Vedant Patel: ఆయన టాలెంట్ అమోఘం.. రోజూ బైడెన్కు సహకరిస్తుంటారు..!
అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాస భారతీయులు కీలక స్థానాల్లో కొలువుదీరి, ఆ దేశ ప్రగతికి తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన హయాంలో భారతీయ అమెరికన్లకు పెద్దపీటే వేశారు.
శ్వేతసౌధంలో ప్రవాస భారతీయుడిపై ప్రశంసలజల్లు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాస భారతీయులు కీలక స్థానాల్లో కొలువుదీరి, ఆ దేశ ప్రగతికి తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన హయాంలో భారతీయ అమెరికన్లకు పెద్దపీటే వేశారు. వారంతా శ్వేతసౌధంలో అధ్యక్షుడి కార్యకలాపాలు సజావుగా సాగేలా.. చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అందులో ఒకరే వేదాంత్ పటేల్. ఆయన శ్వేతసౌధంలో అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆయనపై ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనో అద్భుతమైన రచయితని, నిత్యం బైడెన్తో సహా తమకు సహకరిస్తుంటారని అభినందించారు.
‘మీకు సులభమైన పని అప్పగించామంటూ తరచూ మేం వేదాంత్ను ఆటపట్టిస్తుంటాం. కానీ అలా ఏముండదు. ఆయన సూపర్ టాలెంటెడ్ కాబట్టి, పని సులభంగా మారుతుంటుంది. ఆయన గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చాలా అందంగా రాస్తారు. అంతే వేగంగా కూడా పనిచేస్తారు. ఆయనకు ప్రభుత్వంలో మున్ముందు మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్నాను. ప్రతిరోజు అధ్యక్షుడికి, మాకు సహకరించే విషయంలో ఆయన వ్యవహరించే తీరు అద్భుతం’ అంటూ జెన్సాకీ మెచ్చుకున్నారు.
ఈ వేదాంత్ ఎక్కడివారు..?
వేదాంత్ పటేల్(32) స్వరాష్ట్రం గుజరాత్. వేదాంత్ పుట్టిన తర్వాత ఆయన కుటుంబం కాలిఫోర్నియాకు వలస వెళ్లింది. అక్కడే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (రివర్సైడ్) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత ఎంబీఏ పట్టా పొందారు. శ్వేతసౌధంలో అసిస్టెంట్ మీడియా సెక్రటరీగా చేరకముందే.. ఎన్నికల ప్రచారంలో బైడెన్తో కలిసి పనిచేశారు. 2012లో మాజీ చట్టసభ సభ్యుడు మైక్ హోండా వద్ద డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా తన వృత్తిని ప్రారంభించారు. తర్వాత అంచలంచెలుగా ఎదిగి, ఇప్పుడు బైడెన్కు అడుగడుగునా సహకరిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్, వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రశ్నలకు ఈయనే బదులిస్తారు.
‘1991లో మా కుటుంబం గుజరాత్ నుంచి ఇక్కడకు వచ్చింది. అప్పటి నుంచి నా తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, కృషి వల్లే ఈ రోజు నేను శ్వేతసౌధంలో కూర్చొని పనిచేస్తున్నాను’ అంటూ గతంలో చేసిన ట్వీట్లో వేదాంత్ తన మూలాలను గుర్తుచేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
భారత్కు రష్యా అందజేయాల్సిన మిగతా రెండు ‘ఎస్-400’ అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదే చేరుకుంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. -
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్.. వీటికి అడ్డుకట్ట వేసే ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) ఆమోదం తెలిపింది. -
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