Vivek Ramaswamy: తమిళంలో మాట్లాడిన వివేక్ రామస్వామి.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారతీయ సంతతి వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే.. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ (Republican) తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) దూసుకెళ్తున్నారు. ఇందు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే.. తాజాగా వివేక్ తన మద్దతుదారులతో తమిళంలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ‘సాధారణంగా మనం భిన్నత్వాన్ని చూపించాలనుకుంటాం. కానీ మనమందరం ఒక్కటే అనే విషయాన్ని మరిచిపోతాం’ అంటూ ఓ వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
వీడియోలో వివేక్ రామస్వామిని కలిసిన వ్యక్తి ఆయనతో మాట్లాడుతూ..‘ మిమ్మల్ని అడగడానికి నా దగ్గర ఎలాంటి ప్రశ్నలు లేవు. కానీ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మిమ్మల్ని అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నాను. నేను తమిళనాడులోని వేలూరు నుంచి వచ్చాను’ అని చెప్పాడు. దాంతో వివేక్ అతడికి ‘నేను కూడా తమిళంలో మాట్లాడతాను’ అని తమిళంలోనే సమాధానమిచ్చారు. తన తమిళ్ ఎక్కువగా పాలక్కాడ్లో మాట్లాడే మాండలికంలో ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
దీంతో భారతీయులు ఆయనకు సానుకూలంగా కామెంట్లు పెడుతున్నారు. ‘వివేక్ అమెరికా అధ్యక్షుడిగా సరిపోతారు. ఆల్ ది బెస్ట్’ ‘ ఆయన తన మూలాలను మరిచిపోలేదు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా ఎటువంటి తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నారు. ఇదే కదా భారతీయ వ్యక్తితం’ అంటూ రాసుకొచ్చారు. రామస్వామి తల్లిదండ్రులు కేరళ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హఫీజ్ అనుచరుడు అద్నాన్ అహ్మద్ కాల్చివేత
వరుసగా జరుగుతున్న హత్యలతో పాకిస్థాన్లో ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. -
తొందరగా ఎదిగితే ఆరోగ్యం చిందరవందర!
పదమూడేళ్లకు ముందే రజస్వల అయిన బాలికలు నడి వయసులో టైప్-2 మధుమేహానికి గురయ్యే ముప్పు ఎక్కువని అమెరికన్ పరిశోధకులు కనుగొన్నారు. -
ఓజోన్ కాలుష్యం పెరిగినా అధిక దిగుబడులు
భూ ఉపరితలానికి దగ్గరగా ఓజోన్ కాలుష్యం పెరిగినా దాన్ని తట్టుకునే శక్తి కొన్ని రకాల పంటలకు ఉందని భారత్, అమెరికా, చైనాల్లో 20 ఏళ్లపాటు జరిగిన ప్రయోగాలు నిర్ధారించాయి. -
అప్పుడెందుకు మౌనంగా ఉన్నారు?
హమాస్ ఉగ్ర దాడికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ, మహిళా హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
దుబాయ్లో పుతిన్.. యూఏఈ, సౌదీ పాలకులతో భేటీ
ఉక్రెయిన్పై యుద్ధంతో బిజీబిజీగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాన్నాళ్ల తర్వాత తొలిసారిగా పశ్చిమాసియా దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్(యూఏఈ)ల్లో బుధవారం పర్యటించారు. -
భారత హజ్, ఉమ్రా యాత్రికులకు వెసులుబాట్లు
భారత్ నుంచి హజ్, ఉమ్రా యాత్రల కోసం మక్కా, మదీనాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సౌదీ అరేబియా పలు వెసులుబాట్లు కల్పించినట్లు సౌదీ అరేబియా హజ్, ఉమ్రా విభాగ మంత్రి తౌఫిగ్ అల్ రబియా తెలిపారు. -
సూయెజ్ కాలువలో వంతెనను ఢీకొట్టిన రవాణా నౌక
ప్రపంచ వాణిజ్య రవాణాలో అత్యంత కీలకమైన ఈజిప్టులోని సూయెజ్ కాలువలో బుధవారం ఓ నౌక ప్రమాదానికి గురైంది. -
అవును.. కొవిడ్ సమయంలో సరిగా స్పందించలేదు
కొవిడ్ వైరస్ తీవ్రతను తమ ప్రభుత్వం తక్కువ అంచనా వేసిందని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. -
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బుధవారం అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
రోదసిలోకి జంతువులను మోసుకెళ్లే క్యాప్సూల్ను ప్రయోగించాం
సమీప భవిష్యత్తులో మానవసహిత అంతరిక్ష యాత్రలు చేపట్టే దిశగా తాము కీలక ముందడుగు వేసినట్లు ఇరాన్ తెలిపింది. -
శిలాజ ఇంధనాలకు స్వస్తి చెబుదాం
ఐక్యరాజ్య సమితి కాప్-28 సదస్సులో వాతావరణ చర్చలపై తొలి రోజు గణనీయమైన పురోగతి కనిపించినా ఆ తరువాత పరిస్థితి ముందుకూ వెనక్కూ అన్నట్లు ఊగిసలాడుతోంది. -
భీకర భూతల పోరు
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ దళాల మధ్య భీకర భూతల పోరు సాగుతోంది. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు ఈ పోరు విస్తరించడంతో ప్రజలు భీతావహులై పోతున్నారు. -
కిమ్ కంటతడి!
ఉత్తర కొరియా అధినేత కిమ్జోంగ్ ఉన్ పేరు వినగానే ఆయన నియంతృత్వ వైఖరే గుర్తొస్తుంది. -
ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో భారతీయుడి మృతి
ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖుస్దీప్ సింగ్ అనే భారతీయుడు దుర్మరణం పాలయ్యారు.


తాజా వార్తలు (Latest News)
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
-
నిజామాబాద్ బబ్లూను.. నిన్ను లేపేస్తా: డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన మందుబాబు వీరంగం
-
Chicken Price: చికెన్ అగ్గువ.. గుడ్డు పిరం
-
Hyderabad: రేవంత్ ప్రమాణస్వీకారం.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
దారి దాటేలోగా... దారుణమే జరిగింది!