Ukraine Crisis: ఉక్రెయిన్కు 40 బిలియన్ డాలర్ల సాయానికి సెనెట్ ఓకే..!
ఉక్రెయిన్కు సాయం అందించేందుకు బైడెన్ సర్కారు ప్రతిపాదించిన 40 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి సెనెట్ ఆమెద ముద్రవేసింది.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్కు సాయం అందించేందుకు బైడెన్ సర్కారు ప్రతిపాదించిన 40 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి సెనెట్ ఆమెద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన బిల్లును 86-11 ఓట్లతో పాస్ చేసింది. ఈ బిల్లు ప్రకారం సైనిక, మానవీయ సాయం అమెరికా నుంచి ఉక్రెయిన్కు అందనుంది. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో యుద్ధాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేందుకు నిర్ణయించుకొన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన సెనెట్ ముందుకు వచ్చింది.
ఈ ప్యాకేజీ కింద అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్కు అందించే అవకాశం లభించింది. దీంతో పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలు, అత్యాధునిక శతఘ్నులను తరలించవచ్చు. దీనిలో 8 బిలియన్ డాలర్లు సాధారణ ఆర్థిక మద్దతు కూడా ఉక్రెయిన్కు అందనుంది. దీంతోపాటు గ్లోబల్ ఫుడ్ ఎయిడ్లో భాగంగా 5 బిలియన్ డాలర్లను ఇవ్వనున్నారు. ఇక శరణార్థులను ఆదుకొనేందుకు బిలియన్ డాలర్లు కేటాయించనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే అమెరికా సీనియర్ మిలటరీ అధికారులు బ్రస్సెల్స్లోని నాటో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తూర్పు ఐరోపాలో నాటో బలగాల మోహరింపుపై చర్చించారు. వీటికి సంబంధించిన నిర్ణయాలు జూన్ తొలి వారంలో మాడ్రిడ్లో జరగనున్న సదస్సులో వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే తూర్పు ఐరోపాలో నాటోకు చెందిన 40,000 దళాలు, 120 ఫైటర్ జెట్లు, 20 యుద్ధనౌకలు ఉన్నాయి.
మరోపక్క స్వీడన్, ఫిన్లాండ్ను నాటోలో చేర్చుకొనేందుకు కూడా బైడెన్ సర్కారు వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నిన్నిస్టో, స్వీడన్ ప్రధాని అండర్సన్ శ్వేతసౌధంలో బైడెన్ను కలిశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.