Ukraine Crisis: పుతిన్ కుమార్తెలపై ఆంక్షలకు ఈయూ సిద్ధం..!
రష్యాకు చెందిన పలు రంగాల్లోని ప్రముఖులు, సంస్థలపై దృష్టి కేంద్రీకరించిన ఈయూ దేశాలు.. పుతిన్ కుమార్తెలపైనా ఆంక్షలకు ఉపక్రమిస్తున్నట్లు ఈయూ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఉక్రెయిన్పై మారణహోమానికి ప్రతిస్పందన చర్యలు
మాస్కో: ఉక్రెయిన్పై సైనిక చర్య చేపట్టిన రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ముందువరుసలో ఉన్న యూరోపియన్ యూనియన్ (EU).. ఇప్పటికే స్విఫ్ట్ నుంచి తొలగించడంతోపాటు ఇతర ఆంక్షలను ప్రకటిస్తోంది. ముఖ్యంగా రష్యాకు చెందిన పలు రంగాల్లోని ప్రముఖులు, సంస్థలపై దృష్టి కేంద్రీకరించిన ఈయూ దేశాలు.. పుతిన్ కుమార్తెలపైనా ఆంక్షలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్లో రష్యా సేనలు చేస్తోన్న మారణకాండకు ప్రతిస్పందనగా ఈయూ ఈ చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
రష్యా కొనసాగిస్తోన్న దురాక్రమణపై తీవ్రంగా మండిపడుతోన్న ఈయూ దేశాలు.. పుతిన్ సన్నిహితులపై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా రష్యాకు చెందిన రాజకీయ నాయకులు, టైకూన్లతోపాటు పలువురు ప్రముఖుల ఆస్తులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే పుతిన్ ఇద్దరు కుమార్తెలపైనా ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. ఏయే చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రతిపాదిత జాబితాను ఈయూ సిద్ధం చేసింది. ఇందుకు ఈయూ సభ్యదేశాలు ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే, పుతిన్ కుమార్తెలు కాటెరినా, మరియాలకు రష్యా వెలుపల ఆస్తులు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. అయినప్పటికీ ప్రతీకార చర్యలో భాగంగా పుతిన్ దృష్టికి తీసుకెళ్లేలా వీరిద్దరి పేర్లను ఆంక్షల జాబితాలో ఈయూ దేశాలు చేర్చినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై స్పందించిన క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్.. ఈయూ ప్రతిపాదన గురించి తనకు తెలియదన్నారు.
వారి గురించి అంతా రహస్యమే..
పుతిన్ కూతుళ్లకు సంబంధించిన విషయాలు అత్యంత రహస్యంగానే ఉంటాయి. వారి పేర్లతో పాటు ఫొటోలను కూడా రష్యా అధ్యక్ష భవనం ఎన్నడూ అధికారకంగా వెల్లడించలేదు. వివిధ పేర్లను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటుంది. అయితే, 2015లో కుమార్తెలకు సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించిన పుతిన్.. ఇద్దరు అమ్మాయిలు రష్యన్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారని, పలు భాషలను మాట్లాడగలరని మాత్రమే వెల్లడించారు. ఇక కరోనా వ్యాక్సిన్ తొలిసారి రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రకటించిన సందర్భంలోనూ తన కుమార్తె టీకా తీసుకున్నట్లు పుతిన్ వెల్లడించారు. ఇక ఇద్దరిలో పెద్ద కూతురు మరియా వొరొన్త్సోవా.. రష్యాలో ప్రజారోగ్య విభాగంలోని ఓ అతిపెద్ద ప్రైవేటు కంపెనీలో భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. కాటెరినా మాత్రం మాస్కో స్టేట్ యూనివర్సిటీలో కృత్రిమ మేధకు సంబంధించిన ఓ ఇన్స్టిట్యూట్ను నడిపిస్తున్నారు. అయితే, రష్యా వెలుపల వారికున్న ఆస్తులపై మాత్రం స్పష్టత లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?