Vivek: చైనాలో ఎలాన్ మస్క్ పర్యటన ఆందోళనకరమే : వివేక్ రామస్వామి
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) చైనాలో పర్యటించడం పట్ల అమెరికా నేత వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) చైనాలో బిజీ బిజీగా తన పర్యటన కొనసాగిస్తున్నారు. మూడేళ్ల తర్వాత అక్కడ (China) పర్యటిస్తున్న మస్క్.. చైనా ప్రభుత్వ అధికారులు, కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇలా చైనాలో టెస్లా (Tesla) అధినేత పర్యటించడం పట్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీచేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) ఆందోళన వ్యక్తం చేశారు. తమ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికాలోని ప్రముఖ వ్యాపారవేత్తలను చైనా పావుగా వాడుకుంటోందని ఆరోపించారు.
చైనాలో పర్యటిస్తోన్న మస్క్, ఆ దేశ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ తో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. చైనాలో తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని ప్రకటించారు. చైనా శక్తి, వాగ్దానాలపై ప్రశంసలు గుప్పించారు. ఈ సందర్భంగా చైనాతో అమెరికా దూరమవడాన్ని వ్యతిరేకించిన మస్క్.. రెండు దేశాల ప్రయోజనాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని అన్నారు. దీనిపై తాజాగా వివేక్ రామస్వామి స్పందించారు.
‘చైనా విదేశాంగ మంత్రితో భేటీ సందర్భంగా రెండు దేశాల మధ్య దూరం పెరగడాన్ని వ్యతిరేకించడంతోపాటు రెండు దేశాలను కవలలుగా పేర్కొనడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఈ విషయాన్ని చైనాలోని టెస్లా వైస్ ప్రెసిడెంట్ అక్కడి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. కానీ, అమెరికాలో కాదు’ అని మస్క్ పర్యటనకు సంబంధించి వివేక్ రామస్వామి ఓ వీడియో విడుదల చేశారు. బీజింగ్ అజెండాకు అనుకూలంగా అమెరికా వ్యాపారవేత్త ప్రచారం చేస్తున్నారని, ఇది చైనాకు అనుకూలిస్తుందన్నారు. అమెరికాకు కావాల్సింది.. చైనా జేబుల్లో ఉండే నేతలు కాదని, బైడెన్తోనూ ఇదే తరహా సమస్య అని వివేక్ రామస్వామి విమర్శలు గుప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.