Ukraine Crisis: నీట మునిగిన రష్యా అణ్వాయుధాలు..?
ప్రపంచంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత ఓ యుద్ధనౌక నీటమునిగిన ఘటన ఇటీవల నల్లసముద్రంలో చోటు చేసుకొంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను బాగా రెచ్చగొట్టిన ఘటన ‘మాస్క్వా’పై దాడి.
‘మాస్క్వా’లో రెండు వార్హెడ్లు ఉన్నట్లు అనుమానాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ప్రపంచంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత ఓ యుద్ధనౌక నీటమునిగిన ఘటన ఇటీవల నల్లసముద్రంలో చోటు చేసుకొంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను బాగా రెచ్చగొట్టిన ఘటన కూడా ‘మాస్క్వా’పై దాడే. నల్ల సముద్రంలోని రష్యా దళాలకు చెందిన అత్యంత కీలకమైన నౌక ఇది. రాజధాని మాస్కో పేరిట దీనిని నిర్మించారు. ఈ నౌక ధ్వంసంతో అణ్వాయుధాలు కూడా సముద్రంలో కలిసినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ నౌకపై ఎంతలేదన్నా.. రెండు అణు వార్హెడ్లు ఉన్నట్లు అంచనావేస్తున్నారు. అంతేకాదు.. రష్యా ఆయుధ అసమర్థతగా ఈ ఘటనను చిత్రీకరించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. ఈ ఘటన ఒక్క రష్యాకే కాదు.. ప్రపంచంలో సైనిక వ్యూహకర్తలకు కూడా కొత్త సమస్యలను సృష్టించింది.
అణు వార్హెడ్లు కూడా సముద్రంలోకి..?
మాస్క్వాపై మంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. కానీ, ఉక్రెయిన్ దళాలు దాడికి ముందు బైరక్తర్ టీబీ-2 డ్రోన్లను ప్రయోగించి రష్యా నౌక ఎయిర్ డిఫెన్స్ దృష్టి మళ్లించాయి. ఆ తర్వాత రెండు నెప్ట్యూన్ క్షిపణులను ప్రయోగించి నౌకను ధ్వంసం చేశాయి. ‘ది బ్లాక్సీ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్’ ప్రాజెక్టు మేనేజర్ ఆండ్రీ క్లైమెన్కో అంచనా ప్రకారం మాస్క్వా నౌకలో కనీసం రెండు అణు వార్ హెడ్లు ఉన్నాయి. కాకపోతే నౌకలో పేలుడు చోటు చేసుకొన్నాక అణ్వాయుధాలను ఏం చేశారన్న వివరాలు వెల్లడికాలేదు. ఈ నౌకపై పీ-1000 వుల్కాన్ క్యారియర్ కిల్లర్ క్షిపణులను అమర్చారు. దీంతో వీటికి అమర్చేలా ‘టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్’లను కూడా ఈ నౌకలో భద్రపర్చే అవకాశం ఉంది. ఇవి నీట మునిగితే మరో ‘బ్రోకెన్ యారో’ ఘటనగా నిలిచే అవకాశం ఉంది. అణ్వాయుధాలకు సంబంధించి పేలుడు లేకుండా జరిగే ప్రమాదాలను అమెరికా సైన్యం బ్రోకెన్ యారోగా పిలుస్తుంది. దీంతో భవిష్యత్తులో నల్లసముద్ర తీరంలోని టర్కీ, రొమానియా వంటి దేశాలు రష్యాను ఈ వార్హెడ్లపై ప్రశ్నించే అవకాశం ఉంది. రష్యా వద్ద 2022 నాటికి మొత్తం 6,000 అణు వార్హెడ్లు ఉన్నాయి.
మరణాలపై గందరగోళం..
మాస్క్వాపై జరిగిన దాడిలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయంపై రష్యా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ‘టాస్’ న్యూస్ ఏజెన్సీ మాత్రం సిబ్బందిని సెవస్టపోల్కు తరలించినట్లు సమాచారం అందిందని పేర్కొంది. మరోవైపు ఆ దేశ రక్షణశాఖ కూడా మాస్క్వా సిబ్బందిగా పేర్కొంటున్న 100 మందికి పైగా ఉన్న పరేడ్ చిత్రాన్ని విడుదల చేసినట్లు బీబీసీ వెల్లడించింది. కానీ, కీవ్ మాత్రం మొత్తం 510 మంది సిబ్బంది మరణించినట్లు చెప్పుకొంటోందని డెయిలీమెయిల్ పత్రిక కథనంలో పేర్కొంది. అయితే, అమెరికాకు చెందిన నౌకాదళ నిపుణులు మాత్రం తమ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి దాదాపు 200 మందికిపైగా మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మాస్క్వా మంటల్లో చిక్కుకొన్న సమయంలో రష్యా సహాయక చర్యలు చేపట్టిన దృశ్యాలు ఉపగ్రహాలకు చిక్కాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నీట మునిగిన అతిపెద్ద యుద్ధనౌకల జాబితాలో మాస్క్వా స్థానం దక్కించుకొంది.
చివరిసారిగా ఓ యుద్ధనౌక ఎప్పుడు మునిగింది..?
1982లో జరిగిన ఫాక్లాండ్ దీవుల యుద్ధంలో అర్జెంటీనాకు చెందిన జనరల్ బెల్గ్రానో అనే యుద్ధ నౌకను బ్రిటన్కు చెందిన అణుశక్తి సబ్మెరైన్ హెచ్ఎంఎస్ కాంకరర్ ఓ టోర్పిడోను ప్రయోగించి ముంచి వేసింది. ఈ ఘటనలో 323 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నౌక కూడా మాస్క్వా వలే 182 మీటర్ల పొడవుతో 12,000 టన్నుల బరువు ఉంటుంది.
దక్షిణ చైనా సముద్రాన్ని తాకిన ప్రకంపనలు..
తైవాన్ సైనిక శక్తితో అయినా సరే ఆక్రమించుకోవాలనుకొంటున్న చైనాకు.. మాస్క్వాపై దాడి ఓ హెచ్చరికలా పనిచేస్తుందని రాండ్ కార్పొరేషన్ రక్షణ రంగ పరిశోధకుడు టిమోతీ హీత్ పేర్కొన్నారు. భారీగా ఉండే యుద్ధనౌకలకు ఉండే బలహీనతలను ఈ ఘటన తెలియజేస్తోందని పేర్కొన్నారు. అమెరికా, చైనాలు ఈ విషయంలో అప్రమత్తం అవ్వాల్సిందేనని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారీ ఎత్తున యుద్ధనౌకలు ఈ రెండు దేశాల వద్దే ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికా తన యుద్ధనౌకలను చైనా యాంటీ షిప్ మిసైల్స్ రేంజి కంటే దూరంగానే ఉంచేందుకు చూస్తుంది. అదే సమయంలో తైవాన్ భారీగా యాంటీ షిప్ మిసైల్స్ను కొనుగోలు చేస్తోందని చైనాకు తెలుసు. అటువంటి సమయంలో తైవాన్ ఆక్రమణకు చైనా తెగబడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హీత్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్