Vladimir Putin: రష్యాను ఎదుర్కోవడం సులువు కాదు..: పుతిన్
రణరంగంలో తమను ఓడించాలని చూసేవారికి ఒక విషయం అర్థం కావడం లేదని, ఆధునిక యుగంలో తమ దేశాన్ని ఎదుర్కోవడం సులువు కాదని అమెరికా, జర్మనీలను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.
ఆధునిక ముసుగులో నాజీ భావజాలం
అమెరికా, జర్మనీలను ఉద్దేశించి పుతిన్ వ్యాఖ్యలు
మాస్కో: రణరంగంలో తమను ఓడించాలని చూసేవారికి ఒక విషయం అర్థం కావడం లేదని, ఆధునిక యుగంలో తమ దేశాన్ని ఎదుర్కోవడం సులువు కాదని అమెరికా, జర్మనీలను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. స్టాలిన్ గ్రాడ్ యుద్ధం జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆనాటి పోరాటంలో భాగమైన వారికి పుతిన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ గ్రాడ్ వద్ద రష్యా.. 91 వేలమంది జర్మన్ బలగాలను బంధించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధగతిని మార్చింది. ఈ స్టాలిన్ గ్రాడ్ను ప్రస్తుతం వొల్గొగ్రాడ్గా వ్యవహరిస్తున్నారు.
అమెరికా 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకులు, జర్మనీ 14 లెపర్డ్ 2 యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్కు అందిస్తుండటంపై పుతిన్ మండిపడ్డారు. 80 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతమవుతోందని జర్మనీ ట్యాంకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘మేం మా ట్యాంకులను వారి సరిహద్దుల్లోకి పంపడం లేదు. కానీ, వారిని ఎదుర్కొనే మార్గాలున్నాయి. యుద్ధం ఆయుధాలకే పరిమితం కాదని వారు అర్థం చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆధునిక ముసుగులో నాజీ భావజాలాన్ని చూస్తున్నాం. అది మరోసారి మన దేశ భద్రతకు ముప్పుగా పరిణమించింది. పశ్చిమ దేశాల దురాక్రమణను కలిసికట్టుగా ఎదిరించాలి. జర్మనీ ట్యాంకులతో రష్యాకు ముప్పు ఉందనేది నమ్మలేని నిజం. అయితే, రష్యా తన భద్రతకు ప్రమాదంగా మారిన వాటికి గతంలో తగిన సమాధానం కూడా చెప్పింది’ అని పశ్చిమ దేశాలు మరీ ముఖ్యంగా జర్మనీని ఉద్దేశించి పుతిన్ పేర్కొన్నారు.
జెలెన్స్కీతో ఈయూ నేతల భేటీ
కీవ్, బెర్లిన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు చెందిన పలువురు అధికారులు శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. వీరిలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఛార్లెస్ మైఖెల్, 15 మంది యూరోపియన్ కమిషనర్లు ఉన్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు సహకరిస్తామని తెలిపేందుకు, అలాగే ఈయూలోనూ, నాటోలోను ఆ దేశం చేరికపై వారు చర్చించారు. మరోపక్క తమ దేశానికి చెందిన పాత తరం లెపర్డ్ 1 యుద్ధ ట్యాంకులను కూడా ఉక్రెయిన్కు అందించాలని జర్మనీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ అధికార ప్రతినిధి స్టెఫెన్ హెబెస్ట్రిట్ స్పష్టం చేశారు. అయితే ఎన్ని ట్యాంకులను పంపబోయేది ఆయన వివరించలేదు.
లిబియా, సూడాన్ల నుంచి వాగ్నర్ గ్రూప్ బహిష్కరణపై అమెరికా దృష్టి
కైరో: రష్యా అధ్యక్షుడు పుతిన్తో సన్నిహిత సంబంధాలు గల వాగ్నర్ గ్రూప్ను కల్లోలిత లిబియా, సూడాన్ల నుంచి బహిష్కరించేందుకు అమెరికా తన చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈజిప్టు, యూఏఈలతో సంప్రదింపులు జరుపుతోంది. తద్వారా సూడాన్, లిబియాల్లోని సైనిక నేతలపై ఆ గ్రూపుతో సంబంధాలు తెంచుకునేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల కొన్ని నెలల క్రితమే వాగ్నర్ గ్రూప్పై అమెరికా పలు ఆంక్షలను విధించింది. కిరాయి సైనికులతో నడిచే ఈ గ్రూపు రష్యా ఒలిగార్క్ యెవ్జెనీ ప్రిగోఝిన్కు చెందినది. ఆయన పుతిన్కు అత్యంత సన్నిహితుడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్
పాకిస్థాన్(Pakistan)లో ‘ఎక్స్’పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి పునరుద్ధరించాలని ఆ దేశ కోర్టు ఆదేశించింది. -
జీవం పోయకముందే.. వేలాది ‘ప్రాణాలు’ గాల్లో!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది. -
అరుదైన ఘటన..బుల్లెట్ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యం
జపాన్(Japan)లో రైళ్లు సమయపాలనకు పెట్టింది పేరు. అలాంటిది ఒక బుల్లెట్ రైలు ఏకంగా కొన్నినిమిషాల పాటు ఆలస్యమైంది. అందుకు కారణం ఏంటంటే..? -
భారీ వర్షాల ఎఫెక్ట్.. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాల రద్దు
Dubai Rains: భారీ వర్షాల కారణంగా భారత్-దుబాయ్ మధ్య విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు రద్దయ్యాయి. -
సూర్యరశ్మే శిశువుకు ఆహారమట.. సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్ఫ్లుయెన్సర్
Social Media: సోషల్ మీడియాలో ఆదరణ కోసం కొంత మంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా రష్యాలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పనికి సొంత బిడ్డే బలయ్యాడు. -
ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామంటూ మోదీ హెచ్చరిక..అమెరికా ఏమందంటే..?
దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే.. తగిన సమాధానం చెప్తామని, ఒకవేళ వారు పాకిస్థాన్కు పారిపోయినా వదలమని మనదేశం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా అమెరికా (USA) స్పందించింది. -
ఏడాదిన్నర వాన గంటల్లోనే.. ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వరద
Dubai Rains: దుబాయ్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎయిర్పోర్టులో మోకాలి లోతు నీరు చేరి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. -
రొమ్ము క్యాన్సర్తో ఏడాదికి 10 లక్షల మరణాలు!
ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ మహమ్మారి ముప్పు ముంచుకొస్తోందని లాన్సెట్ కమిషన్ హెచ్చరించింది. 2040 నాటికి ఏడాదికి పది లక్షల మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించే అవకాశం ఉందని తెలిపింది. -
యూఏఈని ముంచెత్తిన భారీ వర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వానలకు ప్రధాన రహదారులు, వీధుల్లోకి నీరు చేరింది. దుబాయ్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. -
పత్రాల్లో పొరపాటు.. ఒక జంట బదులు మరొకరికి విడాకులు
బ్రిటన్లోని ఓ సంస్థ చేసిన చిన్న తప్పువల్ల ఒక జంట బదులు మరో జంటకు విడాకులు మంజూరయ్యాయి. ఆన్లైన్ వేదికగా విడాకులకు దరఖాస్తు చేసుకున్న దంపతులు.. ఇంకా అది చర్చల దశలో ఉండగానే విడాకులు పొందారు. -
అనుమతి లేకుండా అశ్లీల డీప్ఫేక్ చిత్రాలు సృష్టించడం నేరమే: బ్రిటన్
వ్యక్తుల అనుమతి లేకుండా, వారి అశ్లీల చిత్రాలను డీప్ఫేక్ విధానంలో సృష్టించడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. -
మహమ్మారుల నిరోధంలో 50 దేశాలకు అమెరికా చేయూత
కరోనా తరహా మహమ్మారి ఆకస్మికంగా విరుచుకుపడి జనజీవనాన్ని స్తంభింపజేసే పరిస్థితులు మరోసారి రాకుండా చూసేందుకు 50 దేశాలకు అమెరికా చేయూత అందించనుంది. -
అమెరికాలో హిందువులపై పెరిగిన దాడులు
అమెరికాలో హిందువులపై దాడులు గణనీయంగా పెరిగాయని, ఇవి మరింత ఉద్ధృతం కావొచ్చని ఇండో-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
‘ఏఐ’ భామలకు.. అందాల పోటీ..!
కృత్రిమ మేధతో సృష్టించిన సుందరాంగుల కోసం ‘మిస్ ఏఐ’ పోటీ సిద్ధమైంది. మిస్ ఇండియా వంటి పోటీల మాదిరిగానే వీటి ప్రతిభను పరీక్షించి ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. -
కోర్టులో కునుకు తీసిన ట్రంప్..?
తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందారన్న కేసులో భాగంగా కోర్టు ఎదుట హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. విచారణ సమయంలో కునుకు తీసినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఆయన బృందం స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్
-
జీవం పోయకముందే.. వేలాది ‘ప్రాణాలు’ గాల్లో!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
-
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!