Vladimir Putin: పుతిన్ ఆరోగ్యంపై వార్తలు.. క్రిమియా వంతెనను సందర్శించిన రష్యా అధ్యక్షుడు!
పుతిన్ జారి మంచాన పడ్డారని పశ్చిమ దేశాల పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించారు. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి క్రిమియా వంతెనను సందర్శించారు.
ఇంటర్నెట్డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల బాంబుదాడిలో దెబ్బతిన్న క్రిమియా వంతెన( Crimean bridge)ను సందర్శించారు. ఈ వీడియోలో పుతిన్ (Putin) స్వయంగా మెర్సిడెస్ బెంజ్ కారును డ్రైవ్ చేస్తూ క్రిమియా వంతెనపై ప్రయాణించారు. ఈ దృశ్యాలను రష్యా(Russia)లో ఓ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ సమయంలో పుతిన్ పక్కన డిప్యూటీ ప్రధాని మారాట్ ఖుసులిన్ ఉన్నారు. ఈ సందర్భంగా వంతెనపై దాడి గురించి వారు చర్చించుకున్నారు.
‘‘వంతెన ఎడమ వైపు దాడి జరిగింది. ఇది పనిచేసే స్థితిలోనే ఉందని అనుకొంటున్నాను. అయినప్పటికీ దాని పనులను పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటికీ కొంత దెబ్బతిని ఉంది. దీనిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలి’’ అని పుతిన్ పేర్కొన్నారు. దాదాపు 19 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను 2018లో పుతిన్ ప్రారంభించారు. అప్పట్లో కూడా ఆయన ట్రక్కుపై స్వయంగా డ్రైవింగ్ చేస్తూ దీనిపై ప్రయాణించారు.
ఇటీవల కాలంలో వ్లాదిమిర్ పుతిన్ (Putin) ఆరోగ్యంపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఆయన చేతులు పర్పుల్ రంగులోకి మారిపోయాయని, తీవ్ర అనారోగ్యం వల్లే ఇలా జరిగిందంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. రెండు రోజుల క్రితం ఆయన.. మాస్కో(Masco)లోని తన అధికారిక నివాసంలో మెట్లు దిగుతుండగా పడిపోయారని, దీంతో తుంటి ఎముక విరిగిపోయిందని న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. తుంటి ఎముక దెబ్బతిన్న కారణంగా అతడి ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతోందని అందులో రాసుకొచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వార్తలు వెలువడుతున్న తరుణంలో రష్యా టెలివిజన్ ఈ దృశ్యాలను ప్రసారం చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు