Ukraine Crisis: నాటోలో చేరటం ఎలా..? ఉక్రెయిన్కు ఎందుకు సాధ్యం కాలేదు..?
ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన యుద్ధం ఐరోపాలోని ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుందా..? అంటే కచ్చితంగా ‘కాదు’ అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి ప్రధాన కారణాల్లో నాటో ఒకటి. కీవ్ నాటోలో చేరడం ఇష్టంలేని మాస్కో యుద్ధం మొదలుపెట్టింది. తాజాగా రష్యాతో
ఫిన్లాండ్, స్వీడన్ ప్రకటనలతో మరోసారి తెరపైకి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన యుద్ధం ఐరోపాలోని ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుందా..? అంటే కచ్చితంగా ‘కాదు’ అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి ప్రధాన కారణాల్లో నాటో ఒకటి. కీవ్ నాటోలో చేరడం ఇష్టంలేని మాస్కో యుద్ధం మొదలుపెట్టింది. తాజాగా రష్యాతో 1,340 కిలోమీటర్ల సరిహద్దు పంచుకొంటున్న ఫిన్లాండ్ నాటోలో చేరతామని ప్రకటించింది. కొన్ని దశాబ్దాలుగా తటస్థంగా ఉన్న ఈ దేశం తాజా పరిణామాలతో నాటో వైపు మొగ్గింది. దీంతో ‘ఫిన్లాండైజేషన్’ పేరిట ఈ దేశంపై సోవియట్ యూనియన్.. ఆ తర్వాత రష్యా చూపించిన ప్రభావం భవిష్యత్తులో అదృశ్యం కానుంది.
ఫిన్లాండ్ ప్రకటన వెలువడిన గంటల్లోనే స్వీడన్ కూడా అదేబాట పట్టింది. తాజాగా స్వీడన్ ప్రధాని మాగ్డలీనా అండర్సన్ కూడా తమ దేశం నాటోలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. తీవ్రంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించారు. దీంతో దాదాపు 200 ఏళ్ల నుంచి అనుసరిస్తున్న తటస్థవైఖరికి గుడ్బై చెప్పనున్నట్లైంది. ‘‘మా సోషల్-డెమొక్రటిక్, తటస్థవైఖరి మాకు బాగానే ఉపయోగపడింది. కానీ, భవిష్యత్తులో ఆ విధానం పెద్దగా ఉపయోగపడదని మా విశ్లేషణలో తేలింది. వాస్తవాన్ని అంగీకరించాలి. 2022 ఫిబ్రవరి 24కు ముందు.. తర్వాత అని చూడాలి. ఆ రోజు తర్వాత ఐరోపా, స్వీడన్ ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
నాటో అంటే ఏమిటీ..?
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) ఒక సైనిక కూటమి. సోవియట్ విస్తరణను అడ్డుకోవడానికి 1949లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, కెనడా సహా 12 దేశాలు కలిసి దీనిని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత దీనిని విస్తరించారు. ప్రస్తుతం 30 సభ్యదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా సోవియట్ యూనియన్ పతనం తర్వాత పలు తూర్పు ఐరోపా దేశాలు సభ్యత్వం తీసుకొన్నాయి. వీటిల్లో కొన్ని రష్యాతో నేరుగా సరిహద్దులు పంచుకొంటున్నాయి.
సభ్యత్వం ఇచ్చేది ఇలా..
ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరే ప్రక్రియ పూర్తికావాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు రష్యా నుంచి దాడి ఎదురైతే ఆ దేశాలకు సైనిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని యూకే, అమెరికా ఇప్పటికే వెల్లడించాయి. తమ కూటమిలో చేరేందుకు దరఖాస్తు చేసుకొన్న దేశంలోని పరిస్థితులను నాటో సభ్యదేశాలు అధ్యయనం చేసి.. మార్పులు చేర్పులు సూచిస్తూ ఓ యాక్షన్ ప్లాన్ను ఇస్తాయి. దరఖాస్తు చేసుకొన్న దేశం వాటిని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. 2020లో నాటో సభ్యత్వం తీసుకొన్న నార్త్ మసెడోనియాకు రెండేళ్ల సమయం పట్టింది. ఈ దేశం 1999 నుంచి నాటో ఇచ్చిన మెంబర్షిప్ యాక్షన్ ప్లాన్ను అమలు చేయడం మొదలుపెట్టింది.
