Ukraine War: బక్ముత్ నగరంపై వాగ్నర్ పట్టు..?
ఉక్రెయిన్కు కీలకమైన బక్ముత్పై పోరు తీవ్రమైంది. ఇప్పటికే ఈ నగరాన్ని తాము ఆక్రమించుకొన్నట్లు వాగ్నర్ గ్రూప్ ప్రకటించింది.
ఇంటర్నెట్డెస్క్: రష్యా(Russia)తో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్(Ukraine )కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. రష్యా దళాలు మరింత ముందుకొచ్చేందుకు ఇప్పుడు అవకాశం లభించింది. ఈ పోరులో కీలకమైన బక్ముత్ నగరాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు క్రెమ్లిన్ కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు రాత్రివేళ నగర సిటీ హాల్లో రష్యా పతాకాన్ని ఎగురవేసినట్లు పేర్కొంది. ఆ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ ఓ వీడియోలో మాట్లాడుతూ బక్ముత్ ఇక అధికారికంగా రష్యా సొంతమైనట్లు పేర్కొన్నారు. అయితే పశ్చిమ ప్రాంతాల్లో ఉక్రెయిన్ దళాలు బలంగా ఉన్నట్లు అంగీకరించారు.
మరోవైపు ఈ వీడియోను ఉక్రెయిన్ అధికారులు తోసిపుచ్చారు. ఇప్పటికీ ఈ నగరం తమ ఆధీనంలో ఉన్నట్లు వెల్లడించారు. ‘‘శత్రువులు బక్ముత్పై దాడులను ఆపడంలేదు. కానీ, ఉక్రెయిన్ రక్షకులు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ వాటికి దీటుగా సమాధానం ఇస్తున్నారు’’ అని ఉక్రెయిన్ సైనిక దళాల జనరల్ స్టాఫ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడ జరుగుతున్న పోరుపై ‘ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీ ఆఫ్ వార్’ అంచనాల ప్రకారం బక్ముత్లో ఎక్కువ ప్రదేశం ఉక్రెయిన్ ఆధీనంలోనే ఉంది. కానీ, రష్యా సేనలు తూర్పు దక్షిణ దిశలుగా కమ్ముకొస్తున్నాయి. తూర్పు వైపు నుంచి చేసిన దాడులతో సిటీహాల్ భవనాన్ని ఆక్రమించుకొంది. ఇక్కడ జరిగే పోరులో వాగ్నర్ గ్రూప్ భారీగా నష్టాలను చవిచూసిందని వెల్లడించారు. ఈ గ్రూప్తోపాటు రష్యా దళాలు కూడా భారీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్ దళాలు ఇక్కడ అద్భుతంగా పోరాడుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం అభినందించారు.
దాదాపు 70,000 మంది ప్రజలున్న బక్ముత్ నగరం పై గతేడాది రష్యా దాడులు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఇక్కడ పోరాటం ఆగలేదు. తాజాగా ప్రిగోజిన్ ప్రకటనపై అనుమానాలు ఉన్నాయి. అతడు గతంలో యుద్ధం పూర్తికాక ముందే ప్రకటనలు చేశాడు. ఉప్పు గనుల నగరం సొలెడార్ ఆక్రమణ సమయంలో కూడా ప్రిగోజిన్ ప్రకటనలు గందరగోళం సృష్టించాయి. బక్ముత్ నగరం ఉక్రెయిన్ చేజారితే రష్యా బలగాలు మరింత ముందుకెళ్లే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. దొనెట్స్క్ దిశగా బక్ముత్ నుంచి ఇతర నగరాలకు చొచ్చుకొనిపోవడానికి వారికి సులువవుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM