Time Theft: వర్క్ ఫ్రమ్ హోంలో ఆఫీస్ సమయం వృథా.. మాజీ ఉద్యోగినికి రూ.3లక్షల ఫైన్
వర్క్ఫ్రం హోం సమయంలో ఆఫీస్ సమయాన్ని వృథా చేశారనే కారణంతో ఓ ఉద్యోగినికి రూ.3లక్షల జరిమానా పడింది. ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో ఉద్యోగి పనితీరును విశ్లేషించినట్లు సదరు కంపెనీ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు ఇంటి నుంచే పని (Work from Home)కు అనుమతించాయి. దీంతో ఇంటినుంచే స్వేచ్ఛగా పనిచేసుకునే సౌలభ్యం ఉద్యోగులకు లభించింది. అయితే, దీన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు కంపెనీలు గుర్తిస్తున్నాయి. ఈ తరుణంలో ఆఫీస్ సమయాన్ని వృథా చేశారని.. అందుకు కంపెనీకి రూ.3లక్షలు చెల్లించాలని ఓ ఉద్యోగినిని ఆదేశించింది. ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్తో ఉద్యోగిని పనితీరును విశ్లేషించి ‘సమయం చోరీ’ చేసిన విషయాన్ని గుర్తించినట్లు సదరు కంపెనీ పేర్కొనడం గమనార్హం.
కెనడాకు చెందిన కార్లే బెస్సె అనే మహిళ.. అక్కడి బ్రిటిష్ కొలంబియాలోని ఓ సంస్థలో అకౌంటెంట్గా పనిచేసేవారు. అయితే, ఆ సంస్థ ఆమెను ఉద్యోగం నుంచి గతేడాది తొలగించింది. కారణం మాత్రం చెప్పలేదు. దీంతో తనకు పరిహారం చెల్లించాలని ఆ ఉద్యోగిని సంస్థను డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం కాస్త కోర్టుకు చేరింది.
తన వ్యక్తిగత సమాచారాన్ని ఎలా పర్యవేక్షిస్తారని సదరు మహిళ చేసిన ఆరోపణలను ఆ సంస్థ తోసిపుచ్చింది. కేవలం ఆఫీస్ డాక్యుమెంట్లను మాత్రమే తమ సాఫ్ట్వేర్ పర్యవేక్షిస్తుందని తెలిపింది. తమ సాఫ్ట్వేర్ ఎంత కచ్చితంగా పనిచేస్తుందోననే విషయాన్ని కూడా వివరించింది. 50గంటలపాటు ఆమె లాగిన్ అయినట్లు చూపించినప్పటికీ ఆ సమయంలో తనకు అప్పజెప్పిన పని మాత్రం చేయలేదని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ విశ్లేషణను కోర్టు ముందు ఉంచింది. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి.. ఉద్యోగిని తొలగించిన వ్యవహారాన్ని పక్కన బెడితే.. కంపెనీ సమయాన్ని వృథా చేసినందుకు ఆ మాజీ ఉద్యోగినే సంస్థ నుంచి వివిధ రూపాల్లో పొందిన ప్రయోజనాల మొత్తం రూ.3లక్షలు తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది.
ఆఫీస్ సమయాల్లో ఉద్యోగి పనిచేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని టైమ్క్యాంప్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో సదరు కంపెనీ పర్యవేక్షించేదట. ఆఫీస్ డాక్యుమెంట్లను ఎంత సేపు ఓపెన్ చేసి ఉంచారు, వాటిని ఎలా ఉపయోగించారనే విషయాలను ఈ సాఫ్ట్వేర్ పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో కార్లే బెస్సె ఆఫీస్ టైంలో ఎక్కువగా కంప్యూటర్కు దూరంగా ఉన్నట్లు తేలిందని ఆ సంస్థ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.