ముఖ్యంగా నాటోలో చేరాలనుకునే దేశాల్లో ప్రజాస్వామ్యం ఉండాలి. మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయి ఉండాలి. దీంతోపాటు ఆ దేశంలోని అల్పసంఖ్యాక వర్గాలపై ఎటువంటి వివక్ష లేకుండా సమానంగా చూడాలి. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకొనేందుకు సిద్ధంగా ఉండాలి. నాటో కూటమి కార్యకలాపాల్లో సైనిక సహకారం అందించడానికి సద్ధంగా ఉండాలి. ప్రజస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి సైన్యంపై నియంత్రణ ఉండాలి. ఎలాంటి సరిహద్దు వివాదాలు ఉండకూడదు. దీంతోపాటు రక్షణ రంగంపై సభ్య దేశాలు.. తమ జీడీపీలో 2 శాతం వెచ్చించడానికి అంగీకరించాలి. నాటోలోని 30 సభ్యదేశాలు 2021లో 1,174 బిలియన్ డాలర్లను సైన్యంపై ఖర్చుపెట్టాయి. 2020లో ఈ బడ్జెట్ 1,106 బిలియన్ డాలర్లుగా ఉంది.
2008లో ప్రకటించినా.. ఉక్రెయిన్కు సభ్యత్వం ఎందుకు రాలేదు..?
2008లోనే ఉక్రెయిన్, జార్జియా దేశాలు భవిష్యత్తులో తమ సభ్యులు అవుతాయని నాటో ప్రకటించింది. కానీ, పాలన, పారదర్శకతలో నాటో ప్రమాణాలు అందుకోవడంలో ఉక్రెయిన్ విఫలమైంది. ఆ దేశంలో ఉన్న అవినీతి, బలహీనమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కారణంగా సభ్యత్వం రాలేదు. కానీ, రష్యా నుంచి ఉక్రెయిన్ను కాపాడేందుకు నాటో సాయం చేస్తోంది.
2014లో రష్యా క్రిమియా ద్వీపకల్పం, తూర్పు ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించిన సమయంలో నాటో దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. కీవ్ ఆత్మరక్షణకు అవసరమైన సాయం అందించడం మొదలుపెట్టాయి. కానీ, క్రిమియా ద్వీపకల్పం ఆక్రమణతో తలెత్తన సరిహద్దు వివాదం ఉక్రెయిన్కు పెద్ద అడ్డంకిగా మారింది. ఆ వివాదం పరిష్కరించుకోకుండా ఉక్రెయిన్ నాటోలో చేరే అవకాశం లేదు.
తూర్పు ఐరోపాలో నాటో బలం ఎంత..?
నాటో ఉత్తరాన బాల్టిక్ నుంచి దక్షిణాన రొమేనియా వరకూ బలగాలను మోహరించిది. రష్యా క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించిన నాటి నుంచి ఆ దళాలు ఇక్కడే ఉంటున్నాయి. రష్యా, ఉక్రెయిన్తో సరిహద్దు పంచుకొనే సభ్యదేశాలకు రక్షణగా 40,000 స్ట్రాంగ్ రెస్పాన్స్ ఫోర్స్ను పంపాయి. ఫైటర్ జెట్లు, యుద్ధనౌకలు, విమాన వాహక నౌకలతో కూడిన క్యారియర్ గ్రూపులను అప్రమత్తంగా ఉంచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి. -
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..