Army: ఆర్మీచీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే..?

భారత ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌పాండే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ పోస్టులో ఉన్న జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే భారత రెండో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అయ్యే అవకాశం ఉండటంతో ఆయన స్థానాన్ని పాండే భర్తీ చేసే అవకాశలున్నాయి.

Updated : 04 Apr 2022 15:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌పాండే బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఇప్పటికే ఈ పోస్టులో ఉన్న జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే భారత రెండో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అయ్యే అవకాశం ఉండటంతో ఆయన స్థానాన్ని పాండే భర్తీ చేసే అవకాశలున్నాయి. భారత్‌ సైన్యంలో నరవణే తర్వాత అత్యంత సీనియర్‌ అధికారి కూడా ఈయనే కావడం గమనార్హం. గత డిసెంబర్‌లో భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో కన్నుమూయడంతో ఆ స్థానం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. 

గత మూడు నెలల్లో చాలా మంది సీనియర్‌ అధికారులు పదవీవిరమణ చేశారు. వీరిలో లెఫ్టినెంట్‌ జనరల్స్‌ సీపీ మొహంతి, వైకే జోషీ తదితరులు ఉన్నారు. ఇటీవల మార్చి31న ఆర్మీ ట్రైనింగ్‌ కమాండ్‌ చీఫ్‌ రాజ్‌ శుక్లా కూడా రిటైర్‌ అయ్యారు. దీంతో పాండే ప్రస్తుతం అత్యంత సీనియర్‌అధికారిగా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని