ukraine conflict: రష్యా జీవనాడిపై అమెరికా గురి..!
ప్రపంచలో ఆయుధాలు శక్తి చూపించే రోజులు మారాయి.. ఆర్థిక అవసరాలే ఆయా దేశాలను నడిపిస్తున్నాయి. యుద్ధం చేయాలన్నా వనరుల సమీకరణకు నిధులు కావాల్సిందే.
సంక్షోభం అంచున నార్డ్స్ట్రీమ్-2 పైపులైన్
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ప్రపంచంలో ఆయుధ శక్తి చూపించే రోజులు మారాయి.. ఆర్థిక అవసరాలే ఆయా దేశాలను నడిపిస్తున్నాయి. యుద్ధం చేయాలన్నా వనరుల సమీకరణకు నిధులు కావాల్సిందే. ఆర్థిక వనరులు లేకనే ఉత్తరకొరియా, ఇరాన్ వంటి దేశాల వద్ద ఆయుధాలు ఉన్నా.. ప్రత్యర్థులపై దూకుడుగా యుద్ధాలకు వెళ్లలేకపోతున్నాయి. అందుకే ప్రత్యర్థులను అణచివేసేందుకు ఆర్థిక ఆంక్షలు శక్తిమంతమైన ఆయుధాలుగా మారాయి. తాజాగా ఉక్రెయిన్-రష్యా సరిహద్దులు బద్దలయ్యేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మారాయి. ఏ క్షణమైనా నిప్పులు చిమ్ముకొంటూ యుద్ధం మొదలు కావచ్చు. ఈ క్రమంలో రష్యాను లొంగ దీసుకోవడానికి ఉన్న ఆయుధాలకు అమెరికా పదును పెడుతోంది. రష్యా ఆర్థిక జీవనాడి అయిన గ్యాస్ సరఫరాపై దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో రష్యా ఐరోపాకు గ్యాస్ సరఫరా చేసేందుకు నిర్మించిన నార్డ్స్ట్రీమ్-2 పైపులైన్ను నిర్వీర్యం చేయాలని భావిస్తోంది. కానీ, అదే జరిగితే అమెరికా మిత్ర దేశాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు.
ఏమిటీ నార్డ్స్ట్రీమ్-2 పైపులైన్..!
రష్యాలో భారీ ఎత్తున సహజవాయు క్షేత్రాలు ఉన్నాయి. ఫలితంగా అత్యధికంగా, చౌకగా గ్యాస్ ఎగుమతి చేసే దేశాల్లో రష్యా కూడా ఉంది. రష్యా నుంచి చౌకగా గ్యాస్ను జర్మనీకి సరఫరా చేయడానికి 750 మైళ్ల పొడవునా బాల్టిక్ సముద్రంలో దీనిని నిర్మించారు. ఈ ప్రాజెక్టును 2015లో ప్రకటించారు. దీనిని అమెరికా, యూకే, ఉక్రెయిన్, ఐరోపా సమాఖ్యలోని కొన్ని దేశాలు వ్యతిరేకించాయి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మాస్కోకు ఐరోపా సమాఖ్యపై పట్టు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ, 2021 సెప్టెంబర్లో నిర్మాణం పూర్తయింది. దీనికి జర్మనీ నియంత్రణ సంస్థల నుంచి ఇంకా అనుమతి రాలేదు. ఈ పైప్లైన్ నిర్మాణానికి 11 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించారు. దీని నుంచి ఏటా 55 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ను సరఫరా చేయొచ్చు. ఇది జర్మనీ సంవత్సరం మొత్తం వినియోగించే దాని కంటే 50శాతం ఎక్కువ. ఈ పైపు లైన్ నుంచి రష్యాకు చెందిన గ్యాజ్ప్రామ్కు 15 బిలియన్ డాలర్లకు పైగా వార్షికాదాయం అందే అవకాశం ఉంది. రష్యా గ్యాస్ ఎగుమతులను ఈ కంపెనీ చూసుకొంటోంది.
ఆర్థిక అవసరాలే ముఖ్యం..
మధ్య, తూర్పు ఐరోపా దేశాల్లో ఇంధనం రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో రష్యా అక్కడ కీలకమైంది. ఇప్పటికే పలు మార్గాల్లో రష్యా ఐరోపాదేశాలకు గ్యాస్ సరఫరా చేస్తోంది. కాకపోతే ఆ దేశాలకు అవసరమైన మొత్తం కంటే తక్కువగానే సరఫరా చేస్తోందని అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ ఇటీవల ఆరోపించింది. ఈ నేపథ్యంలో నార్డ్స్ట్రీమ్-2 ప్రాజెక్టులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని జర్మనీ తీవ్రంగా యత్నిస్తోంది. రష్యా కూడా అదే కోరుకుంటోంది. కానీ, ఉక్రెయిన్ సరిహద్దులను రష్యా దళాలు మోహరించడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది.
రంగంలోకి జర్మనీ..
పరిస్థితి దిగజారకుండా జర్మనీ యత్నాలను మొదలు పెట్టింది. ఇటీవల జర్మన్ ఛాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్ శ్వేత సౌధం సందర్శించిన సమయంలో ఈ పైపులైన్ను అమెరికా ఆంక్షల గురి నుంచి తప్పించేందుకు యత్నించారు. కానీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాత్రం ఏ మాత్రం లొంగలేదు. ‘‘రష్యా ఆక్రమణ చేస్తే.. ఇక నార్డ్స్ట్రీమ్-2 పైపులైన్ను మర్చిపోవడమే. దాని అంతం మేము చూస్తాము’’ అని తేల్చి చెప్పారు. ఇక చేసేది లేక జర్మనీ ఛాన్స్లర్ కూడా బైడెన్తో గొంతు కలిపారు. ‘‘మేము ఐక్యంగా ఉన్నాము.. మేము తీసుకొనే చర్యలు రష్యా భరించలేని స్థాయిలో ఉంటాయి’’ అని హెచ్చరించారు.
నిజంగానే ఈ ప్రాజెక్టును అమెరికా అడ్డుకొంటుందా..?
ఈ అంశంపై అమెరికా అధికారులు స్పందిస్తూ.. రష్యా దురాక్రమణకు పాల్పడితే అమెరికా ఈ ప్రాజెక్టుపై చర్యలు తీసుకొంటుందని చెప్పారు. కానీ,ఎలాంటి చర్యలో వివరించలేదు. బైడెన్ ఇటీవల స్పందిస్తూ.. ‘‘నేను పక్కాగా చెబుతున్నా.. మేము అది చేయగలం’’ అని పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా 2017, 2019, 2020ల్లో కొన్ని ఆంక్షలు విధించింది. జనవరి 2021 జనవరిలో ట్రంప్ పాలన చివరి సమయంలో మరికొన్ని ఆంక్షలు విధించారు. ఈ ప్రాజెక్టు ఉపయోగంలోకి రాకుండా అడ్డుకొనే శక్తి తమకు ఉందని అమెరికా చెబుతోంది.
ఈ ప్రాజెక్టు కోసం పనిచేసే కంపెనీలను ఆర్థిక ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఆ కంపెనీలకు బ్యాంకింగ్ సౌకర్యాలు దూరమవుతాయి. దీంతో పైప్లైన్ నిర్వహణ కష్టమవుతుంది. మరోపక్క రష్యా దూకుడు కారణంగా జర్మనీ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావడం కూడా కష్ట సాధ్యంగా మారుతుంది. ఎందుకంటే వీటి అనుమతులు పూర్తిగా చట్టాల ఆధారంగా లభిస్తాయి గానీ.. రాజకీయ జోక్యంతో కాదు.
పరస్పరం ఆధారపడిన వ్యవస్థలు..
ఐరోపా ఖండానికి రష్యా నుంచి లభించే చౌక గ్యాస్ అవసరం ఉంది. అదే సమయంలో గ్యాజ్ప్రామ్ ద్వారా ఐరోపా నుంచి లభించే సొమ్ము అవసరం రష్యా బడ్జెట్కు ఉంది. ఇప్పటికే ఐరోపా సమాఖ్య చాలా సందర్భాల్లో గ్యాజ్ప్రామ్తో యాంటీ మోనోపోలి నిబంధనలు పాటించేలా ఒత్తిడి చేసి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో అమెరికా నార్డ్స్ట్రీమ్-2పై ఒత్తిడి పెంచి రష్యా దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ (Maryam Nawaz) తన తండ్రి చెప్పిన మాటలను ప్రస్తావించారు. -
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి రష్యాకు చెందిన ఓ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. -
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు