుకెళ్లడాన్ని మేం అంగీకరించబోం. ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ సమయంలో ఏ దేశమైనా రష్యాకు లైఫ్లైన్గా ఉంటానంటే మేం ఒప్పుకునేది లేదు’’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జాక్ సులివన్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది. -
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
తప్పుడు మార్గంలో బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు యత్నించిన ఓ మహిళ ఏకంగా చనిపోయిన తన బంధువును బ్యాంకుకు తీసుకొచ్చింది. -
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
కెనడా (Canada) ఎయిర్పోర్టులో మాయమైన బంగారం కంటెయినర్ కేసులో ముందడుగు పడింది. ఆ కేసులో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
ఆ దేశంలోని ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయాలని (work from home) తాజాగా ఆ దేశాధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. -
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు