Putin: పుతిన్కు క్యాన్సర్.. ఆ జంతువు కొమ్ముల రసంతో చికిత్స?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారా? గత కొన్నేళ్లలో పలుమార్లు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లింది క్యాన్సర్ చికిత్స కోసమేనా?......
పలుమార్లు అజ్ఞాతవాసానికి ఈ వ్యాధే కారణమన్న ప్రొయెక్ట్ మీడియా సంస్థ
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారా? గత కొన్నేళ్లలో పలుమార్లు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లింది క్యాన్సర్ చికిత్స కోసమేనా? ఇందుకు సంబంధించి రష్యాకు చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ ‘ప్రొయెక్ట్’ ప్రచురించిన కథనం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 2016 నుంచి పుతిన్ థైరాయిడ్ క్యాన్సర్ లేదా పార్కిన్సన్స్తో బాధపడుతున్నారని, దానికి చికిత్స చేయించుకునేందుకే పలుమార్లు అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రొయెక్ట్ తెలిపింది. అధ్యక్ష కార్యాలయ సర్జన్ తరచూ నల్ల సముద్రంలోని పుతిన్ నివాసానికి వెళ్లేవారని పేర్కొంది. ఓ జంతువు కొమ్ముల రసాన్ని చికిత్సలో వినియోగించినట్లు ప్రస్తావించింది.
2016 నుంచి 2019 వరకు థైరాయిడ్ క్యాన్సర్ సర్జన్తోపాటు చాలామంది వైద్యులు నగరంలోని పుతిన్ నివాసానికి వెళ్లినట్లు కథనం తెలిపింది. పుతిన్ అధికారిక సందర్శనల తేదీలను, ఆయన కనిపించకుండా పోయిన రోజులు, స్థానిక హోటల్లో బస చేసిన వివరాలను ప్రొయెక్ట్ వెల్లడించింది. పుతిన్ రాజకీయాల్లో గత 23 ఏళ్లుగా ఉన్నా ఆయన ఆరోగ్య, మానసిక పరిస్థితి పట్ల ప్రజలకు ఎలాంటి విషయం తెలియదని పేర్కొంది. అయితే ప్రస్తుతం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు ప్రొయెక్ట్ ఎడిటర్ రోమన్ బడానిన్ తెలిపారు.
ప్రొయెక్ట్ ఓ స్వతంత్ర రష్యన్ మీడియా. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో భాగంగా వార్తలు ప్రచురించినందుకుగానూ ప్రభుత్వం ఆ సంస్థపై నిషేధం విధించింది. 2016 నవంబరు నుంచి అధ్యక్ష ఆసుపత్రి వైద్యుల బృందం పుతిన్కు శస్త్రచికిత్స అందించి ఉండవచ్చని ప్రొయెక్ట్ కథనంలో వెల్లడించింది. చికిత్సలో భాగంగా ఎర్ర జింక కొమ్ముల నుంచి తీసిన రసంతో పుతిన్ స్నానం చేయాలని వైద్యులు సూచించినట్లు కథనంలో పేర్కొన్నారు. కాగా ఈ వైద్యబృందంలోని కొద్దిమందికి అవార్డులు, పదోన్నతులు లభించినట్లు కూడా తెలిపింది.
2016 నుంచి 2019 వరకు థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టులు 166 రోజులు సోచి నగరంలోని పుతిన్ నివాసంలో గడిపినట్లు రికార్డుల్లో ఉందని ప్రొయెక్ట్ ఎడిటర్ వివరించారు. అయితే పుతిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారా లేక ఇతర అనారోగ్యంతో ఉన్నారా అనే విషయాన్ని ప్రొయెక్ట్ నేరుగా ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే.. పుతిన్ ఆరోగ్యంపై ప్రొయెక్ట్ కథనాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కొట్టిపారేశారు. అధ్యక్షుడు థైరాయిడ్ సంబంధిత క్యాన్సర్కు చికిత్స తీసుకున్నారనే వార్తలన్నీ ఒక అభూత కల్పన, అబద్ధమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?