Ukraine Crisis: రష్యా సైనిక దాడికి ప్రతిగా.. అమెరికా ఆర్థిక యుద్ధం..!
ఉక్రెయిన్పై దాడి చేసినందుకు ప్రతిగా రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నాయి. తాజాగా అమెరికా కఠినమైన ఆర్థిక, ఎగుమతి ఆంక్షలను విధించింది. ఆసియా, ఐరోపాలోని మిత్రదేశాలతో కలిసి వీటిని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించింది.
రష్యా బ్యాంకులు, టెక్ సంస్థల్ని లక్ష్యం చేసుకొన్న అమెరికా..
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్పై దాడి చేసినందుకు ప్రతిగా రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నాయి. తాజాగా అమెరికా కఠినమైన ఆర్థిక, ఎగుమతి ఆంక్షలను విధించింది. ఆసియా, ఐరోపాలోని మిత్రదేశాలతో కలిసి వీటిని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించింది. అంతర్జాతీయ వేదికలపై పుతిన్ను ఏకాకి చేయాలని బైడెన్ కార్యవర్గం పిలుపునిచ్చింది. రష్యా ఆంక్షల విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శ్వేతసౌధంలో ఒక ప్రకటన చేశారు. ‘‘మేము ఇప్పుడు ఈ కఠిన ఆంక్షలతో పుతిన్ను ఎదుర్కోకపోతే.. ఆయనకు మరింత ధైర్యం వచ్చేస్తుంది. పుతిన్ యుద్ధాన్ని ఎంచుకొన్నారు. దీని పర్యవసానాలను ఆయన.. ఆ దేశం భరించాల్సిందే’’ అని పుతిన్ను ఉద్దేశించి బైడెన్ వ్యాఖ్యానించారు. మొత్తం 10 రష్యా ఆర్థిక సంస్థలపై అమెరికా కఠిన ఆంక్షలను విధించింది. దొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించిన వెంటనే రష్యాపై తొలివిడత ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిన్న రష్యా బ్యాంకులను లక్ష్యంగా చేసుకొన్నారు. కానీ, ఈ సారి మాత్రం రష్యా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాల వంటి వాటిపై గురిపెట్టారు.
ఆంక్షలు ఇలా..
అమెరికా మిత్రదేశాలు రష్యా నుంచి ఎగుమతులను అడ్డుకోనున్నాయి. రష్యాపై దీర్ఘకాల ప్రభావం ఉండేలా జాగ్రత్త తీసుకొన్నామని.. అదే సమయంలో అమెరికా మిత్రదేశాలపై స్వల్ప ప్రభావం మాత్రమే పడేలా చూశామని బైడెన్ వివరించారు.
ఈ కొత్త ఆంక్షల పరిధిలోని రష్యాలోని దాదాపు 80శాతం బ్యాంకింగ్ రంగం వచ్చేట్లు చూశారు. రష్యాలోని అతిపెద్ద బ్యాంకులు అయిన స్బెర్ బ్యాంక్, వీటీబీ బ్యాంకులు డాలర్లను ఉపయోగించి ఎటువంటి లావాదేవీలు నిర్వహించకుండా చర్యలు తీసుకొన్నారు. దీంతోపాటు వీటీబీ బ్యాంకుకు సంబంధించిన ఎటువంటి ఆస్తులైనా అమెరికా ఆర్థికవ్యవస్థలో ఉంటే వాటిని స్తంభింపజేస్తుంది. దీంతోపాటు అమెరికన్లు ఆ బ్యాంకులతో ఎటువంటి లావాదేవీలు జరపకూడదని ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్ కూడా వీటీబీ బ్యాంకు ఆస్తులను స్తంభింపజేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ ఆంక్షల ఫలితంగా రష్యాలో వ్యాపారాలకు.. డాలర్లు, యూరోలు, పౌండ్లు, యెన్లు వినియోగించకుండా అడ్డుకున్నట్లయ్యింది. ఈ రెండు బ్యాంకులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 90 ఆర్థిక సంస్థలు, వాటి అనుబంధ సంస్థలను ఈ ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చినట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రష్యాకు చెందిన ఒలిగార్క్లు, వారి కుటుంబ సభ్యులపై కూడా ఆంక్షల కొరడా ఝుళిపించింది. బ్యాంకింగ్తోపాటు లోహరంగం, టెలి కమ్యూనికేషన్స్, రైల్వే సంస్థలు ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. రష్యాలోని అతిపెద్ద గ్యాస్ సంస్థ అయిన గ్యాజ్ప్రొమ్ పశ్చిమ దేశాల బ్యాంకుల నుంచి మూలధనం సమీకరించకుండా కొత్త ఆంక్షలు అడ్డుకొన్నాయి.
ఈ సారికి స్విఫ్ట్ బ్యాన్ ఆగింది..
అమెరికా మిత్ర దేశాల్లో కొన్ని రష్యాను స్విఫ్ట్ వ్యవస్థ నుంచి పక్కనపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఈ సారికి అమెరికా ఆ ఆంక్షలను అస్త్రంగా ప్రయోగించలేదు. దీనిపై బైడెన్ స్పందిస్తూ స్విఫ్ట్ నుంచి బహిష్కరణ అస్త్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని.. కానీ, ఐరోపా మిత్రులు ఇప్పుడే దానిని కోరుకోవడంలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంక్షలు స్విఫ్ట్ తొలగింపు కన్నా తీవ్రమైనవే అని బైడెన్ సమర్థించుకొన్నారు.
ఐరోపా సంఘం అదనపు ఆంక్షలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆంక్షల ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఐరోపా సమాఖ్య కూడా రష్యా కట్టడి కోసం యత్నాలను తీవ్రతరం చేసింది. అకారణంగా , అన్యాయంగా చేస్తున్న ఈ యుద్ధాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. దీనికి రష్యా పూర్తి బాధ్యత వహించాలంది. దీంతోపాటు రష్యాకు బెలారస్ సహకరించడాన్ని వ్యతిరేకించింది. దీంతోపాటు అదనపు ఆంక్షలు విధించేందుకు ఐరోపా సమాఖ్య ఆమోద ముద్ర వేసింది. ఈ సారి ఆంక్షలు రష్యా ఆర్థిక రంగాన్ని, ఇంధన, రవాణా, మిలటరీ-పౌర ప్రయోజనాలకు వాడే సరుకులు, ఎగుమతుల నియంత్రణ, ఎగుమతులకు ఆర్థిక మద్దతు, వీసా పాలసీ, రష్యాలోని కీలక వ్యక్తులు, సరికొత్త లిస్టింగ్ విధానంలో మార్పులు వంటివి వీటిల్లో ఉండనున్నాయని ఐరోపా సమాఖ్య పేర్కొంది. బెలారస్ను ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చేందుకు వేగంగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని నిర్ణయించింది. ‘‘ఐరోపా సమాఖ్య ఏకతాటిపై ఉందని నిరూపించేలా ఈ భారీ ఆంక్షలకు సభ్యదేశాలు ఈ రాత్రి ఆమోద ముద్ర వేశాయి’’ అని ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాన్డే లెయాన్ ట్వీట్ చేశారు. ఇప్పటికే తొలి విడత ఆంక్షల్లో 70 శాతం రష్యా బ్యాంకింగ్ రంగాన్ని, కీలక ప్రభుత్వ, రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకొన్నట్లు ఆమె పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM