USA: భారత్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. విచారణకు సహకరించాలని కోరిన విదేశాంగ శాఖ
కెనడాలోని ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో అమెరికా మెల్లిగా స్వరం పెంచుతోంది. దర్యాప్తునకు సహకరించాలని తాము భారత్ను అన్ని రకాలుగా అభ్యర్థించామని తాజాగా పేర్కొంది.
ఇంటర్నెట్డెస్క్: కెనడా(Canada)లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో సహకరించాలని భారత్ను ప్రైవేటుగా, బహిరంగంగా అభ్యర్థించామని అమెరికా (USA) స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కచ్చితంగా జరగాలని.. దోషులకు శిక్షపడాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన రోజువారీ మీడియా సమావేశంలో మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో మేము తీవ్రంగా కలత చెందాం. మా కెనడా భాగస్వాములతో టచ్లో ఉన్నాం. దోషులకు శిక్షపడేలా కెనడా దర్యాప్తు కొనసాగడం ముఖ్యమని మేము భావిస్తున్నాం. ఈ దర్యాప్తునకు సహకరించాలని మేము భారత్ను బహిరంగంగా.. ప్రేవేటుగా అభ్యర్థించాం’’ అని వెల్లడించారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.
దోషులను గుర్తించేందుకు దర్యాప్తు జరపాలి
ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో దోషులను గుర్తించేందుకు దర్యాప్తు జరపాల్సిందేనని కాలిఫోర్నియా ప్రతినిధుల సభ సభ్యుడు జిమ్ కోస్టా డిమాండ్ చేశారు. ఆయన ఎక్స్ (ట్విటర్)లో స్పందిస్తూ.. ‘‘నిజ్జర్ హత్య విషయంపై నేను చాలా ఆందోళన చెందాను. దీనిపై అధికారిక బ్రీఫింగ్ కావాలని హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా కోరాను. ఈ నేరంపై మనం కచ్చితంగా దర్యాప్తు చేపట్టి దోషులను బాధ్యులుగా చేయాలి’’ అని పేర్కొన్నారు.
భారత్ కీలక భాగస్వామే.. కానీ..!
మరోవైపు భారత్-కెనడా దౌత్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కెనడా ప్రభుత్వ ప్రకటనలతో ఖలిస్థానీలు పేట్రేగి పోతున్నారు. తాజాగా కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. వీటికి ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థ నేతృత్వం వహిస్తోంది. భారత దౌత్యవేత్తను బహిష్కరించాలని ఆ సంస్థ ప్రతినిధి జతిందర్ సింగ్ గ్రేవాల్ కెనడాను డిమాండ్ చేశారు. మరోవైపు భారత దౌత్యకార్యాలయాల వద్ద బందోబస్తు పెంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాజాపై ఐరాస భద్రతా మండలి తీర్మానం .. వీటో పవర్ వాడిన అమెరికా
గాజాలో కాల్పుల విరమణపై ఐరాస భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని తన అసాధారణ అధికారాలతో అమెరికా(America) అడ్డుకుంది. -
పాలస్తీనీయులకు ఎందుకీ శిక్ష?
హమాస్ క్రూరత్వానికి.. పాలస్తీనా ప్రజలను సామూహికంగా శిక్షించడం సరికాదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. -
భారత్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీపై ఒత్తిడి తేలేం: పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత ప్రజల ప్రయోజనాల కోసం మోదీ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని కొనియాడారు. -
కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలింపు
గాజాస్ట్రిప్లో అదుపులోకి తీసుకుంటున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. -
పన్నూ హత్యకు కుట్ర బాధ్యులపై చర్య తీసుకోవాలి: అమెరికా
తమ వ్యూహాత్మక భాగస్వామి భారత్తో బంధాన్ని మరింత దృఢపరచుకుంటున్నామని, అదే సమయంలో న్యూయార్క్లో సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరుతున్నామని అమెరికా గురువారం స్పష్టం చేసింది. -
చర్చలు, దౌత్యంతోనే పరిష్కరించుకోవాలి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న ఘర్షణపై, ఆ ప్రాంతంలో దిగజారుతున్న భద్రతా పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని శుక్రవారం లోక్సభలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. -
బైడెన్ కుమారునిపై నేరాభియోగాలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ (53) పై గురువారం కాలిఫోర్నియాలో తొమ్మిది అభియోగాలు నమోదయ్యాయి. -
అమెరికాలో భారతీయ హోటల్ మేనేజర్కు 57 ఏళ్ల జైలు
అమెరికాలోని జార్జియాలో హోటల్ మేనేజర్గా ఉన్న భారత జాతీయుడు శ్రీష్ తివారి(71)కి స్థానిక న్యాయస్థానం 57 ఏళ్ల జైలుశిక్ష విధించింది. -
అందాల శ్వేత మకరం!
ఈ చిత్రంలో కనిపిస్తున్నది బల్లి కాదు. అరుదైన శ్వేతరంగు మొసలి. అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలో గేటర్లాండ్ సరీసృపాల పార్కులో ఇది జన్మించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. -
సాగరంలో పెరుగుతున్న ఆమ్లత్వం
ఉష్ణ మండలానికి ఎగువన, దిగువన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత గత 40 ఏళ్లలో 1 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగింది. -
విదేశీ విద్యార్థులపై జీవనవ్యయ భారం
ఉన్నత విద్య కోసం తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులపై కెనడా ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. -
Putin: రెండు దశాబ్దాలుగా ‘ఒకేఒక్కడు’.. ఐదోసారి అధికారానికి ‘సై’!
రష్యాలో రెండు దశాబ్దాలకుపైగా అధికారంలో కొనసాగుతూ దేశంలో ఎదురులేని నేతగా నిలిచిన పుతిన్.. 2036 వరకు అధ్యక్ష పదవిలో ఉండేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
ChandraBabu: గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు: చంద్రబాబు
-
Nayanthara: నన్ను అలా పిలిస్తే తిట్టినట్లు ఉంటుంది..: నయనతార
-
NIA: 44 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు.. ఐసిస్ కుట్ర కేసులో 13 మంది అరెస్టు
-
Telangana Assembly: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. తొలుత సీఎం, తర్వాత మంత్రులు
-
Kishan Reddy: లోపాయికారి ఒప్పందం ప్రకారమే మజ్లిస్ ప్రొటెం స్పీకర్: కిషన్రెడ్డి
-
గాజాపై ఐరాస భద్రతా మండలి తీర్మానం .. వీటో పవర్ వాడిన అమెరికా