Ukraine Crisis: మా దేశం ఒంటరిగా మిగిలింది.. రష్యా టార్గెట్ నేనే..!
శత్రుదేశం రష్యా మొదటి గురి తనేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వాపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
కీవ్: శత్రుదేశం రష్యా మొదటి గురి తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
‘శత్రుదేశం నన్ను నంబర్ వన్ టార్గెట్గా గుర్తించింది. ఆ తర్వాత వారి లక్ష్యం నా కుటుంబం. దేశాధినేతను గద్దె దింపేసి, వారు ఉక్రెయిన్ను రాజకీయంగా ధ్వంసం చేయాలనుకుంటున్నారు. కానీ, నేను, నా కుటుంబం ఈ దేశాన్ని విడిచిపెట్టిపోం. కీవ్లోనే ఉండిపోతాం’ అని జెలెన్స్కీ ప్రతిజ్ఞ చేశారు.
మరోపక్క, ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఒంటరిగా మిగిలిపోయిందని ఆయన తీవ్రంగా వాపోయారు. ‘మా దేశాన్ని కాపాడుకునే విషయంలో మేం ఒంటరయ్యాం. మాతో కలిసి పోరాడేందుకు ఎవరున్నారు? నాకైతే ఎవరూ కనిపించలేదు. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వంపై హామీ ఇవ్వడానికి ఎవరున్నారు? అందుకు అందరూ భయపడుతున్నారు’ అని విచారం వ్యక్తం చేశారు.
యుద్ధం ముగింపునకు రష్యా మాతో మాట్లాడాలి..
‘ఇరు దేశాల మధ్య జరుగుతోన్న సైనిక పోరు ముగియాలంటే రష్యా మాతో మాట్లాడాల్సి ఉంటుంది. ఈ చర్చ ఎంత త్వరగా ప్రారంభమైతే, రష్యాకు ఎదురయ్యే నష్టం అంత తక్కువగా ఉంటుంది. అలాగే ఈ దాడులు ముగిసేవరకు.. మా దేశానికి రక్షణగా నిలుస్తాం’ అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణపై ఉక్రెనియన్, రష్యన్ భాషల్లో రష్యాకు సందేశం పంపారు.
గురువారం ఉదయం ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య చేపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఉక్రెయిన్లోకి దూకుడుగా ముందుకెళ్తోన్న రష్యా.. కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక వైమానిక స్థావరాలు, రక్షణశాఖ ఆయుధగారాలపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ సైనిక పోరులో ఇప్పటివరకు 137 మంది తమదేశ వాసులు ప్రాణాలు కోల్పోయారని జెలెన్స్కీ వెల్లడించారు. మృతుల్లో సైనికులు, సాధారణ పౌరులు ఉన్నారని తెలిపారు. సుమారు 316 మంది గాయపడ్డారని తెలిపారు. అలాగే రష్యాకు చెందిన విధ్వంసక బృందాలు రాజధాని నగరం కీవ్లోకి ప్రవేశించాయని, అంతా కర్ఫ్యూను పాటించాలని ప్రజల్ని అప్రమత్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్