Ukraine Crisis: రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్కు ప్యాకేజీ..?
భారత్ ఆయుధాలు, సైనిక అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అమెరికా యత్నాలు మొదలు పెట్టనుంది. దీనిలో భాగంగా భారత్కు 500 మిలియన్ డాలర్లు
ఇంటర్నెట్డెస్క్: భారత్ ఆయుధాలు, సైనిక అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అమెరికా యత్నాలు మొదలు పెట్టనుంది. దీనిలో భాగంగా భారత్కు 500 మిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే అమెరికా నుంచి ఇటువంటి సాయం అత్యధికంగా పొందుతున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్, ఈజిప్ట్ ఇలాంటి సాయాలను పొందుతున్నాయి. ఈ డీల్ను ఎప్పుడు ప్రకటిస్తారు.. ఎటువంటి ఆయుధాలను సరఫరా చేస్తారు అనే అంశాలపై స్పష్టత రాలేదు.
జోబైడెన్ కార్యవర్గం భారత్ను దీర్ఘకాలిక భద్రతా భాగస్వామిగా నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలో ఈ ప్యాకేజీ కూడా భాగం. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థవైఖరి అవలంభిస్తూ.. రష్యాను తప్పుపట్టలేదు. ఈ నేపథ్యంలో భారత్ పరిస్థితి అర్థం చేసుకొని ఆమెరికా చేపట్టిన చర్యల్లో ఇది ఒకటి.
దీర్ఘకాలంలో భారత్ను నమ్మకమైన భాగస్వామిగా చూడాలనే లక్ష్యంతో అమెరికా ఇతర దేశాలతో కూడా కలిసి పనిచేస్తోంది. ఫ్రాన్స్ వంటి దేశాలను ఈ క్రమంలో కలుపుకొని పోతోంది. భారత సైనిక అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకొంది. దీనిని మరింత వేగవంతం చేసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భారీ ఆయుధాలైన ఫైటర్ జెట్లు, యుద్ధనౌకలు, ట్యాంకులు వంటి వాటిని ఇవ్వడంలో అమెరికాకు సవాళ్లు ఎదురుకానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని