Srilanka Crisis: శ్రీలంకలో ఏం జరుగుతోంది.. 10 కీలక పాయింట్లు!
శ్రీలంకలో కొనసాగుతోన్న సంక్షోభం రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభానికి తోడు అధికార కూటమి నుంచి.......
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: శ్రీలంకలో కొనసాగుతోన్న సంక్షోభం రోజురోజుకీ మరింతగా ముదురుతోంది. ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభానికి తోడు అధికార కూటమి నుంచి దాదాపు 50 మంది చట్టసభ్యులు బయటకు వెళ్లిపోవడంతో రాజపక్స సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జనం రోడ్లెక్కి ఆగ్రహావేశాలు వెల్లగక్కడంతో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
- ఔషధాల కొరత వేధిస్తుండంతో శ్రీలంక పలు అంతర్జాతీయ సంస్థల సాయాన్ని కోరుతోంది. దేశంలో 40 రకాల ఔషధాలు, అత్యవసర మందుల కొరత ఉన్నట్టు ఔషధాల పంపిణీ, నియంత్రణ మంత్రిత్వశాఖ తెలిపింది. శ్రీలంకలో సాధారణంగా 1325 రకాల ఔషధాలు సరఫరా చేస్తుండగా.. వాటిలో 400 వరకు అత్యవసరమైనవనీ.. వీటిలో దాదాపు 40 రకాల ఔషధాల కొరత వేధిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
- శ్రీలంక కరెన్సీ విలువ మరింతగా క్షీణించింది. డాలర్తో పోలిస్తే శ్రీలంకన్ రూపాయి విలువ 319.99గా ఉన్నట్టు శ్రీలంక సెంట్రల్ బ్యాంకు వెల్లడించింది.
- శ్రీలంక వెళ్లాలనుకొనే తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. లంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఔషధాలు, ఇంధన కొరతతో పాటు కొవిడ్ నేపథ్యంలో అక్కడి వెళ్లే విషయాన్ని పునరాలోచించుకోవాలని సూచించింది. అలాగే, దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ అగ్రరాజ్యం ట్రావెల్ అడ్వెయిజరీని విడుదల చేసింది.
- శ్రీలంకలో అధ్యక్ష వ్యవస్థను రద్దు ప్రతిపాదనల్ని ఆ దేశంలోని ప్రతిపక్షాలు ముందుకు తీసుకొస్తున్నాయి. ఆ దిశగా బిల్లు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనను అతి త్వరలోనే పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్టు ప్రతిపక్షానికి చెందిన నేత లక్ష్మణ్ కిరిల్ల తెలిపారు.
- శ్రీలంక సెంట్రల్ బ్యాంకు మాజీ గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ విదేశీ ప్రయాణాలపై కొలంబో మెజిస్ట్రేట్ కోర్టు నిషేధం ప్రకటించింది. ఆయన దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. ఈ నెల 18న కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. అజిత్ నివార్డ్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్గా ఉన్న కాలంలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపుతూ శ్రీలంక సదరన్ ప్రావిన్స్ మాజీ గవర్నర్ కీర్తి తెన్నాకూన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు పై ఆదేశాలు ఇచ్చింది.
- శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు వ్యతిరేకంగా అమెరికాలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. లాస్ఏంజెల్స్లోని ఆయన కుమారుడి ఇంటి వద్ద కొందరు శ్రీలంకకు చెందిన పౌరులు గుమిగూడారు. తన తండ్రిని ఇంటికి పిలవాలంటూ నినాదాలు చేస్తున్నారు.
- కాగితం కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ లంకలో సామాజిక మాధ్యమాలే ప్రత్యామ్నాయమవుతున్నాయి. డాలర్ సంక్షోభంతో లెటర్స్ ఆఫ్ క్రెడిట్ జారీ చేయకపోవడం వల్ల శ్రీలంకలో పేపర్ కొరత మరింత తీవ్రమైనట్టు శ్రీలంక పబ్లిషర్స్ అసోసియేషన్ కోశాధికారి సెల్వం కెటిస్ పేర్కొన్నారు. ఆర్థికమంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యాంకు ఇతర సంబంధిత సంస్థల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ఇంకా పరిష్కారం చూపలేదన్నారు. దీనిపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్ క్రెడిట్ లైన్ కింద పేపర్ దిగుమతి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
- సంక్షోభం నేపథ్యంలో సాధ్యమైనంత వరకు కాగితాన్ని పరిమితంగానే వాడాలని శ్రీలంక హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాల అధికారులకు ఆదేశించింది. వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ యాప్లను ప్రత్యామ్నాయంగా వినియోగించాలని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచించడం అక్కడి సంక్షోభానికి అద్దంపడుతోంది.
- దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న వేళ శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స, క్రీడల మంత్రి నమల్ రాజపక్స ఈరోజు మిరిహనాలోని గొటబాయ అనధికారిక నివాసానికి వచ్చారు. మిరిహనాలోని శ్రీలంక దేశాధ్యక్షుడు గొటబాయ ఇంటి వద్ద నిన్న భారీ సంఖ్యలో నిరసనకారులు ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయన రాజీనామాకు నిరసనకారులు డిమాండ్ చేయడంతో పోలీసులు భాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించారు. ఆందోళనకారులు కొన్ని వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో నిరసనకారులతో పాటు కొందరు పోలీసులు, విలేకర్లు, పౌరులకు గాయాలయ్యాయి. ఈ హింసకు సంబంధించిన కేసులో 50 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ శ్రీలంక ఆర్థిక మంత్రిగా బాధ్యతల్లోకి వచ్చిన 24గంటల్లోనే అలీ సార్బే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ స్థానంలోకి వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఖాళీగానే ఉంది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అనేక మంది ఎంపీలు వెనకడుగు వేస్తుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్