American Airlines: విమాన టాయిలెట్లో ఫోన్తో రికార్డింగ్.. విమర్శల పాలవుతున్న ఎయిర్లైన్స్..
విమానంలో ప్రయాణిస్తున్న ఓ 14 ఏళ్ల బాలికకు టాయిలెట్లో చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన అమెరికన్ ఎయిర్లైన్స్లో చోటు చేసుకుంది.
వాషింగ్టన్: విమానంలో ప్రయాణం అంటే బోర్డింగ్ నుంచి ల్యాండింగ్ వరకు భద్రత పరంగా ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి. అయితే తాజాగా విమానంలోని టాయిలెట్లో ఓ బాలికకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన నార్త్ కరోలినాలోని షార్లెట్ నుంచి బోస్టన్కు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికన్ ఎయిర్లైన్స్కు ( American Airlines ) చెందిన విమానం ‘1441’ షార్లెట్ నుంచి బోస్టన్కు బయలుదేరింది. ఈ విమానంలో ఓ 14 ఏళ్ల బాలిక టాయిలెట్కు వెళ్తుండగా సిబ్బందిలోని ఒక యువకుడు అందులోని సీటు విరిగిపోయిందని, ఫస్ట్ క్లాస్ వాష్రూమ్ ఉపయోగించాలని సూచించాడు. దీంతో బాలిక ఆ యువకుడు సూచించిన వాష్రూమ్కు వెళ్లింది. అయితే టాయిలెట్ని ఉపయోగించిన తర్వాత సీటు వెనుక భాగంలో ఫోన్ అతికించి ఉండడాన్ని గమనించింది. వెంటనే ఆమె తన ఫోన్తో దాని ఫొటో తీసింది. ఆ బాలిక తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కుటుంబ సభ్యులతో చెప్పింది. ఈ ఘటన తమ కుమార్తెకు, తమకు ఇబ్బందిని కలిగించిందని.. టాయిలెట్లో రికార్డు చేయడానికే దానిని అమర్చారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్లైన్స్ స్పందిస్తూ.. ‘ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. తమ ప్రయాణికుల, సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఆ యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
జర్మనీ(Germany)కి ఖతార్ నుంచి దౌత్యపరమైన ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా..? లేదా..? తెలియాల్సి ఉంది. -
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి
రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దేశ మహిళలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజ్ఞప్తి చేశారు. -
Nithyananda: కైలాస దేశంతో ఒప్పందం.. పరాగ్వే దేశ మంత్రి పదవి ఊడగొట్టిన నిత్యానంద
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద స్థాపించిన ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’తో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. -
Israel-Hamas: ముగిసిన సంధి.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలు
Israel-Hamas: బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాత్కాలికంగా కుదిరిన సంధి గడువు ముగిసింది. దీంతో గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది. -
పన్నూ హత్యకు కుట్ర.. భారతీయుడిపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన అమెరికా
సిక్కు వేర్పాటువాది హత్య కుట్రలో భారత వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలను అమెరికా (USA) సీరియస్గా తీసుకుంది. అదే సమయంలో భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని వ్యాఖ్యానించింది. -
Iraq: ఇరాక్లో బాంబు దాడి.. 10 మంది మృతి
ఇరాక్లోని దియాలా ప్రావిన్స్లో స్థానిక ఎంపీ బంధువులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
భూతాపంలో 2023 కొత్త రికార్డు
వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. -
చర్చల ప్రసక్తే లేదన్న ఉత్తర కొరియా
తాము ఇటీవల నిర్వహించిన గూఢచారి ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా ఖండించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జాంగ్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) తెలిపింది. -
97కు చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను గురువారం ఉదయం మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. -
అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. -
మొదటి నుంచీ అదే చెబుతున్నాం
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నిన భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడంద్వారా మేం చెబుతున్న వాదనలకు బలం చేకూరిందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. -
తూర్పు ఉక్రెయిన్పై రష్యా దాడులు
తూర్పు ఉక్రెయిన్లోని దొనెట్స్క్ ప్రాంతంపై గురువారం రష్యా ఎస్-300 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. -
ఓస్ప్రేల నిలిపివేత!
అమెరికా వైమానిక దళానికి చెందిన ఓస్ప్రే విమానం సాగర జలాల్లో కూలిపోయిన నేపథ్యంలో జపాన్ పునరాలోచనలో పడింది. తన వద్ద ఉన్న ఇదే తరహా విమానాల కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేయాలని భావిస్తోంది. -
‘మరింత అణుశక్తి కావాలి’
వాతావరణ మార్పులపై పోరాటానికి మరింత అణుశక్తి కావాల్సి ఉందని, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు ఇది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానా గ్రాసీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Bomb threat: బెంగళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?